విశాఖపట్నం : జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జేడీ వార్షిక డిజైన్ అవార్డులు–2026’ వేదికపై వినూత్న వ్రస్తాలంకరణతో మోడల్స్ ర్యాంప్పై హొయలుపోయారు.
బీచ్రోడ్డులోని ఒక హోటల్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్షోను రేస్ ఎంటర్టైన్మెంట్స్ సమన్వయంతో నిర్వహించారు.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. ఇలా పంచభూతాల ప్రేరణతో ‘వసుధైవ కుటుంబం’ అనే థీమ్తో విద్యార్థులు ఈ డిజైనర్ దుస్తులను మలిచారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ రూపొందించిన ఈ కలర్ఫుల్ దుస్తులను ధరించి ముంబై, బెంగళూరు, పశ్చిమ బెంగాల్ కు చెందిన మోడల్స్ ర్యాంప్పై నడుస్తుంటే వేదిక ధగధగలాడింది.


