ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి | Tragic End To Vacation As Delhi Techie Found Dead In Mussoorie | Sakshi
Sakshi News home page

ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి

Jun 16 2026 7:40 PM | Updated on Jun 16 2026 8:07 PM

Tragic End To Vacation As Delhi Techie Found Dead In Mussoorie

ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్‌స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆయన కూడా పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి, ఆమె భర్త జూన్ 13న ఢిల్లీ నుండి రిషికేష్‌కు ప్రయాణమై.. మరుసటి రోజు (జూన్ 14) అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్రి ధార్‌లోని 'కియానా హోమ్‌స్టే'కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు 'బ్లిస్' అనే పేరున్న గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం ఆయన నిద్ర లేచేసరికి.. భర్తకు తన భార్య దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు.

రూమ్‌లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి, శ్రీచరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement