విశాఖపట్నం : భానుడి సెగలకు నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. సేదతీరడానికి సాగరమే సరైన చిరునామా అనిపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో విశాఖ రుషికొండ తీరం పర్యాటకుల నవ్వులతో, అలల కేరింతలతో పోటెత్తింది.
ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం తరలివచ్చిన జనంతో తీరమంతా జనసముద్రాన్ని తలపించింది. నీలిరంగు అలల తాకిడి, చల్లని సముద్ర గాలుల మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఉత్సాహంగా గడిపారు.
యువత సెల్ఫీలతోసందడి చేస్తుంటే, చిన్నారులు ఇసుక గూళ్లు కడుతూ మురిసిపోయారు. తీరంలోని స్పీడ్ బోట్లపై పర్యాటకులు రయ్రయ్మంటూ దూసుకుపోయారు. మొత్తానికి, ఎండల సెగను మర్చిపోయి నగరవాసులు తమ వారాంతాన్ని ప్రకృతి ఒడిలో మధురంగా ముగించారు.
–ఫొటోలు: సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


