విశాఖలో ఇవాళ(జూన్ 10, బుధవారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. సెవెన్హిల్స్ ఆసుపత్రిలో స్టీల్ప్లాంట్ బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్.. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కార్మిక సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అక్కడ నుంచి గాజువాక కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న వైఎస్ జగన్.. చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు.


