ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్‌ | AP Assembly Budget Session 2026 Day 1 Begins Today Live Updates, Governor Abdul Nazeer To Address Both Houses | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్‌

Feb 11 2026 9:27 AM | Updated on Feb 11 2026 10:26 AM

AP Assembly Session 1st Day Live Updates

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌.. 

 👉 ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యులు వాకౌట్‌.

వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన..

  • అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన.
  • గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
  • ఏపీలో శాంతిభద్రతలు కాపాడాలని నినాదాలు.
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు.
  • ‍ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌. 
  • సభ్యుల హక్కులను కాపాడాలని నినాదాలు.
  • నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌
  • మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌.
  • వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన, నినాదాల మధ్యే కొనసాగుతున్న గవర్నర్‌ ప్రసంగం. 

     

 

👉  ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ 
 👉 ప్రారంభమైన ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు

 👉  14న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం
 👉  నెలరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం 
 👉  వైస్సార్సీపీకి ప్రజల పక్షాన నిలుస్తోంది: అప్పిరెడ్డి

 👉  ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించకుండా చేయాలని ప్రభుత్వం కుట్రపన్నుతుంది
 👉  వైస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి
 👉  ప్రధాన  ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని  వైఎస్సార్సీపీ  నేతల డిమాండ్.

👉 ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  అసెంబ్లీ పరిసరాల్లో వైఎస్ జగన్ నిరసన ప్రదర్శన చేపడుతున్నారు.

👉వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు.  మరికాసేపట్లో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సమావేశాల్లో పాల్గొననున్నారు.

👉నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమవేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హాజరు కానున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరు కానున్నారు. 

👉వెలగపూడి­లోని అసెంబ్లీ హాలులో ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు.

👉14న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మార్చి 12 వరకూ సమావేశాలు జరుగుతా­యని ఇప్పటికే స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొత్తం 19 పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలపనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement