viral photo
-
60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
బరువు తగ్గడం అనేది పెద్ద టాస్కే. అదీ 50 దాటిన తరువాత అధిక బరువును తగ్గించు కోవడానికి చాలా కృషి, పట్టుదల, ప్రేరణ కావాలి. ఇతర ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వెయిట్ లాస్ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్రముఖ నిర్మాత,సల్మాన్ ఖాన్ స్నేహితుడు, సాజిద్ నదియాడ్ వాలా బరువును తగ్గించుకుని ఫిట్గా మారిన తీరు అభిమానులను ఆశ్చర్యపర్చింది. అతని బాడీలోని భారీ పరివర్తన, బాగా బరువు తగ్గి స్మార్ట్గా తయారైన అతడి ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రానికి సాజిద్ నిర్మాత. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సాజిద్ ఫేస్ ఆఫ్ ది ఇంటర్నెట్గా మారిపోయాడు. అతని భార్య వార్దా ఖాన్ బాగా సన్నగా ఉన్న భర్త సాజిద్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. రిప్డ్ జీన్స్, డెనిమ్ జాకెట్, బటన్స్ లేని షర్ట్లో అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాజిద్ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా 59 ఏళ్ల వయసులో, ఆరోగ్యంగా, సంతోషంగా, ఫిట్గా కనిపిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.“ఎంత సెక్సీ లుక్… అబ్ తో ఫిల్మ్ మే హీరో బన్నే కా సమయ్ ఆ గయా హై” (సెక్సీగా ఉన్నారు.. ఇక సినిమాల్లో హీరో ఐపోయే సమయం వచ్చింది.)"అప్నా అస్లీ సికందర్ యే హై (మా నిజమైన సికందర్)" , ‘‘యువ హీరోలకు కఠినమైన పోటీ...” ,“21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు! జవానీ కా రాజ్ క్యా హై?” ( ఈ యంగ్ లుక్ వెనుక రహస్యం ఏమిటి?), తదితర వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నిర్మించిన ‘సికందర్’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈద్కు విడుదల కానున్న ఈ మూవీలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్ , శర్మన్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు.50ల తరువాత బరువు తగ్గడం, జాగ్రత్తలు శరీరం వయస్సు పెరిగే కొద్దీ, కండరాలు, అవయవాలు, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. 50 ఏళ్లు దాటాకి ఇది మరీ పెరుగుతుంది. అందుకే ఆహారం, వ్యాయామం , జీవనశైలిపై దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది. ఈక్రమంలో పురుషులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను పరిశీలిద్దాంహైడ్రేషన్: 60కి సమీపిస్తున్న తరుణంలో వెయట్ లాస్ అంటే చాలా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా హైడ్రేషన్ అనే గోల్డెన్ టిప్ను అస్సలు మిస్ చేయకూడదు. ఇది శరీరాన్ని ఫిట్గా ఉంచి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది, టాక్సిన్స్ను బయటకు పంపుతుంది.ఆహారం: కండరాల బలం కోసం చికెన్, గుడ్డు, పనీర్, కాయధాన్యాలు వంటి ప్రోటీన్లున్న ఫుడ్ తీసుకోవాలి. జీర్ణక్రియకోసం తృణధాన్యాలు, కరిగే ఫైబర్, పండ్లు , కూరగాయలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన మెటబాలిజం రేటుపై శ్రద్ధపెట్టాలి. .తీపి పదార్థాలకు దూరంగా : తీపి పానీయాలు, చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. లేదంటే అరుగుదల సమస్యలు, కొవ్వు పేరుకు పోవడం లాంటి సమస్యలొస్తాయి.వ్యాయామం: ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. బాడీలో అన్ని ఎ ముకలు, కీళ్ల కీళ్ల స్వేచ్ఛా కదలికల నిమిత్తం క్రమం తప్పకుండా వ్యాయామం చాలా అవసరం. ఇది మొత్తం కండరాల, ఎముక బలానికి కూడా సహాయపడుతుంది.నిద్రకు ప్రాధాన్యత: సరియైన నిద్ర అనేది మరో ప్రధాన మైన నియమం. నాణ్యమైన 8-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇది శరీరం కోలుకోవడానికి,విశ్రాంతికి సహాయపడుతుంది. -
మైమరపించే అందాలతో మాయ చేస్తున్న అనిఖా సురేంద్రన్ ఫొటోస్
-
ఈ వయసులో కూడా ఇంత అందమా.. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సీనియర్ హీరోయిన్ లైలా ఫొటోస్
-
Ananya Nagalla: శ్రీశైలం గుడిలో శివ దర్శనం చేసుకున్న సెలబ్రిటీ అనన్య నాగళ్ల ఫొటోస్
-
కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!
-
పిల్లల పరీక్షలు, పెద్దోళ్లకు అగ్నిపరీక్ష! ఈ విషయాలు గుర్తుంచుకోండి!
చెన్నైలో CBSE పరీక్షల సమయంలో స్కూల్ గోడ ఎక్కి, తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.ఇలాంటి ఘటనలు ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి?🔹మన విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంత ఒత్తిడిని పెడుతోంది?🔹తల్లిదండ్రుల ఆందోళన పిల్లల మనసుపై ఎలా ప్రభావం చూపుతోంది?🔹తల్లిదండ్రుల ప్రేమ వారికి బలాన్ని ఇస్తుందా, భయాన్ని పెంచుతుందా?ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల కన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటున్న వారు తల్లిదండ్రులే. "తప్పక పాస్ అవ్వాలి!", "అగ్రశ్రేణి మార్కులు రావాలి!", "లేకపోతే భవిష్యత్తు అంధకారం!" – ఇవీ తల్లిదండ్రులలో నిండిపోయిన భయాలు. ర్యాంక్ కోసమే మన ప్రేమ అని పిల్లలకు అనిపించకూడదు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి తల్లిదండ్రులు చేయకూడనిది...❌ హెలికాప్టర్ పేరెంటింగ్:ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రులు గమని…పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?✅ పరీక్ష ఫలితాలు ఆశించినంత రాలేదనుకోండి. పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు, "నీ ప్రయత్నం గొప్పది, మార్కులు మాత్రమే జీవితానికి అద్దం కాదు" అని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.✅ పిల్లలకు చదువు అంటే భయం కాకుండా ఆసక్తిగా ఉండేలా చేయండి. "ఏ విషయం నచ్చింది? ఏ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించింది?" అని అడిగితే, పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు.✅ "నీ ఫ్రెండ్ అజయ్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీవు ఎందుకు సాధించలేకపోతున్నావు?" అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చతాయి. ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఉంటుంది. అందుకే పోల్చడం మానండి.✅ తప్పిదాలను సహజంగా అంగీకరించండి. "ఈసారి ఏమి తప్పైంది? తర్వాత ఎలా మెరుగుపరచుకోవచ్చు?" అనే విధంగా ప్రశ్నించడం ద్వారా పిల్లలు సమస్యలను అర్థం చేసుకొని, మెరుగుపడటాన్ని నేర్చుకుంటారు.గుర్తుంచుకోవాల్సిన విషయాలు📌 పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. అవి ఒక చిన్న అంచనా మాత్రమే.📌 పిల్లలకు భయం పోగొట్టండి. పరీక్షలు అంటే భయపడేలా కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అనుభవంగా చూడమని ప్రేరేపించండి.📌 పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడితో విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఎదగాలి.📌 గోడలు ఎక్కే తల్లిదండ్రులు కాకుండా, పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి.పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే మంచి అవకాశంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తును భయంతో నింపకుండా, ధైర్యంగా ముందుకు నడిపిద్దాం!మీకేమైనా కౌన్సెలింగ్ సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.-సైకాలజిస్ట్ విశేష్ -
Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
నాణేనికి రెండు వైపుల మాదిరే.. సోషల్ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచిని ఎక్కువగా చర్చించినప్పుడు మధ్యలో చెడును.. అలాగే చెడుపై ఎక్కువగా చర్చ జరిగినప్పుడు మధ్యలో మంచి ప్రస్తావననూ తెస్తుంటుంది. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు.ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో.. అందంగా ఎడిట్ చేసిన ఆమె ఫొటో సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది అమ్మ గొప్పతనమంటూ ఆ ఫొటోలు స్టేటస్గా పెట్టుకున్నారు కూడా. మరోవైపు..This picture is representative of what Bharat truly is - young, responsible and hardworking. Balancing family and work. Instilling same values to the next generation. While we celebrate rich celebrities as icons, we tend to forget the real women of Bharat - young mothers who… pic.twitter.com/uZSCpTPIzm— Tejasvi Surya (@Tejasvi_Surya) February 17, 2025రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోకు స్పందించారు. నిజమైన భారత్ ఇదేనని, నారీ శక్తికి ఆమె ప్రతిరూపమంటూ కొనియాడారు. RPF ఇండియా కూడా ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. తన విధులతో పాటు తల్లిగా బాధ్యతను విస్మరించని కానిస్టేబుల్ రీనా గొప్ప యోధురాలు అంటూ గర్వంగా ప్రకటించుకుంది. అదే సమయంలో విమర్శలు మొదలయ్యాయి.She serves, she nurtures, she does it all—A mother, a warrior, standing tall…Constable Reena from 16BN/RPSF performing her duties while carrying her child, representing the countless mothers who balance the call of duty with motherhood every day.#NariShakti #HeroesInUniform… pic.twitter.com/enzaw0iDYo— RPF INDIA (@RPF_INDIA) February 17, 2025ప్రముఖ నగరాల్లో రైల్వేస్టేషన్లలో ఏమేరు రద్దీ ఉంటుందో చూస్తున్నదే. అలాగే ఈ మధ్య అయితే తోపులాట, తొక్కిసలాట ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారిని నియంత్రించాల్సిన బాధ్యత.. ఇలాంటి కానిస్టేబుళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అలా తన బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. బిడ్డల సంరక్షణ కోసం ఆర్పీఎఫ్ స్టేషన్లలో ఉండే సదుపాయాల్ని ఆమె వినియోగించుకోవాల్సిందని సూచిస్తున్నారు. మరోవైపు.. నారీశక్తి అని పిలడడంపైనా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిడ్డతో విధులకు హాజరుకావడాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అధికారులైనా ఈ విషయంలో చొరవ చూపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక.. బిడ్డ పెంపకం విషయంలోనూ ఆమెకు ఉన్న ఇబ్బందుల గురించీ, ఆమెపై ఉన్న బాధ్యతల గురించీ కొందరు ప్రస్తావిస్తున్నారు.Quit romanticising women doing it all by themselves. She should have help raising her baby when she's on duty, she absolutely doesn't need to do this alone, she's doing it because she has no choice, because men barely help with raising a child. Call it what it is: she's solidly… pic.twitter.com/G7M6LGXdOM— Dr. Ruchika Sharma (@tishasaroyan) February 17, 2025అదే సమయంలో.. ఆమెకు ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం.. అన్నింటికి మించి అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్గా మెప్పించడం గొప్ప విషయమని వాదిస్తున్నారు. -
మెహిందీ ఫంక్షన్కి, పర్ఫెక్ట్ మ్యాచ్ మస్టర్డ్ ఎల్లో ఘరారా (ఫోటోలు)
-
ప్రధాని మోదీ పక్కన ‘లేడీ ఎస్పీజీ’ వైరల్ : తప్పులో కాలేసిన కంగనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో లేడీ ఎస్పీజీ అంటూ ఈ ఫోటోను షేర్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది. అసలు సంగతి ఏంటంటే..బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో పక్కన బ్లాక్ డ్రెస్లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్పీజీ అంటూ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ. -
హడలెత్తిస్తున్న ఇంటి అద్దె!.. నెలకు ఇన్ని లక్షలా..
భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకుంటోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భూములు, అపార్ట్మెంట్ల ధరలు భారీగా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అద్దెలు కూడా ఈ నగరాల్లో అమాంతం పెరిగిపోతున్నాయి. ఇటీవల దీనికి సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జైపూర్కు చెందిన ఉత్కర్ష్ గుప్తా.. తన ఎక్స్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ముంబైలో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఇందులో 2 బీహెచ్కే హౌస్ అద్దె నెలకు రూ.1.35 లక్షలు. దీనికోసం రూ.400000 డిపాజిట్ చేయాలి అని ఉండటం చూడవచ్చు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే.. వాషింగ్ మెషీన్ టాయిలెట్ గదిలోనే ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?ప్రస్తుతం ఈ పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇది బ్రిలియంట్ ఐడియా అని చెబుతుంటే.. మరొకరు ఇది బాత్రూమేనా అని అంటున్నారు. మరికొందరు దాని అద్దె కూడా చాలా ఎక్కువని చెబుతున్నారు. మొత్తానికి దీన్ని చూస్తే ముంబైలో అద్దెలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.Only in Mumbai, you can front load your washing machine while top loading your commode.At an affordable price of 1.35L per month! pic.twitter.com/texU5hUwMC— Utkarsh Gupta (@PaneerMakkhani) September 22, 2024 -
ఇటలీ ప్రధానితో డేటింగ్? స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వీరు డేట్కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024కాగా మంగళవారం న్యూయార్క్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో.. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ మెలోనీకి అందజేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు. -
బాలీవుడ్ నటీ షబానా అజ్మీ ఇష్టపడే ఫుడ్స్ ఇవే..!
అంతర్జాతీయ గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి, భారత పార్లమెంటు సభ్యురాలు షబానా అజ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నటిగా ప్రేక్షకులను మెప్పించి ఎన్నో అవార్డులు అందుకుంది. పైగా యూఎస్ గుడ్విల్ అంబాసిడర్ కూడా. ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటారు. అలానే తాజాగా తన ఫుడ్ ట్రిప్కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ ఒక చోటే బ్రేక్ తీసుకుని మరీ ఇష్టంగా తిన్న తన ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. తాను పూణే నుంచి తిరుగు పయనంలో ఓ ప్రముఖ ఫుడ్ కోర్టు వద్ద ఆగమని, అక్కడ తాను తనకెంతో ఇష్టమైన వడపావ్ ఆస్వాదించనట్లు చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ మహారాష్ట్ర వంటకాలు కూడా చాలా బాగుంటాయని తెలిపారు. ఆమె నటించిన 'కైఫీ ఔర్ మెయిన్' తారాగణంతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చారు షబానా అజ్మీ. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shabana Azmi (@azmishabana18) (చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం
అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్గా అరుదైన గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేబూని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం మరేదీ ఉండదంటూ తన ఆనందాన్ని ప్రకటించింది.Hello Tarun Tahiliani!I have seen better Sarees sold in Mumbai streets for Rs.200 than these ceremonial uniforms you’ve ‘designed’.Cheap polyester like fabric, Ikat PRINT (!!!), tricolors thrown together with no imagination Did you outsource it to an intern or come up with it… https://t.co/aVkXGmg80K— Dr Nandita Iyer (@saffrontrail) July 27, 2024భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై దుమారంఅయితే అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు కట్టుకున్న చీరపై దుమారం రేగింది. తరుణ తహిలియానీ డిజైన్ చేసిన దుస్తులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. మీరు ‘డిజైన్ చేసిన’ ఈ యూనిఫామ్ల కంటే మెరుగైన చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్మడం నేను చూశాను. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, ఇకత్ ప్రింట్((!!!) త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఇంటర్న్కి అవుట్సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్ చేశారా? అంటూ ఆమె మండి పడ్డారు. భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై ఎన్ఐఎఫ్టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ సుసాన్ థామస్ (అఫ్సర్నామా) ఇన్స్టాగ్రామ్లో దృక్కోణాన్ని కూడా ప్రస్తావించారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాషన్ రాజధాని పారిస్లో, నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.TEAM INDIA IS HERE TO WIN 🇮🇳🫶💙#OpeningCeremony #Paris2024 #Olympic2024 #Paris #ParisOlympics #ParisOlympics2024 #paris2024olympics #Olympics #Olympics2024Paris #OlympicGames pic.twitter.com/7ELyTEFpMV— Ankit Avasthi Sir 🇮🇳 (@ankitavasthi01) July 27, 2024ప్రారంభ వేడుక కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వాన్ని హైలైట్ చేసే అసాధారణమైన దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించగా. ఈ జాకెట్లపై 'ఇండియా' ఇన్ స్రిప్ట్, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. మహిళలకు మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్ చేశారు. -
హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్!
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎందుకంటే.. అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది కాబట్టి. ఇదొక్క సంఘటనే కాదు.. 9 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. హమాస్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తాజాగా గాజాలో ఓ ఆస్పత్రిపై దాడులు జరిపింది. అక్కడ ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణీ అయిన ఒలా అద్నన్ హర్బ్ అల్ కుర్ద్ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే ఆమె కన్నుమూసింది. అయితే.. https://t.co/LpqLJTuEpp #unido #hostages #ceasefire Gaza hospital says newborn saved from dead mother's wombHe was placed in an incubator and transferred to Al-Aqsa Hospital in Deir el-Balah.— chemTrailActivist (@chemTrailActivi) July 20, 2024వైద్యులకు ఆల్ట్రాసౌండ్లో కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినిపించింది. దీంతో.. అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ బతకదని వైద్యులు తొలుత భావించారట. ఇంక్యూబేటర్లో పెట్టి డీర్ ఎల్-బలాహ్లోని మరో ఆస్పత్రికి తరలించారట. కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు కోలుకుంటున్నాడని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్నాక వలంటీర్లకు ఆ బిడ్డను అప్పజెప్తామని తెలిపారు వాళ్లు. యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. ఫొటో వైరల్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసి అందరినీ అశ్చర్యపరిచారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వ్యాన్ను స్వయంగా కేసీఆరే నడపటం వెనుక కథ వేరే ఉంది.కాగా గతేడాది డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ కాలు జారిపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్ను సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ నడుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్ను కేసీఆర్ గురువారం నడిపారు.కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడుపుతూ ఎర్రవల్లి పొరుగు గ్రామాలను సందర్శించారు. రోడ్లపై కనబడిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ తన వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. కేసీఆర్ పలుకరింపుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. -
Viral Photo: స్టూడెంట్ రాక్, టీచర్ షాక్.. గుండె నిండా అమ్మాయిలే
ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చిటికెలో అందరికీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, కామెడీ, ఫన్నీ విషయాలు ఎప్పటికప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైరల్గా మారుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివరించే బదులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో వివరించాడు.ప్రియ తనతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్గా ఉంటుందని, స్నాప్చాట్లో తనతో టచ్లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత తన క్లాస్మేట్ అని పేర్కొన్నాడు.ఆ సమాధానం చదివిన టీచర్ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు,విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్ రాక్.. టీచర్ షాక్’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా... ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్ స్పందించారు. -
అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నాడు. ఓ అందమైన ఫొటోతో తమ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు.కాగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శుబ్మన్ గిల్.. బ్యాటర్గానూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన పన్నెండు మ్యాచ్లలో కలిపి 426 పరుగులు చేయగలిగాడు.ఇక గిల్ సారథ్యంలో కేవలం ఐదు మ్యాచ్లే గెలిచిన గుజరాత్ ఎనిమిదో స్థానంలో నిలిచి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. ఓపెనర్గానూ విఫలం కావడంతో శుబ్మన్ గిల్పై ఐపీఎల్-2024 ప్రభావం గట్టిగానే పడింది.టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్కు ఎంపిక చేసిన భారత ప్రధాన జట్టులో గిల్కు చోటు దక్కలేదు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ స్థానం సంపాదించాడు.దీంతో ఓపెనింగ్ బ్యాటర్ గిల్కు కేవలం రిజర్వ్ ప్లేయర్గా అవకాశం దక్కింది. ఈ క్రమంలో లీగ్ దశలో అమెరికాలో మ్యాచ్లు పూర్తైన అనంతరం.. ఆవేశ్ ఖాన్(పేసర్)తో పాటు గిల్ను రిలీజ్ చేసింది బీసీసీఐ.అయితే, ఇందుకు శుబ్మన్ గిల్ క్రమశిక్షణా రాహిత్యమే కారణమని.. రోహిత్తో విభేదాల నేపథ్యంలో ఇన్స్టాలో కెప్టెన్ను అన్ఫాలో చేశాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే భారత బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ క్లారిటీ ఇవ్వగా.. గిల్ సైతం స్పందించాడు.అవును నిజమే.. సామీతో పాటు నేను కూడారోహిత్ శర్మతో కలిసి ఆత్మీయంగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘సామీ(సమైరా), నేను.. క్రమశిక్షణగా ఎలా ఉండన్న అంశం గురించి రోహిత్ శర్మ నుంచి నేర్చుకుంటున్నాం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందులో రోహిత్ తన ముద్దుల కుమార్తె సమైరా శర్మను ఎత్తుకుని ఉన్నాడు. ఇలా ఒక్క ఫొటోతో వదంతులకు బ్రేక్ వేశాడు గిల్.ఇక వరల్డ్కప్-2024లో ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియా.. తదుపరి మ్యాచ్లన్నీ వెస్టిండీస్లో ఆడనుంది. కాగా భారత్, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా గ్రూప్-ఏలో ఉండగా.. ఈ గ్రూపు నుంచి భారత్, అమెరికా సూపర్-8కు అర్హత సాధించాయి. మిగతా మూడు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: Saurabh Netravalkar: నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి! బ్యాగ్రౌండ్ ఇదే -
కేన్స్ రెడ్ కార్పెట్పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్పై వివిధ రకాల గౌనులు, డిజైనర్వేర్లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది. ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్కార్పెట్పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్ అయ్యేలా ఐమీ బారుహ్ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్ నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్ మీడియా పోస్ట్లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకానిక్ రెడ్ కార్పెట్పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్ఖారు ధరించి ర్యాంప్పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?) -
హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!
జీవితంలో ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం 'పెళ్లి'. అది తమ జీవితంలో మరుపురాని గుర్తులా ఉండేలా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటోంది యువత. అందుకోసం తమ తాహతకు తగ్గా రేంజ్లో డీజే మ్యూజిక్లు లేదా అందమైన టూరిస్ట్ ప్రదేశాల్లోనూ చేసుకుంటారు. విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అలానే ఇక్కడొక జంట ఏకంగా ఎముకలు కొరికే మంచు శిఖరాల్లో పెళ్లి జరగాలనుకుంది. అందుకని ఎక్కడకు వెళ్లారంటే..ఈ జంట ఏకంగా స్విట్జర్లాండ్లో జెర్మాట్లోని ఆల్ఫైన్ శిఖరాల వద్ద గ్రాండ్గా వివాహ వేడుకను జరుపుకుంది. బంధువుల, స్నేహితు ఆశ్వీరాదల నడుమ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. గజగజ వణికించే చలిలో చక్కటి వయోలిన్ మ్యూజిక్, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మిల్కీ వైట్ పెళ్లి దుస్తులతో పైనుంచి భువిపైకి వచ్చిన దేవతాల్లా ఉన్నారు. అక్కడొక పెద్ద మంచు క్యూబ్ సెట్టింగ్లో వధువరులిద్దరు చక్కగా కెమరాలకు ఫోజలిలస్తూ నిలబడ్డారు. మంచు శిఖరాలే తమ పెళ్లికి సాక్ష్యంగా.. ఏకంగా రెండు వేలకు పైగా ఎత్తులో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ఉన్న తెల్లటి మంచుకి తగ్గట్టూ పూల డెకరేషన్ ఓ రేంజ్లో అదరహో అన్నంతగా అద్భుతంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ వెడ్డింగ్ అడ్వెంచర్ అదిరిపోయింది బాస్, నిజజీవితంలో ఇలా మంచులో పెళ్లి చేసుకునే జంటను చూస్తానని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by LEBANESE WEDDINGS (@lebaneseweddings) (చదవండి: ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!) -
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రిలీ రొసోవ్కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
మనవరాలితో అదానీ మురిపెం : బిలియనీర్ ఫోటో వైరల్
అసలు కంటే వడ్డీ ముద్దు అనేది నానుడి. అంటే బిడ్డలతో పోలిస్తే మనవలు మనవరాళ్లపైనే తల్లితండ్రులకు ఎక్కువప్రేమ అభిమానం ఉంటుంది అని. చాలా సందర్బాల్లో ఇది అక్షరాలా అనిపిస్తుంది. ఇందులో బడా పారిశ్రామికవేత్తలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా బిలియనీర్, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ తన ముద్దుల మనవరాలిని చూసి తెగమురిసిపోతున్నారు. నీ కళ్లలోని మెరుపుతో పోలిస్తే ఈ ప్రపంచంలోని సంపద అంతా దిగ దుడుపే అన్నట్టు రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది. 14 నెలల మనవరాలు కావేరిని ఎత్తుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ప్రపంచంలో ఇంతకుమించిన సంపద ఏముందంటూ ఒక కవితా పదాలను రాయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్టాపిక్గా నిలిచింది. "ఇన్ ఆంఖోన్ కీ చమక్ కే ఆగే దునియా కీ సారీ దౌలత్ ఫీకీ హై. (నీ కళ్ల మెరుపులో ప్రపంచంలోని సంపద అంతా మసకబారుతుంది)" అంటూ ఉద్వేగంతో రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ- ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. వీరిలో పెద్ద కుమారుడు కరణ్- పరిధి ముద్దుల తనయ కావేరి. కాగా లండన్లోనే సైన్స్ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిన్నారితో ఫోటో తీసుకున్నారు. తన జీవితంలో మనవరాళ్లతో గడపడమే తనకు పని ఒత్తిడి (బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీవర్స్) పెద్ద ఉపశమనం అని గతంలో పేర్కొన్నారు. "నా మనుమరాళ్లతో సమయం గడపడం చాలా ఇష్టం, వారు నా ఒత్తిడిని తగ్గిస్తారు. నాకు రెండు ప్రపంచాలు ఒకటి ఉద్యోగం, రెండోది. కుటుంబం, కుటుంబమే నాకు గొప్ప శక్తి’’ గౌతమ్ అదానీ. इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। 🙏 pic.twitter.com/yd4nyAjDkR — Gautam Adani (@gautam_adani) April 2, 2024 -
స్టైయిలిష్ లుక్లో స్లిమ్గా కనిపిస్తున్న బోనీ కపూర్! ఎలా తగ్గారంటే..?
చిత్ర నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూరు స్లిమ్గా కనిపిస్తున్నారు. చాలా బరువు ఉండే ఆయన మంచి ఫిట్నెస్ లుక్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. తాను బరువుత తగ్గేందుకు ఎలాంటి కసరత్తులు చేశారో వెల్లడించారు. అంతేగాదు తనలా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ బోనీ కపూర్ వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే.. గతంలో 2004లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోల్లో బోనీ కపూర్ చాలా లావుగా, ఏజ్డ్ పర్సన్లా కనిపించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత పలు సందర్భాల్లో కెమరాకు చిక్కిన పోటోల్లో కూడా లావుగానే ఉన్నారు. అలాంటి ఆయాన అనూహ్యంగా 12 కిలోలలకు పైగా బరువు తగ్గడమే గాక న్యూలుక్లో కనిపిస్తున్నారు. బోనీ కపూరేనా అనిపించలా కొత్త స్టయిలిష్ లుక్లో దర్శనమిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఉన్న బోనీకపూర్కి ఈ న్యూలుక్లో ఉన్న బోనీ కపూర్కి ఎంత తేడా అని షాకయ్యేలా విజయవంతంగా బరువుతగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు బోనీకపూర్ మాట్లాడుతూ.."బరువు తగ్గేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారే తొందరగా బరువు తగ్గగలరని అన్నారు. అందుకోసం క్రమశిక్షణతో కూడిని జీవనశైలిని అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాను బరువు తగ్గే క్రమంలో నటి జాన్వీ కపూర్ ఉత్సహాపరిచేలా ప్రోత్సహించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. జాన్వీ సోషల్ మీడియాలో "నా పాపా బరువు తగ్గడంలో విజంయ సాధించినందుకు గర్వంగా ఉంది." అని పోస్ట్ చేసింది. ఇలా తన పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహమే తనను తొందరగా బరువు తగ్గేలా చేసేందుకు దోహదపడిందన్నారు. అలాగే తన మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్ కూడా బరువు తగ్గే ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆమెకి ప్రేరణ కలిగించేలా తాను బరువు తగ్గేందుకు ఉపక్రమించినట్లు తెలిపారు. అయితే తన కూతురు కూడా చక్కగా బరువు తగ్గి న్యూలుక్ మంచి ఫిట్నెస్తో అందంగా ఉందని చెప్పడమే గాకా ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. తనలా బరువు తగ్గాలనుకునేవారు తగ్గలేకపోతున్నాననే నిరాశకు లోనవ్వకూడదు. చివరి నిమిషం వరకు ఆశను కోల్పోకుండా ఉత్సాహభరితంగా కసరత్తులు చేస్తే దెబ్బకు బరువు తగ్గడం ఖాయ అని అన్నారు. అందుకు తానే నిదర్శనమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు." బోనీ కపూర్. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) (చదవండి: సెలబ్రెటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!) -
అతడితో చహల్ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా?
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘‘చహల్ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?! టీమిండియా బౌలర్గా కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్కు అప్పట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్చర్ను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్)గా ప్రమోషన్స్లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఝలక్ దిఖ్లా జా షోలో ఫైనల్స్ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్లో ఫైనల్ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీని అందుకున్నారు. What will be the Dhanashree Verma reaction if Yuzvendra Chahal does this constantly with his ladies friends ? We all are human and any husband who loves his wife will be hurt by these incidents. This is utter nonsense, and needs to be stopped. pic.twitter.com/xKW2tf7K9v — Sujeet Suman (@sujeetsuman1991) March 2, 2024 I wouldn't post such an intimate pic on instagram even if it was with my wife #ShameOnDhanshree #YuziChahal pic.twitter.com/9pEhXEmtAi — brigadier🇮🇳 (@brigadierdude) March 2, 2024 -
ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ‘రాంచి హీరో’ భావోద్వేగం
India vs England, 4th Tes: రాంచి టెస్టు హీరో ధ్రువ్ జురెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ధన్యవాదాలు తెలిపాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా రాజ్కోట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధ్రువ్ జురెల్. వికెట్ కీపర్ బ్యాటర్గా తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు.. అరంగేట్ర మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. రాజ్కోట్లో కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్ మెరుపులనూ చూపించాడు 23 ఏళ్ల జురెల్. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులతో మెరవగా.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే లేకుండా సహచరులు జట్టును గెలిపించారు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 ఇలా అరంగేట్రంలో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయిన ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో మాత్రం అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో మునిగిపోయిన తొలి ఇన్నింగ్స్లో విలువైన 90 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అంతకంటే గొప్ప ఇన్నింగ్సే ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో శుబ్మన్ గిల్(52- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియాను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘రోహిత్ భయ్యా, రాహుల్ సర్.. ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ వాళ్లిద్దరు తన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు పంచుకున్నాడు. కాగా ధ్రువ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. Thank you Rohit bhaiya, Rahul sir for believing in this boy 🙏🇮🇳❤️ pic.twitter.com/pBlojvB10p — Dhruv Jurel (@dhruvjurel21) February 26, 2024 కొడుకును కూడా తనలాగే సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెట్పై మక్కువతో అనేక కష్టనష్టాలకోర్చి టీమిండియా తరఫున ఆడే స్థాయికి చేరుకున్నాడు. చదవండి: #Sarfaraz Khan: గోల్డెన్ డకౌట్.. అయినా సర్ఫరాజ్ అలా!.. -
Viral Photo: ఢిల్లీలో టెస్లా క్రాస్బ్రీడ్.. మస్క్ చూస్తే ఏడుస్తాడు!
ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో ఓ టెస్లా కారు కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అసలైన టెస్లా కారు కాదు. వేరే కంపెనీ కారుకు టెస్లా లేబుల్ తగిలించి తిప్పుతున్నారు. ఇది భారత్ పే మాజీ ఎండీ ఆష్నీర్ గ్రోవర్ కంట్లో పడింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. భారత్ పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇంటర్నెట్లో వినోదభరితమైన, అబ్బురపరిచే విషయాలను పంచుకొంటుంటారు. ఇదే క్రమంలో టెస్లా లోగోతో ఉన్న బీవైడీ అట్టో3 కారు ఫొటోను షేర్ చేశారు. ‘బహుశా ప్రపంచంలోనే తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారు ఇదేనేమో’ అంటూ కాప్షన్ను జోడించారు. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేశంలో క్రియేటివిటీకి కొదవ లేదని ఓ యూజర్ కామెంట్లు పెట్టారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఫొటో చూస్తే టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఓ మూలన కూర్చుని ఏడుస్తాడని కామెంట్ చేశాడు. World’s first ‘cross - breed’ Tesla ! Some Delhi boy literally ‘built his dream’ in Karol Bagh @Tesla pic.twitter.com/zxuilgyvAV — Ashneer Grover (@Ashneer_Grover) February 3, 2024 -
గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు!
Gaza Viral Photo: ఇక్కడి ఫొటో చూడండి.. ఓ వైపు రాకెట్ల దాడులు.. మరోవైపు బాంబు దాడులు అయినా చెక్కు చెదరని అమాయక చిరునవ్వు లోకం గురించి ఏం తెలుసని అంత ధీమా? ఈ చిన్నారుల నవ్వు చూడండి. యుద్ధం గురించి తెలియని వయసు. ఓ తమ ప్రాంతం చిధ్రమై పోతున్నా అర్థంకాని వయసు. ఆ క్షణంలో వాళ్లకేం అక్కర్లేదు. గుండెకు హత్తుకున్న ఆ స్నేహం తప్పా. ఈ యుద్ధంలో అమ్మ తప్పిపోయి ఉండొచ్చు. నాన్న ప్రాణమే పోయి ఉండొచ్చు. యుద్ధం వీళ్లను అనాథనూ చేసి ఉండొచ్చు. దిక్కులు బిక్కటిట్లేలా వీళ్లు రోదించి ఉండొచ్చు. కానీ, ఓదార్చే చెయ్యి పక్కన ఉంది కదా అందుకే ఫొటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చారేమో. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా సామాన్యులు కడగళ్లపాలవుతున్నారు. మృతుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారనే నివేదికలు ప్రపంచాన్ని చలింపజేస్తోంది. యుద్ధంతో చితికిపోయి ఉన్న గాజాకు.. ఈ చిన్నారుల నవ్వులు మళ్లీ ప్రాణం పోస్తే.. యుద్ధం ఓడిపోయినట్లే కదా!. -
రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు!
ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని ఉపయోగించుకుంటూ మనుషులు తమ పనిని మరింత సులభతరం చేసుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ ఫోటోలను గమనించి చలానాలు విధిస్తున్నారు. ఇటీవల ఒక AI ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏఐ కెమెరా తీసిన ఫోటోలో ఓ క్యూట్ రొమాంటిక్ జంటను చూడవచ్చు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైరిజల్యూషన్ కెమెరా రాత్రి సమయంలో కూడా అద్భుతంగా వైట్ అండ్ బ్లాక్ ఫోటో తీసింది. ఇందులో బైక్ రైడర్ హెల్మెట్ ధరించాడు, వెనుక ఉన్న అమ్మాయి హెల్మెట్ ధరించలేదు. ఈ కారణంగా వారికి జరిమానా విధించారు. ఈ ఫోటోలు అమ్మాయి నవ్వుతుండటం చూడవచ్చు. వండి భ్రాంతన్మార్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. డబ్బులిచ్చి పెట్టుకునే పెయిడ్ ఫోటోగ్రాఫర్లు కూడా ఇంతమంచి ఫోటో తీయలేరేమో? అయితే ఇది కలర్ ఫోటో అయితే ఇంకా బాగుండేదని వెల్లడించాడు. అయితే జరిమానా అందుకున్న వ్యక్తి ఇలాగే భావించాడా? లేదా అనే తెలియాలి. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. ఏఐ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేరళలో ప్రమాదాలలలో మరణించే వారి సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన సంఖ్య కూడా బాగా తగ్గింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 500, టూ వీలర్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తే రూ. 1,000. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తే రూ. 2000 జరిమానా విధించబడుతుంది. View this post on Instagram A post shared by Vandibhranthanmar (@vandi_bhranthanmar) -
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్ ప్రేమ జంట ఫోటో వైరల్
Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని, చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్బర్డ్స్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్ నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్, నిర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!) View this post on Instagram A post shared by Jewish Lives Matter (@jewishlivesmatter) జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది. లక్కీగా వారు ప్రాణాలతో బైటపడ్డారు. కానీ ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ కమెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు. ఎంత అద్భుతం, ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి ధన్యవాదాలు మరొకరు రాశారు. -
ఆలయంలో అలా ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ నేతపై ఫైర్
ఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫొటోను వైరల్ చేసిన బీఆర్ఎస్ నేతపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంగళవారం మహారాష్ట్ర పూణే పర్యటన సందర్భంగా ఓ ఆలయాన్ని సందర్శించారాయన. ఆ టైంలో ఆయన విఘ్నేషుడి విగ్రహానికి వెన్ను చూపించారంటూ బీఆర్ఎస్ నేత వై సతీష్రెడ్డి తన ట్విటర్లో పోస్ట్చేసి మండిపడ్డారు. మోదీ జీ, మన దేవతలకు వెన్ను చూపడం అగౌరవంగా పరిగణించబడుతుంది. మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారు? అంటూ ట్వీట్ చేశారాయన. దీనిపై పలువురు రాజకీయనేతలు కూడా స్పందించారు. మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. బీజేపీ శ్రేణులు కౌంటర్కు దిగాయి. ఫ్యాక్ట్ చెక్ పేరిట అసలు విషయాన్ని బయటపెట్టాయి. Modi ji, it is considered disrespectful to show our backs to our deities. Whom are you facing? Irony! pic.twitter.com/qcv8qIThkf — YSR (@ysathishreddy) August 1, 2023 इस तस्वीर के बारे में आपकी क्या राय है? pic.twitter.com/ENDNfigB19 — Srinivas BV (@srinivasiyc) August 1, 2023 మోదీ వినాయకుడి ముందర పరికర్మ చేస్తున్న టైంలో స్క్రీన్షాట్ తీసి.. దానిని ఇలా వైరల్ చేశారు. ఆ విషయాన్నే బీజేపీ నేతలు ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పుణే శివాజీ రోడ్లో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణేష్ దేవాలయం.. మహారాష్ట్రలో అత్యధిక హుండీ ఆదాయం వచ్చే ఆలయాల్లో ఒకటి. నవరాత్రుల సమయంలో లక్షల మంది దర్శిస్తుంటారు. రాష్ట్రపతులు, ప్రధానులు, మాజీలు తరచూ ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు కూడా. सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची। 🙏🏻 pic.twitter.com/yGLViOOJdg — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 1, 2023 𝐓𝐑𝐔𝐓𝐇.. Just taken a snapshot from the Pooja and spreading it as if he was posing for pics. Shameful. https://t.co/aB0pZFEe7B pic.twitter.com/1zScdoNb1p — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) August 2, 2023 -
Viral: ఈ తాత కథ మీలో ఎవరికైనా ఎరుకేనా?
Viral Photo: కొందరి క(వ్య)థలు.. ఇట్టే ఆకట్టుకుంటాయి. కదిలిస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆ కథలను చెప్పడానికి పెద్దగా వర్ణనలు అక్కర్లేదు. కేవలం అక్కడ కనిపించే పరిస్థితులు చాలూ. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతుండడం చాలామంది చూసే ఉంటారు. ఒక వృద్ధుడు ఒక పాత కిరాణ దుకాణంలో ఉండగా.. పైన కనిపించే రాతలు ఆకట్టుకునేలా.. అంతకు మించి ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘‘నమ్మండి.. నేను వ్యాపారంలో నష్టపోలే. బదలు ఇచ్చి.. మధ్యవర్తిగా ఉండి నష్టపోయాను. నా సాయం తీసుకున్నవారు పొలాలు కొన్నారు. నేను మాత్రం పొలం అమ్ముకున్నాను’’ అని ఆ చిన్న కిరాణంపైన రాసి ఉంది. ఇది ఏ కాలానికైనా వర్తించే కఠిన వాస్తవం ఇదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్.. ఈ దుకాణం తమకు తెలుసని, వరంగల్ పక్కన నెక్కొండ అనే చిన్న పల్లెటూరిలో ఈ తాత ఉన్నాడని, తన అనుభవమే ఆయన అలా రాతలుగా చూపించారని అంటున్నారు. ఇంతకీ ఈ తాత పేరు, ఆయన కథ ఏంటి?.. ఆయనకు జరిగిన నష్టం ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పరు! ఇదీ చదవండి: చావు అంచుల దాకా వెళ్తే.. రక్షించాడు -
'మిస్టర్ రజనీ ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావ్!'
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్లో ఉన్నాడు. ఈ లక్నో కెప్టెన్ మోకాలి గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం రీహాబిలిటేషన్ పేరుతో బీసీసీఐ బెంగళూరు ఎన్సీఏ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్ అందుకు తగ్గట్టుగా జిమ్ వర్కౌట్స్ చేస్తు చెమటలు కక్కాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాహుల్ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. రాహుల్ పెట్టిన ఫోటోలపై అభిమానులు స్పందించారు. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం రాహుల్ పోస్టుకు స్పందిస్తూ సరదాగా టీజ్ చేశాడు. ''ఏంటి మిస్టర్ రజనీ(కేఎల్ రాహుల్) చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావ్.. చూడలేకపోతున్నాం'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసీకి దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ను బీసీసీఐఘ ఎంపిక చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్కు అతను బెంచ్కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలోనే ఉన్నాడు. విండీస్ టూర్కు ఎంపిక కావడంతో బ్యాటింగ్లో టెక్నిక్స్ మెరుగుపరుచుకునేందుకు ఇషాన్ ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు బెంచ్కే పరిమితమైన ఇషాన్ విండీస్ గడ్డపై పరుగుల వరద పారించేందుకు తహతహలాడుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12-16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టి20 మ్యాచ్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది -
కీర్తీ ఇతను ఎవరమ్మా? ప్రేమికుడా, లేక నెటిజన్లు ట్రోలింగ్
తమిళసినిమా: నటీమణుల మీద రకరకాల వదంతులు రావడం సహజమే. ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదు అనే సామెత కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ల ప్రేమ పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతుండడం, వాటిని వాళ్లు ఖండించడం షరా మామూలే. ఇటీవల ఇలాంటి ప్రచారం కీర్తిసురేష్పై ఎక్కువగా జరుగుతోంది. అనతి కాలంలోనే దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్న మలయాళీ కుట్టి ఈమె. ప్రారంభ దశలోనే మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి బయోపిక్లో అద్భుత అభినయాన్ని చాటి, విమర్శకులను సైతం మెప్పించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అంతేకాకుండా చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇలా నటిగా సక్సెస్ఫుల్పై సాగిస్తున్న కీర్తిసురేష్ వ్యక్తిగతంగా నెటిజన్లు కార్నర్కు గుర్తించిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఈమైపె రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. కీర్తిసురేష్ ప్రేమలో పడిందని త్వరలోనే పెళ్లి బాజా మోగనుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. గోవాకు చెందిన ఒక వ్యాపారవేత్త ప్రేమలో పడిందని ఆ వ్యక్తితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని మరో వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయితే దానికి ఆమె తండ్రి సురేష్ వివరణ ఇచ్చారు. కీర్తిసురేష్తో ఉన్న వ్యక్తి తమ కుటుంబ సన్నిహితుడేనని తాము గోవాకు వెళ్లినప్పుడల్లా అతను తమకు అన్ని రకాలుగా సహకరిస్తారని, అయితే తను కీర్తిసురేష్ ప్రేమికుడు కాదని స్పష్టం చేశారు. లేకపోతే తాజాగా కీర్తిసురేష్ ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కీర్తీ ఇతను ఎవరమ్మా? ప్రేమికుడా, లేక స్నేహితుడా అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. -
'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట ఆఖరిరోజు విజయానికి ఇంగ్లండ్కు ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ మరో 174 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఐదోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం కానుంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతారా.. లేక ఆసీస్ బ్యాటర్లు సమర్థంగా రాణించి ఆసీస్కు విజయాన్ని అందిస్తారా అనేది చూడాలి. బజ్బాల్ క్రికెట్లో జోరుమీదున్న ఇంగ్లండ్కు ఆసీస్ ముకుతాడు వేస్తుందో లేక చతికిలపడుతుందో చూడాలి. ఇక ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ చర్య నవ్వులు పూయిస్తోంది. బౌలింగ్కు వచ్చిన రాబిన్సన్ తన కాళ్లకు వేర్వేరు షూ వేయడం ఆసక్తి కలిగించింది. సంబంధం లేకుండా ఎడమకాలికి అడిడాస్(Adidas)వేసిన రాబిన్సన్.. తన కుడికాలికి రాజోర్(Razor) షూ వేసుకున్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్కు వచ్చిన సందర్భంలో ఓలీ రాబిన్సన్ ఇలా మిస్మ్యాచ్ షూ వేసుకొచ్చి సీరియస్గా సాగిపోతున్న మ్యాచ్లో తన చర్యతో అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఇందులో తప్పేముంది.. బహుశా రెండింటికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుంటాడు.. అందుకే ఇలా వేసుకొచ్చి సమన్యాయం చేశాడు. 281 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, నైట్ వాచ్మన్ స్కాట్ బొలాండ్ 13 పరుగులతో ఆడుతున్నారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ విజయానికి 174 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్కు ఏడు వికెట్లు కావాలి. pic.twitter.com/abYYFCVMub — Out Of Context Cricket (@GemsOfCricket) June 18, 2023 చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్ -
స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్
సీఎస్కే స్టార్ పేసర్ తుషార్దేశ్ పాండే త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ ఫ్రెండ్ నభా గడ్డంవార్తో సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు హాజరయ్యారు. తుషార్, నభా ఎంగేజ్మెంట్ ఫొటోను సీఎస్కే బ్యాట్స్మెన్ శివమ్ దూబే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్, నభాకు మధ్య పరిచయం ఉందట. నభాతో ఎంగేజ్మెంట్ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా నభా ప్రమోషన్ పొందనుందని పేర్కొన్నాడు. కొత్త జంటకు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్తో పాలు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను తుషార్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా రూ. 20 లక్షల బేస్ ధరకు తుషార్ దేశ్పాండే ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తనకు ధరకు పదింతల న్యాయం చేశాడు తుషార్. అద్భుత బౌలింగ్తో అదరగొట్టిన తుషార్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. అద్భుత బౌలింగ్తో చెన్నై కప్ గెలవడంతో తుషార్ దేవ్పాండే తన వంతు పాత్రను పోషించాడు. గత సీజన్లో పెద్దగా అవకాశాలు రాకా బెంచ్కు పరిమితమైన తుషార్ ఈ సీజన్లో మాత్రం చెలరేగిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Tushar Deshpande (@tushardeshpande96) చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్కప్ కొట్టబోతున్నాం: రోహిత్ -
గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్
డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్లు చూశాం. కానీ డబుల్ డెక్కర్ విమానాల గురించి ఎప్పుడైనా విన్నారా? తాజాగా విమానంలో డబుల్ డెక్కర్ సీటు ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ సరికొత్త సీటు డిజైన్పై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అలెజాండ్రో నూనెజ్ విసెంట్ అనే 23 ఏళ్ల డిజైనర్ ఈ డబుల్ డెక్కర్ సీట్లను రూపొందించారు. ‘చైస్ లాంజ్’ ఎయిర్ప్లేన్ సీట్ ప్రోటోటైప్ ఫొటో మొదటగా 2022లో విడుదలైంది. జర్మనీలోని హాంబర్గ్లో జరిగిన ఎయిర్క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ డబుల్ డెక్కర్ సీట్లపై రెడిట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్కో యూజర్ ఒక్కోలా స్పందించారు. ఈ మిశ్రమ స్పందనలపై డిజైనర్ నూనెజ్ విసెంట్ మాట్లాడుతూ డబుల్ డెక్కర్ సీటు స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని, విమానంలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వార్తా సంస్థతో ఆయన పేర్కొన్నారు. The double-decker airplane seat is back https://t.co/CK2nnh12kC pic.twitter.com/OKqgpmxiCn — CNN (@CNN) June 9, 2023 -
#ShubmanGill: లవ్ ప్రపోజ్కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు!
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో బ్యాటింగ్లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న శుబ్మన్ గిల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్బౌల్డ్ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్లోనూ గిల్ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్ చేసే చాన్స్ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది జరిగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్లో ఉన్న ఓ యువతి, శుబ్మన్ గిల్కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది. వాస్తవానికి గిల్ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా. గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్ చేశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో ఫాలోఆన్ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యం లభించింది. అయితే తొలి ఇన్నింగ్స్లో విఫలమైన గిల్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్లో విజయావకాశాలు ఆసీస్కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది. Proposal for Shubman Gill at the Oval. pic.twitter.com/76hpNoPlbi — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకున్నసంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో విజయం . ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో జడేజా (6 బంతుల్లో ఫోర్, సిక్స్తో 15 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేశాడు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?) ముఖ్యంగా చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన ఉండగా, చెలరేగిన జడేజా వరుసగా 6, 4 కొట్టి జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. జడ్డూ బాయ్ పెర్ఫామెన్స్కు ఫిదా అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురవడమే కాదు..ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ను గెలిపించిన జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు మిస్టర్ కూల్. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) దీనికితోడు భర్త ప్రతిభకు ముగ్ధురాలైన జడేజా భార్య భర్త కాళ్లకు దణ్నం పెట్టి, గట్టిగా కౌగిలించుకుని మరీ మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Long live true love and patriarchy #IPLFinals #RavindraJadeja #Rajputboy pic.twitter.com/KXuY3kywGv — History Of Rajputana (@KshatriyaItihas) May 29, 2023 దీనిపై ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ కూడా సెలబ్రేట్ చేశారు. ఇటీవలి కాలంలో అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల ఫోటోలను ఆకర్షణీయంగా మల్చిన సాహిద్ ఇపుడు జడేజాను ఎంచుకోవడం విశేషం. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వారెవ్వా జడేజా అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
సచిన్తో గిల్ ముచ్చట.. పండగ చేసుకున్న గాసిప్ రాయుళ్లు
శుబ్మన్ గిల్.. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే పేరు. ఐపీఎల్ 16వ సీజన్లో వరుస శతకాలతో విజృంభిస్తోన్న గిల్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. కీలక మ్యాచ్లో సెంచరీతో మెరిసిన గిల్కు సీజన్లో ఇది మూడో శతకం కావడం విశేషం. 60 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్ ఐపీఎల్లో ప్లేఆఫ్లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్తో శుబ్మన్ గిల్ ముచ్చటించాడు. గిల్ ఇన్నింగ్స్కు ముగ్దుడైన సచిన్ అతన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించాడు. రోజురోజుకు మరింత రాటుదేలుతున్న గిల్ మెరుగైన బ్యాటింగ్ కోసం సచిన్ సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకోవడం కెమెరాలకు చిక్కింది. దీంతో గాసిప్ రాయుళ్లు రంగంలోకి దిగారు. సచిన్ కూతురు సారా టెండూల్కర్తో గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో సచిన్, గిల్ ముచ్చటపై గాసిప్ రాయుళ్లు తమకు తోచిన విధంగా కామెంట్ చేశారు. ''ఇది ఒక ఫ్యామిలీ మూమెంట్'' అని కొందరు పేర్కొంటే.. ''అల్లుడు ఇన్నింగ్స్ చూసి మామ గర్వపడుతున్నాడు... అందుకే పిలిపించుకొని మరీ అభినందిస్తున్నాడు.'' అంటూ కామెంట్ చేశారు. కాగా గిల్- సచిన్ ముచ్చటిస్తున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కానీ శుబ్మన్ గిల్ మాత్రం ఎప్పటిలాగే ఇలాంటి చెత్త రూమర్లకు స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అటు సచిన్ కూడా గాసిప్ రాయుళ్ల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతుంది. Shubman Gill with Sachin Tendulkar. pic.twitter.com/Tk5Y2aImE4 — Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2023 Shubhman gill with sasur jii... Correct your caption — PakkaSanatani🕉️ 🚩🇮🇳🇮🇳 (@sanatanhistya) May 26, 2023 A proud Father-in-law ❤️🤭 — Shubham_Srivastava 🇮🇳 (@4u_shubh365) May 26, 2023 చదవండి: ధోనితో సమానంగా గిల్.. రికార్డులు బద్దలు -
'ఈసారి కప్ మనదే'.. రోహిత్ శర్మ సిగ్నల్!
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్ను గెలిచి కానీ వెళ్లలేదు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుకోవడానికి మరో అడుగు దూరంలో ఉంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2లో గెలిస్తే ఏడోసారి ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే గతంలో ముంబై ఇండియన్స్ ఆరుసార్లు ఫైనల్ చేరిన సందర్భాల్లో ఒక్కసారి మినహా మిగతా ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఒకవేళ ఈసారి ఫైనల్కు వస్తే మాత్రం ముంబై ఆరోసారి విజేతగా నిలవడం గ్యారంటీ అని ఆ జట్టు అభిమానులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ చేసిన నెంబర్ సిగ్నల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూం నుంచి బస్లో బయలుదేరిన సమయంలో.. ముంబై కెప్టెన్ రోహిత్ బస్సు కిటికీలోనుంచి అభిమానులను చూస్తూ ఆరు సంఖ్యను సిగ్నల్గా చూపిస్తూ ఈసారి కప్ మనదే అన్నట్లుగా సైగ చేశాడు. రోహిత్ అలా చూపించగానే ముంబై ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్ఆర్హెచ్పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్లో అడుగుపెట్టింది. ఇక ఎలిమినేటర్లో లక్నో సూపర్జెయింట్స్ను 81 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాన్ని దక్కించుకొని క్వాలిఫయర్-2కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్ను ఓడించి ఫైనల్కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. చూద్దాం మరి ముంబై ఇండియన్స్ ఆరోసారి కప్ కొడుతుందో లేదో.. Rohit Sharma gives signal to their fans, Hopefully 6th trophy loading 😌.#MIvsGT pic.twitter.com/LG88i1z8My — 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 𝗙𝗮𝗻𝗰𝗹𝘂𝗯 (@LoyleRohitFan45) May 26, 2023 చదవండి: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్కు వెళ్లేదెవరంటే? -
డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ను స్టార్స్టోర్ట్స్లో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్లో ఒక్కో డాట్ బాల్ను సదరు బ్రాడ్కాస్ట్ సంస్థ స్కోరుబోర్డులో ఒక్కో చెట్టు గుర్తును చూపించింది. అదేంటి డాట్ బాల్ అనగానే స్కోరు బోర్డును సున్నా కనిపించాలి గాని ఇలా చెట్టు కనిపించడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక బీసీసీఐ చేసిన ఒక గొప్ప ఆలోచన బయటకొచ్చింది. అదేంటంటే.. Green Initiative(పర్యావరణం పెంపొందించడానికి) పేరిట బీసీసీఐ ఒక వినూత్న కార్యం చేపట్టింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్లో అన్ని డాట్ బాల్స్ను కలిపి 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. బీసీసీఐ ఆలోచనను అభినందించిన స్టార్స్టోర్ట్స్ యాజమాన్యం గుజరాత్, సీఎస్కే ప్లేఆఫ్ మ్యాచ్లో నమోదైన డాట్ బాల్స్ స్థానంలో చెట్టు గుర్తును ఉంచేలా ప్రణాళిక రూపొందించింది.ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పర్యావరణాన్ని కాపాడేందుకు బీసీసీఐ చేసిన గొప్ప ఆలోచనను మెచ్చుకుంటున్నారు. Qualifier 1 | #GTvCSK What's that Tree for @JioCinema??#IPLPlayOffs #CricketTwitter pic.twitter.com/TYiOy8tczr — Anika🇮🇳 (@SportsIndia036) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు -
రూ.2 కోట్ల స్పోర్ట్స్ కారు.. క్షణాల్లో కాలి బూడిదైంది..
న్యూఢిల్లీ: గురుగ్రామ్లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మన్కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగాయి. మన్కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ.. -
ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి భారీ పరిమాణంలోని వింత చేప ఒకటి కొట్టుకు వచ్చింది. దీనిని కేత్ రాంప్టన్, టామ్ రాంప్టన్ అనే దంపతులు తొలుత గుర్తించారు. చేప దాదాపు రెండు మీటర్ల పొడవు ఉంది. వీరిద్దరూ వెటర్నరీ డాక్టర్లే అయినా, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపను వారు చూసి ఉండలేదు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప అప్పటికే మరణించి ఉంది. రాంప్టన్ దంపతులు ఈ చేప ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు దీని గురించి కొంత అధ్యయనం చేయడంతో ఆసక్తికరమైన విశేషాలు బయటపడ్డాయి. ఇది ‘ఓషన్ సన్ఫిష్’ అని తేలింది. ‘ఓషన్ సన్ఫిష్’ జాతికి చెందిన చేపలు సైజులో భారీవే అయినా, సముద్రాల్లో వీటి సంఖ్య చాలా తక్కువ. అరుదైన చేపలు కావడంతో వీటి గురించి చాలామందికి తెలీదు. ఇవి పూర్తిగా ఎదిగితే, నాలుగు మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పు వరకు పెరుగుతాయని, దాదాపు రెండున్నర వేల కిలోల బరువు ఉంటాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. ఇవి ఉష్ణమండల తీరాల వద్ద అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని వారు అంటున్నారు. చదవండి: చెరువులో వింత జీవి.. ఒకటి, రెండు కాదు ఏకంగా ఇరవైనాలుగు కళ్లు! -
Video: బాణసంచా వెలుగుల్లో కొత్త సచివాలయం.. అదరహో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Big Day In Telangana Today… ❤️ Opening of New Telangana’s Secretariat 👏 Not Graphics like in other states 😀 It’s A Reality… The Best in India… Thanks to Visionary KCR Garu ✊️#Telangana #Secretariat 😍@KTRBRS pic.twitter.com/YQR07zozon — Govardhan Reddy Dharmannagari (@DGRforBRS) April 30, 2023 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్కు వచ్చిన కేసీఆర్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకోనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు -
Delhi Metro: లుంగీ అనుకుని స్కర్ట్ వేసుకున్నారా ఏంటి భయ్యా..?
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు రోటీన్కు భిన్నంగా స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. స్నేహితులైన వీరిద్దరూ ఏం చక్కా అమ్మాయిలు వేసుకునే స్కర్టులతో మెట్రో ఎక్కారు. రిలాక్స్గా కన్పిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. వీరిని చూసిన తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. కొందరైతే పగలబడి నవ్వారు. కాగా.. ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. వీరిద్దరూ లుంగీ అనుకుని పొరపాటున స్కర్ట్ ధరించారేమో అని ఓ యూజర్ ఛలోక్తులు విసిరాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. స్కర్ట్లు అమ్మాయిలే ధరించాలని రూల్ ఏమైనా ఉందా? సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. అందులో తప్పేముంది అని వీరికి మద్దతు తెలిపారు. లుంగీకంటే ఇవే బాగున్నట్టున్నాయ్ ఫ్రీగా.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sameer Khan (@sameerthatsit) చదవండి: సోలో సెయిలింగ్ రేస్లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 110 ఏళ్ల తర్వాత కన్పించిన పులి.. ఫొటో వైరల్..
చండీగడ్: హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో హరియాణా అటవీ శాఖ మంత్రి, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించదని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కన్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ పార్కులో కన్పించింది. అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్బరా నేషల్ పార్కు కూడా కలెసర్ పార్కు పక్కనే ఉంది. దీంతో ఈ మూడు పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలెసర్ పార్కులోనే నివాసముంటుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా.. కలెసర్ నేషనల్ పార్కు ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. అయితే పులి కన్పించండం మాత్రం 110 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు -
#RCB: మాస్టర్ ప్లాన్.. ఆర్సీబీ పేరుతో అడ్డుపుల్ల!
ఐపీఎల్లో దురదృష్టమైన జట్టుగా పేరు పొందింది ఆర్సీబీ. కప్ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఆఖరి నిమిషంలో ఒత్తిడికి లోనవ్వడంతో టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది. ప్రతీసారి ఈ సాలా కప్ నమ్దే అంటూ బరిలోకి దిగే ఆర్సీబీ లీగ్ దశ వరకు బాగానే ఆడుతున్నా ప్లేఆఫ్ దశలో మాత్రం చతికిలపడుతూ వస్తోంది. గత మూడు సీజన్లుగా ఇదే తంతు. మూడుసార్లు ఐపీఎల్లో రన్నరప్గా నిలిచిన ఆర్సీబీ కనీసం ఈసారైనా టైటిల్ కొట్టాలని కోరుకుందాం. ఈ విషయం పక్కనబెడితే.. బుధవారం కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్కు హాజరైన ఒక చిన్నారి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్సీబీ టైటిల్ కొట్టేవరకు నేను స్కూల్లో జాయిన్ అవను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. మ్యాచ్ జరుగుతుండగా ఆ చిన్నారి ప్లకార్డు పట్టుకొని అటు ఇటు తిరగడం హైలెట్గా నిలిచింది. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయగా చిన్నారి ట్రెండింగ్లో నిలిచింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేశారు. ''వాళ్లు టైటిల్ కొట్టినా.. కొట్టకపోయినా డబ్బులు వస్తాయి.. నువ్వు చదువుకుంటేనే గౌరవం వస్తుంది''.. ''ఈ చిన్నారి కోరిక తీరాలని కోరుకుందాం''.. ''ఆర్సీబీ కప్ గెలిస్తే ఓకే.. ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటో మరి ఆలోచించుకో.. స్కూల్ ఎగ్గొట్టడానికి ఆర్సీబీ పేరుతో మాస్టర్ ప్లాన్ వేశావుగా'' అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మూడు మ్యాచ్ల్లో కోహ్లి స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానంలో ఉంది. చదవండి: ఎవర్రా మీరంతా?.. వదిలేస్తే వంద పరుగులైనా తీస్తారేమో! Dear RCB, please win IPL for your fans ❤ pic.twitter.com/0PHQoyshQe — leisha (@katyxkohli17) April 26, 2023 -
ధోనిని హత్తుకున్న ఫొటో షేర్ చేసిన కోహ్లి! తలైవాకు బిగ్గెస్ట్ ఫ్యాన్బాయ్!
IPL 2023- RCB Vs CSK: మహేంద్ర సింగ్ ధోని.. విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేర్లు. ఒకరు భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందిస్తే.. మరొకరు తన ఆట, కెప్టెన్సీతో అభిమానుల మనసు కొల్లగొట్టిన వారు. ఇక ఈ టీమిండియా మాజీ సారథుల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ కూల్ ధోని అంటే కోహ్లికి మాటల్లో చెప్పలేనంత అభిమానం. అన్నలా అండగా నిలబడి టీమిండియాలో కీలక బ్యాటర్గా.. కెప్టెన్గా ఎదగడంలో అతడికి ధోని అన్ని విధాలా సహకరించాడు. కోహ్లి ప్రతిభ నిరూపించుకునే క్రమంలో వరుస అవకాశాలు రావడానికి దోహదం చేస్తూ అన్నలా అండగా నిలబడ్డాడు. ఇక తనకు సరైన వారసుడు కోహ్లినే అని నమ్మిన తలైవా.. అతడిని కెప్టెన్ చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. తన ‘జూనియర్’ సారథ్యంలో ఆడాడు కూడా! తలైవాను కలిసిన కింగ్ అంతేకాదు కెరీర్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న వేళ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లినే స్వయంగా వెల్లడించాడు. తనకు అన్నయ్యలా మారిన ఇలాంటి గొప్ప నాయకుడు మరెవరూ ఉండరంటూ సందర్భం వచ్చినపుడల్లా అభిమానం చాటుకుంటూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ధోనిపై ప్రేమను కురిపిస్తూ షేర్ చేసిన ఫొటో క్షణాల్లో వైరల్గా మారింది. ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఇద్దరు దిగ్గజాలు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో సీఎస్కే చేతిలో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ సందర్భంగా ధోనిని కలిసిన కోహ్లి అతడితో సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్.. ‘‘ఇద్దరు దిగ్గజాలు’’ అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇదిలా ఉంటే.. ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను విరాట్ కోహ్లి మ్యాచ్ అనంతరం తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘తలాకు బిగ్గెస్ట్ ఫ్యాన్బాయ్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హ్యాట్సాఫ్.. ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం! 38 ఏళ్ల వయసులో.. నొప్పిని భరిస్తూనే.. Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ! A legendary duo 🙌@imVkohli 🤝 @msdhoni ❤️ 💛#TATAIPL | #RCBvCSK pic.twitter.com/5sOQDkdBLb — IndianPremierLeague (@IPL) April 17, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వైరల్గా వెడ్డింగ్ కార్డు.. దయచేసి పెళ్లికి రావొద్దు.. ఇదేం పద్ధతి!
ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ పెళ్లి వేడుక అంటే కచ్చితంగా ఆహ్వాన పత్రికలు అచ్చేయిస్తున్నారు చాలా మంది. తమ బంధు మిత్రులు, స్నేహితులు, ప్రియమైన వారి ఇంటికి వెళ్లి లేదా పోస్టు ద్వారా పెళ్లి పత్రికను అందజేస్తారు. కుటుంబ సమేతంగా తప్పకుండా వివాహానికి రావాలని సంతోషంగా చెబుతుంటారు. అయితే ఈ పెళ్లి పత్రికే ఇప్పుడు ఓ కుటుంబం పరువు పోయేలా చేసింది. ప్రింటింగ్ కంపెనీ చేసిన చిన్నపొరపాటు వీరిని బంధమిత్రుల ఆగ్రహానికి గురి చేసింది. ఆహ్వాన పత్రికలో ఒక్క పదం మిస్ కావడం వల్ల మొత్తం అర్థమే మారిపోయింది. 'నేను ప్రేమతో ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తున్నాను. మీరు మా పెళ్లికి రావడం మర్చిపోండి' అని వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ అయింది. 'పెళ్లికి రావడం మర్చిపోకండి' అనే పదానికి బదులు ఒక్క అక్షరం మిస్ అయి మర్చిపోండి అని అచ్చయింది. దీంతో పెళ్లి కార్డు రిసీవ్ చేసుకుని చదివిన బంధువులు అవాక్కయై నోరెళ్లబెట్టారు. పెళ్లికి రావొద్దని పెళ్లి పత్రికలోనే చెప్పడం ఏంటి? బిత్తర పోయారు. ఈ పెళ్లి కార్డును ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. 'ఇదిగో నాకొక వివాహ ఆహ్వాన పత్రిక వచ్చింది. కానీ ఇది చూశాక పెళ్లికి వెళ్లాలో వద్దో ఏమీ అర్థం కావడం లేదు' అని అతడు రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ఆహ్వానితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లికి రావొద్దని మొహం మీదే చెప్పడం ఏంటి అని మండిపడ్డారు. ఇది నిజంగా అతిథులను అవమానించడమే, మీరు పెళ్లికి వెళ్లడం వారికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ప్రేమ మాత్రం వాళ్లింటి దగ్గర, విందు మాత్రం వేరే చోటనా? అసలు ఎవరు ఈ పత్రిక ఇచ్చింది. అని మరో నెటిజన్ స్పందించాడు. ఇది నిజంగా అమమానించడమే పెళ్లికి తప్పకుండా పిలవాల్సిందిపోయి, మోహం మీదే రావొద్దని చెబుతారా? అని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ పెళ్లికి రావడం మర్చిపో అని చెప్పడం మొట్టమొదటి సారి చూస్తున్నా..అని అన్నారు చదవండి: ఎండదెబ్బకు గబ్బిలాలు విలవిల.. వాటర్ స్ప్రే కొడుతున్న గ్రామస్థులు.. -
మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు మొదలైంది. అయితే టాస్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హార్ధిక్ పాండ్యాకు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా పంజాబ్, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. టాస్ వేయడానికి ముందు ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్ను హగ్ చేసుకున్న పాండ్యా అతని చెంపపై ముద్దుపెట్టడం అభిమానులకు ఆనందం కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇదే పాండ్యా ధావన్ ఔటైనప్పుడు తెగ సంబరపడిపోయాడు. ఇందుకు ఒక కారణం ఉంది. ధావన్ ఈ సీజన్లో భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. 8 పరుగులకే వెనుదిరగడంతో పాండ్యాకు ఎక్కడిలేని సంతోషం కలిగింది. అందుకే ధావన్వైపు చూస్తూ రెండు చేతులను పైకి లేపి సాధించాం అన్నట్లుగా గట్టిగా అరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ''ఏంటో ఈ పాండ్యా సిత్రాలు.. మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు.'' అంటూ కామెంట్ చేశారు. Hardik Pandya with Shikhar Dhawan. What a lovely picture! pic.twitter.com/eb1jcVBTjb — Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్.. ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’
న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని సృజనాత్మకను బయటకి తీస్తున్నారు. మిడ్ జర్నీ అనే కృత్రిమ మేధను వినియోగించి గోకుల్ పిళ్లై అనే ఆర్టిస్ట్ కోటీశ్వరుల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారు. కుబేరుల్ని మురికివాడల్లోకి తెస్తున్నారు. బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్బర్గ్, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టలు కూడా లేకుండా మురికి మురికిగా ఆ ఫొటోల్లో దర్శనమిస్తున్నారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఫొటోలను గోకుల్ పిళ్లై ఆన్లైన్లో షేర్ చేస్తూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్స్’ అని క్యాప్షన్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అవి వైరల్గా మారాయి!. View this post on Instagram A post shared by Gokul Pillai (@withgokul) ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీరందరిలో ఎలాన్ మస్క్ మాత్రం నిరుపేద అవతారంలో కూడా సూపర్ రిచ్గా కన్పిస్తున్నారని ఓ యూజర్ చమత్కరించాడు. ఎంతైనా మస్క్ మస్కే అంటు నవ్వులు పూయించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితం మార్క్ జుకర్బర్గ్కు సంబంధించిన ఓ ఏఐ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ అధునాతన సాంకేతికతో రూపొందించిన ఫొటోలు నిజమైన ఫొటోలోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. దీంతో అసలు ఫొటోలు, ఎడిట్ చేసిన ఫొటోల మధ్య తేడా కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. చదవండి: అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ.. -
హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన మహిళా పోలీసులు.. నెటిజన్ల ఫైర్..
ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. మోటారు వాహన చట్టం సెక్షన్ 129లో ఈ నిబంధన ఉంది. దీంతో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే ముంబైలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ ధరించకుండానే స్కూటీ నడపడం చూసిన ఓ వ్యక్తి వెంటనే ఫొటో తీశాడు. ఓ సాధారణ పౌరుడు ఇలా చేస్తే ఉరుకుంటారా అని అధికారులను ప్రశ్నిస్తూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్తో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు వీళ్లకు వర్తించవా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ఫైర్ అయ్యాడు. MH01ED0659 What if we travel like this ?? Isn't this a traffic rule violation ?@MumbaiPolice @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/DcNaCHo7E7 — Rahul Barman (@RahulB__007) April 8, 2023 దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఈ మహిళా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో.. రూల్స్ ఎప్పుడూ సామాన్యులకే వర్తిస్తాయి, చట్టాలు చేసేవారికి, చట్టపరిరక్షకులకు అవి వర్తించవు అని అసహనం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. ఆ ఫొటో సరిగ్గా ఎక్కడ తీశారో చెప్పాలని పోస్టు చేసిన వ్యక్తిని అడిగారు. దీంతో అతడు ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే (దాదర్) అని బదులిచ్చాడు. అనంతరం ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మాతుంగా ట్రాఫిక్ డివిజన్ పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారే చేశామని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు శాంతించారు.భారత్లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తారు. ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తారు. అరుదైన సందర్బాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చదవండి: ఒక్క బైక్పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. మైండ్ దొబ్బిందా..? -
'భయ్యా.. నీకున్న సౌలత్ మాకుంటే ఎంత బాగుండు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సాయి సుదర్శన్(62 నాటౌట్) టాప్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోకోగా.. కిల్లర్ మిల్లర్ 16 బంతుల్లో 31 నాటౌట్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ ఆరంభ మ్యాచ్లో దుమ్ము దులిపిన గిల్ ఈ మ్యాచ్లో మాత్రం కేవలం 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సోషల్ మీడియాలో గిల్ ఒక అభిమానికి ఇచ్చిన రిప్లై అందరిని ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు వస్తున్న క్రికెట్ ఫ్యాన్స్కు అందించే టికెట్స్ ధరలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి రూ. 20 వేల టికెట్ కూడా ఉంది. వీఐపీ ప్రీమియమ్ లాంజ్ టికెట్ అయిన దీనిని కొనుగోలు చేసిన వారికి రాచ మర్యాదలు చేస్తారు. పార్కింగ్ ఏరియా నుంచి ప్రీమియమ్ లాంజ్లోకి వెళ్లడానికి ఒక కార్ను కేటాయించారు. అందులో ఎక్కి స్టేడియం లోపల నుంచి ప్రీమియమ్ సూట్కు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక అభిమాని సీజన్ ఆరంభ మ్యాచ్ అయిన గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మ్యాచ్కు రూ.20 వేల టికెట్ కొని మ్యాచ్ను ఎంజాయ్ చేశాడు. ప్రీమియమ్ లాంజ్ టికెట్ కొన్న విషయంతో పాటు ప్రీమియమ్ సూట్ కార్లో ఎక్కి లాంజ్కు చేరుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ ఫోటోకు వినూత్న స్పందన వచ్చింది తాజాగా గిల్ అభిమాని పెట్టిన ఫోటోపై ఫన్నీగా స్పందించాడు. ''భాయ్ నీకిచ్చిన సౌలత్ మాకుంటే ఎంత బాగుండు.. ఇలాంటి వాటికి పెట్టి పుట్టుండాలి. మైదానంలోకి ఎంటర్ అవ్వాలంటే మేం నడవాల్సిందే. కానీ ఇతనికి ఆ అవసరం లేకుండా నేరుగా లాంజ్ దగ్గరికి చేరడానికి కార్ సూట్ ఇచ్చారు. మేం కూడా డ్రెసింగ్రూమ్ నుంచి గ్రౌండ్లోకి ఎంటర్ కావడానికి ఇలా కార్ కేటాయిస్తే బాగుండేది నడిచే బాధ తప్పేది.. '' అంటూ పేర్కొన్నాడు. గిల్ ఇచ్చిన రిప్లై సూపర్ ఫన్నీగా ఉందని కొందరు అంటే.. మరి నడవడానికి కూడా ఇంత బద్దకమా అంటూ మరికొందరు పేర్కొన్నారు. చదవండి: Chahal-Umran Malik: 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్గా అనిపిస్తోంది' -
మీరు సూపర్ మేడం.. ఐఏఎస్ అధికారిణిపై నెటిజన్ల ప్రశంసల వర్షం..
లక్నో: సామాన్య ప్రజలు తమ సమస్యల గోడు వినిపించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగుతుంటారు. ఒక్కోసారి వారిని పట్టించుకునేవారే ఉండరు. ఉన్నత అధికారులను నేరుగా కలిసే అవకాశమే తక్కువ. అయితే ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారిణి సౌమ్య పాండే మాత్రం తన సింప్లిసిటీతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకం ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు తనకు సాయం చేయాలని వెళ్లిన ఓ పెద్దాయన ధనీరామ్ సమస్యను ఆమె దగ్గరుండి తెలుసుకున్నారు. ఎండలోనూ అతని దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి కచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చీఫ్ డెవలెప్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య.. ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దివ్యాంగుడైన ధనీరామ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసేందుకు అవసరమైన సాయం అంధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌమ్య పాండే.. ధనీరామ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంత పెద్ద హోదాలో ఉండి సామాన్యుడితో సౌమ్య పాండే ప్రవర్తించిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నవ భారత్లో సరికొత్త ఉత్తర్ప్రదేశ్ ఇది.. చూడండి ఐఏఎస్ అధికారి సామాన్యుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఎలా తీసుకుంటున్నారో.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ‘నీతా ముఖేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ ప్రారంభం వేడుకల్లో మరో విషయం ఆసక్తికరంగా మారింది. టిష్యూ పేపర్లలా రూ. 500నోట్లను ఉంచారన్న వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. (NMACC: డాన్స్తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్కైతే ) బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు సందడి చేసిన అంబానీల గ్రాండ్ పార్టీపై ఒక ట్విటర్ యూజర్ ఒక పోస్ట్ పెట్టారు. అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కీ జగహ్ 500 కే నోట్స్ హోతే హై (sic)’’ అని ట్వీట్ చేశాడు. దీంతో రుచి కరమైన వంటకాలతో పాటు కరెన్సీ నోట్లు వడ్డించారా అంటూ నెటిజన్ల కామెంట్లు వైరలయ్యాయి. (అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి ) నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా వడ్డించిన తీపి పదార్థంపైనే ఈ చర్చ అన్నమాట. అతిథులకు వడ్డింయిన ఖరీదైన వంటకాలకు తోడు, ఈ స్వీటు, కరెన్సీ నోట్లతోపాటు ఉండటంతో ఈ ప్రత్యేక స్వీట్ ఫొటో హాట్ టాపిక్గా నిలిచింది. మీమ్స్తో నెటిజన్లు సందడి చేశారు. Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain 😭 pic.twitter.com/3Zw7sKYOvC — R A T N I S H (@LoyalSachinFan) April 2, 2023 అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ స్వీట్ పేరు ‘దౌలత్ కి చాట్’ (daulat ki chaat) ఉత్తర భారతదేశంలో చాలా ఇష్టపడే వంటకం. ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సేవిస్తారట. బాగా మరిగించిన పాలను చల్లబరిచిన తర్వాత తయారు చేస్తారు. పిస్తా, కోవా,బాదం,చక్కెర తదితర రిచ్ ఇంగ్రీడియెంట్స్తో గార్నిష్ చేస్తారంటూ ఫుడ్ ఎక్స్పర్ట్స్, కొంతమంది నెటిజన్లు స్పందించారు. ఈ స్వీట్ ఢిల్లీలో కూడా చాలా పాపులర్ అని ఒకరు. ఇది చాలా రెస్టారెంట్లలో ఇది దొరుకుతుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. దీంతో అంబానీ పార్టీలో కరెన్సీ నోట్ల వడ్డన అనే ఊహాగానాలకు చెక్ పడింది. కాగా శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ గ్రాండ్ ఈవెంట్ ఉత్సవాలు మూడురోజుల పాటుసాగాయి. నీతా అంబానీ స్వయంగా ప్రదర్శించిన నృత్యప్రదర్శనతోపాటు, బాలీవుడ్, హాలీవుడ్ తారల డ్యాన్స్లు, షారూక్, గౌరీ డాన్స్, ప్రియాంక చోప్రా, రణవీర్ స్టెప్పులు, టాలీవుడ్ ఆస్కార్ విన్నర్ సాంగ్ నాటునాటు పాటకు రష్మిక, అలియా నృత్యం, అలాగే శనివారం జరిగిన ఈవెంట్లో ఆస్కార్ విజేత ముంబైకి వచ్చి పింక్ కార్పెట్పై అలరించిన సంగతి తెలిసిందే. @Ruhaani77 pic.twitter.com/At1f4ZXr5Z — garima (@badanpesitaree) April 2, 2023 -
ఐపీఎల్కు ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ.. దీని అర్థం తెలుసా?
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి టాటూలు అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన శరీరంపై ఇప్పిటికే ఆకర్షణీయమైన పచ్చబొట్లు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభోత్సావానికి ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ కన్పించడం అభిమానులను సర్ప్రైజ్ చేసింది. అలాగే ఈ టాటూ అర్థం ఏమై ఉంటుందా అనే ఎగ్జైట్మెంట్ కూడా నెలకొంది. అయితే ఈ టాటూ అసలు అర్థం ఏంటి? దాని వెనకాల ఎంత శ్రమ ఉంది? ఎందుకంత ప్రత్యేకత? అనే విషయాలు.. ఈ టాటు కోహ్లీకి వేసిన ప్రముఖ కళాకారుడు, ఏలియన్స్ టాటూ వ్యవస్థాపకుడు సన్నీ భానుశాలి స్వయంగా వివరించారు. 'మా టాటూలు నచ్చి కోహ్లీ స్వయంగా మా స్టూడియోకు వచ్చారు. మా పనితీరును తెలియజేసే ఫొటోలతో మా దగ్గరకు వచ్చారు. నా టాటూలకు పెద్ద అభిమానినని చెప్పారు. క్రికెట్లో సూపర్స్టార్ అయిన కోహ్లీ లాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇంత సింపుల్గా ఉంటారని అనుకోలేదు. అసలు కోహ్లీలో గర్వం లేదు. చాలా ఒదిగి ఉంటారు. సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తారు. ఇంత మంచి ఆటిట్యూడ్ ఉన్న అతన్ని కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఇక నా పనితీరు నచ్చి కొత్త టాటూ వేయాలని కోహ్లీ నన్ను అడిగారు. తన పాత టాటూను కవర్ చేస్తూ కొత్తది ఉండాని చెప్పారు.' అని సన్నీ పేర్కొన్నారు. ఇక కోహ్లీ కొత్త టాటూ అర్థం కూడా చెప్పాడు సన్నీ. అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని, సృష్టి మూలాన్ని సూచించేలా, ఉన్నతమైన వాటిని, ఏకత్వాన్ని, జీవిత నిర్మాణాన్ని, అన్నింటికీ మూలాన్ని తెలియజేస్తూ కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఈ టాటూను చాలా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ టాటూను చూసి కోహ్లీ మురిసిపోయాడని, అతనికి ఇది చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. 'ఈ టాటూ కోహ్లీకి ఎంత విలువైందో నాకు బాగా తెలుసు. అందుకే చాలా శ్రమించి నా మనసుపెట్టి అంకితభావంతో దీన్ని రూపొందించా. టాటూలో ప్రతీది అద్భుతంగా పర్ఫెక్ట్గా వచ్చింది. రెండు రోజులు, రెండు చోట్లకు వెళ్లి కోహ్లీకి ఈ టాటూ వేశా' అని సన్నీ పేర్కొన్నాడు. తొలిరోజు ముంబైలోనే కోహ్లీ అపాయింట్మెంట్ ఇచ్చాడని, ఆ తర్వాత మరో రోజు బెంగళూరుకు వెళ్లి టాటూ పూర్తి చేసినట్లు సన్నీ చెప్పాడు. కోహ్లీకి టాటూ వేసే సమయంలో స్టూడియోను మూసి వేసి భద్రతా కారణాల దృష్ట్యా భారీగా బౌన్సర్లను కూడా మోహరించినట్లు చెప్పాడు. టాటూ కోసం ఎన్ని గంటలు పట్టినా.. కోహ్లీ చాలా సహనంతో ఉన్నాడని, అసలు ఒక్క క్షణం కూడా అలసిపోయినట్లు కన్పించలేదని సన్నీ తెలిపాడు. టాటూ పూర్తైన తర్వాత చూసుకుని కోహ్లీ మైమరచిపోయాడని, ఆనంద పరవశంలో మునిగిపోయాడని వివరించాడు. ఈ టాటూ జీవితకాలం తనతో పాటు ఉంటుందని కోహ్లీకి తెలుసన్నాడు. చదవండి: ఐపీఎల్లో జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు! ఏకైక భారత క్రికెటర్గా -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. ఫొటోలు వైరల్..
భోపాల్: గతేడాది నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కీడ్ని సమస్యతో ఈ పార్కులోని సషా అనే చీతా చనిపోయిన మూడు రోజులకే మరో చీతా ప్రసవించడం గమనార్హం. తల్లి, నాలుగు చీతా కూనలకు సంబంధించిన ఫోటో, వీడియోను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్లో షేర్ చేశారు. Congratulations 🇮🇳 A momentous event in our wildlife conservation history during Amrit Kaal! I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt — Bhupender Yadav (@byadavbjp) March 29, 2023 దేశంలో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబర్లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు. వీటీలోనే ఒకటి చనిపోయింది. మిగతావి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 8 చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కూడా భారత్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి క్వారంటైన్లో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు. చదవండి: రాజస్థాన్ హై కోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల.. -
వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!
ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు చూస్తే ఒక్కోసారి గుండె ఆగినంత పని అవుతుంది. ముఖ్యంగా పాములు, అనకొండలకు సంబంధించిన దృశ్యాలు భయంకరంగా ఉంటాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ పైథాన్ వీడియోను చూస్తే మీరు హడలెత్తిపోవడం ఖాయం. సాధారణంగా అందరు పాము జాతుల్లో అనకొండ అతిపెద్దది అయి ఉంటుందని అనుకుంటారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద పాము రెటిక్యులేటెడ్ పైథాన్. దక్షిణ, ఆగ్నేయ ఆసియా వీటికి నిలయం. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఈ పాముదే. The reticulated python (Malayopython reticulatus) is a python species native to South and Southeast Asia, It is the world's longest snake pic.twitter.com/gvTWFLA3Nq — Science girl (@gunsnrosesgirl3) March 25, 2023 అత్యంత భారీ సైజులో, నమ్మశక్యంగానీ రీతిలో ఉన్న రెటిక్యులేటెడ్ పైథాన్.. ఓ ఇంట్లో తిరుగుతూ కన్పించడం నెటిజన్లను విస్మయానికి గురి చేసింది. దీన్ని చూసిన కొందరికి దిమ్మతిరిగిపోయింది. ఇది నిజంగా పామేనా లేక గ్రాఫిక్సా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ ఆయిన ఈ పాము వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నిడివి 17 సెకన్లు మాత్రమే ఉంది. పాము మెల్లగా ఓ ఇంటి గోడపై నుంచి లోనికి వెళ్లింది. ఎంత పెద్ద ధైర్యవంతుడైనా సరే.. ఈ పాము పరిమాణాన్ని చూస్తే హడలిపోయేలా ఉంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను పోస్టు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరికొందరు హమ్మయ్య.. లక్కీగా ఈ పాము మా ఇంట్లో లేదు అని నవ్వులు పూయించారు. చదవండి: ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి.. -
నటి హరితేజ షాకింగ్ లుక్ వైరల్.. ఇలా మారిపోయిందేంటి?
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఆన్ స్క్రీన్పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ మహా చలాకీగా ఉంటుంది. సినిమాల్లో తన యాక్టింగ్తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు సటైరికల్ కామెంట్స్తో ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదించుకుందంటూ ఓ ఈవెంట్లో ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే. అలా వచ్చిన క్రేజ్తో బిగ్బాస్ ఆఫర్ కొట్టేసింది. మొదటి సీజన్లో పార్టిసిపెంట్గా వెళ్లి మంచి పేరు సంపాదించుకున్న ఆమె అనంతరం అదే క్రేజ్ను కొనసాగించలేకపోయింది. ఇక 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన హరితేజ తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ని పలకరిస్తుంది. తన ఫొటోలు, కూతురు ఫొటోలు షేర్ చేస్తూ నెట్టంట సందడి చేస్తుంది. ఈక్రమంలో ఆమె షాకింగ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా ఆరింది. ఆఫర్స్ లేక ఇంటికే పరిమితమైన హరితేజ బరువెక్కిన సంగతి తెలిసిందే. అయితే సడెన్గా ఆమె బక్కచిక్కి కనిపిచింది. తాజాగా తన లంగావోణి ఫొటోలు షేర్ చేయగా.. అందులో చాలా సన్నగా కనిపించి షాకిచ్చింది. ఇక హరితేజను ఇలా చూసి ఆమె ఫాలోవర్స్ అంతా అవాక్కవుతున్నారు. సడెన్గా ఇంత చేంజ్ ఏంటీ? అంటూ ఆమె పోస్ట్పై స్పందిస్తున్నారు. అంతేకాదు ఆమె డైట్ ప్లాన్ ఏంటని కూడా ఆరా తీస్తున్నారు. ఇలా అస్సలు బాలేవు.. కాస్తా బొద్దుగా ఉంటేనే బాగున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కూచిపూడి డ్యాన్సర్ అయిన హరితేజ యాంకరింగ్ చేస్తూ, సీరియల్స్లో నటించే చాన్స్ కొట్టేసింది. మనసు-మమతతో మంచి గుర్తింపు పొందిన ఆమె ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అందరి బంధువయ, దమ్ము, దువ్వాడ జగన్నాధం, అనగనగా ఓ ధీరుడు , విన్నర్ , అత్తారింటికి దారేది , ఉంగరాల రాంబాబు , రాజా ది గ్రేట్ వంటి హిట్ చిత్రాల్లో సహానటి పాత్రలు పోషించింది. చదవండి: వేడుకగా చరణ్ బర్త్డే పార్టీ.. టాలీవుడ్ తారల సందడి డైరెక్టర్తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత -
జిన్పింగ్కి వంగి నమస్కరిస్తూ చేతిని ముద్దాడిన పుతిన్!ఇది నిజమేనా?
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మూడు రోజుల రష్యా పర్యటన కోసం సోమవారమే మాస్కో చేరకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడికి చేరుకున్న జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమై.. ఉక్రెయిన్ యుద్ధ శాంతి ప్రణాళిక చర్చలతో సహా పలు విషయాలను చర్చించనున్నారు. వాస్తవానికి ఈ యుద్ధంలో పాల్గొన్న ఇరు పక్షాలు తమ ఆందోళనలను విరమించి యుద్ధానికి ముగింపు పలికేలా చేయడమే ఈ పర్యటన లక్ష్యం. ఐతే ఉన్నతస్థాయి దౌత్య చర్చల మధ్య పుతిన్ జిన్పింగ్కి వంగి వంగి నమస్కరిస్తూ.. చేతిని ముద్దాడుతున్న పోటో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఫోటో మరిన్ని విభేదాలకు తావిచ్చేలా ఉడటంతో ఇది అసలు నిజమా? లేక ఫేక్ ఫోటోనా అని తనిఖీ చేయడం ప్రాంభించారు నిపుణులు. ఆ తర్వాత ఇది నకిలీదని తేలింది. ఆర్టిఫషియల్ టెక్నాలజీతో రూపొందించిన ఫోటో అని నిర్థారించారు. దీనిపై క్షణ్ణంగా విచారణ జరిపిన అమండా ఫ్లోరియన్ అనే అమెరికన్ జర్నలిస్ట్ ఇలాంటి ఫోటోలు హాంకాంగ్, పోలాండ్, ఉక్రెయిన్ మూలాలకు సంబంధించన సైట్లో దాదాపు 239 ఫోటోలను చూశానని, ఇది నకిలీదని తేల్చి చెప్పారు. ఇది నకిలీ ఫోటోనే అని ఫ్రెంచ్ టెక్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇమేజ్ డిటెక్టర్ సాయంతో నిర్థారించిందని తెలిపారు. ఆ ఫోటోను నిశితంగ పరిశీలిస్తే మనకు స్పష్టంగా అవగతమవుతుందని అన్నారు. ఉక్రెయిన్ వివాదా పరిష్కారం కోసం, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు జరగుతున్న భేటీని కాస్త దెబ్బతీసేలా ఈ ఫోటో ఉందన్నారు. ఈ ఫోటో కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు సృష్టించి, సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. ఈ మేరకు సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ..ఇలాంటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పుడూ..నెటిజన్లకు ఏది నకిలీ ఏది రియల్ అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. లేదంటే తప్పుడూ సమాచారం వ్యాప్తి చెందడమే గాక ఇరు దేశాల మద్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితికి దారితీసుందని హెచ్చరించారు. అదీగాక సరిగ్గా చైనా అధ్యక్షుడు పర్యటనలో ఉండగా ..ఇలాంటి ఫోటోలు మరింత వివాదాలకు తెరితీసే ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కాబట్టి అలాంటి వాటికి చెక్పెట్టేలా జాగ్రత్తగా ఉండటమేగాక, పూర్తిగా తెలుసుకున్నాకే ఇలాంటి ఫోటోలను షేర్ చేయమని సదరు జర్నలిస్ట్ నెటిజన్లను కోరారు. Wait a minute.... WTF is this? 👀 pic.twitter.com/FekVlBfZ63 — MAKS 22🇺🇦 (@Maks_NAFO_FELLA) March 20, 2023 (చదవండి: హాట్ టబ్లో సేద తీరుతున్న జంటపై సడెన్గా మౌంటైన్ లయన్ దాడి..ఆ తర్వాత..) -
హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్గా ఏం చేశాడంటే!
దక్షిణాదిలో ప్రజలు తమ టిఫిన్ సెక్షన్లో ఎక్కువగా తినే వంటకాల జాబితాలలో మసాల దోస ఖచ్చితంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే దోసలందు మసాల దోస టేస్ట్ వేరయా అన్నట్లు ..దాని తిని ఆశ్వాదించాల్సిందే తప్ప మాటలతో చెప్పలేము. అంతటి ప్రాముఖ్యమున్న వంటకానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి ఆకలి వేసి ముంబైలోని కృష్ణ ఛాయా హోటల్కు వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాల దోస ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత వెయిటర్ తన ఆర్డర్ను తీసుకువచ్చి ఇచ్చాడు. అయితే అది చూసి సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే.. తాను ఆర్డర్ చేసిన మసాలా దోశను.. మసాలా విడిగా, దోశను విడిగా సర్వ్ చేశాడు ఆ వెయిటర్. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి సాంబర్, చట్నీతో దోశ తిని సరిపెట్టుకున్నాడు. మరి మిగిలిన మసాలాను ఏం చేశాడన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. తన ట్వీట్లో.. "నేను ఒక ఫుడ్ బ్లాగర్ని. నిన్న కృష్ణ ఛాయా దగ్గర మసాలా దోసె ఆర్డర్ చేసాను. లోపల ఏం జరిగిందో తెలియదు గానీ వాళ్ళు మసాల దోసకు బదులుగా.. దోస విడిగా, మసాలా విడివిడిగా సర్వ్ చేశారు. నేను దోసె తిన్నాను. విడిగా ఇచ్చిన మసాలాను ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్లో ఉంచాను. ఆ తర్వాత రోజు దాచిన మసాలతో నా ఇంట్లో మసాల దోశ చేసుకుని తిన్నాను. టెస్ట్ ఓహోహో!" అని మసాల దోశ ఫోటోని షేర్ చేశాడు. ఆ వ్యక్తి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అతని క్రియేటివికి ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపించారు. Main bhi food blogger. I ordered a masala dosa from Krishna Chhaya yesterday. They sent the dosa and masala separately. I ate the dosa. Refrigerated the masala. And made my own masala dosas at home today. Ohoho! pic.twitter.com/Xbxvw4E1Ms — Ramki (@ramkid) March 19, 2023 -
కోహ్లి విషయంలో స్మిత్ మొన్న అలా.. నిన్న ఇలా! బీసీసీఐ ట్వీట్ వైరల్
India vs Australia, 4th Test: టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు జట్ల మధ్య పోటాపోటీ క్రికెట్ ప్రేమికులకు మజా అందిస్తుంది. ఇక బోర్డర్- గావస్కర్ ప్రతిష్టాత్మక ట్రోఫీ గురించి చెప్పేదేముంది. సంప్రదాయ క్రికెట్లో ఇరు మేటి జట్లు తలపడుతుంటే ముచ్చటగా ఉంటుంది. అయితే, అదే సమయంలో స్లెడ్జింగ్ చేస్తూ శ్రుతిమించే ఆటగాళ్లను చూస్తే కాస్త చిరాకేస్తుంది. కానీ.. ఈసారి టీమిండియా- ఆసీస్ టెస్టు సిరీస్లో పిచ్ గురించి మినహా పెద్దగా మాటల యుద్ధాలు కనిపించలేదు. అందుకు భిన్నంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య ‘బ్రొమాన్స్’ సన్నివేశాలు హైలైట్గా నిలుస్తున్నాయి. మొన్న అలా చాలా కాలం తర్వాత టెస్టుల్లో కోహ్లి అర్ధ శతకం నమోదు చేసిన తర్వాత స్మిత్ అతడికి దగ్గరికి వచ్చి బ్యాట్ చెక్ చేస్తూ.. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటున్న దృశ్యాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. బీజీటీ- 2023లో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో రన్మెషీన్ కోహ్లి హాఫ్ సెంచరీని శతకంగా మలిచిన సంగతి తెలిసిందే. కెరీర్లో 75వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. డబుల్ సెంచరీ దిశగా పయనించగా టాడ్ మర్ఫీ బౌలింగ్లో 186 పరుగుల వద్ద బ్రేక్ పడింది. వెన్నుతట్టి.. దీంతో కోహ్లి పెవిలియన్ చేరుతున్న సమయంలో అతడిని అభినందించిన స్మిత్.. కోహ్లి చేతిలో చెయ్యి వేసి శభాష్ అన్నట్లుగా వెన్నుతట్టాడు. తన పట్ల స్మిత్ ఆప్యాయతకు బదులుగా కోహ్లి చిరునవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను.. ‘‘పరస్పర గౌరవం.. ఆరాధ్య భావన’’ అంటూ బీసీసీఐ ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఫొటో ఎంత బాగుందో! ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘స్మిత్ నిన్ను ఇలా చూస్తుంటే బాగుంది. కింగ్ కోహ్లిని నువ్వు అభినందించిన తీరు మా హృదయాలు గెలుచుకుంది. ఆటలో మాత్రమే ప్రత్యర్థులు.. ఆటగాళ్లంతా ఒక్కటే అని మరోసారి నిరూపితమైంది. ఈ ఫొటో ఎంత బాగుందో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య 75 ఏళ్ల అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మార్చి 9న అహ్మదాబాద్ టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆట సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ- ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియానికి విచ్చేసి ఆటగాళ్లను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ నేపథ్యంలో కోహ్లి- స్మిత్ ఫొటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. 1205 రోజుల తర్వాత... అహ్మదాబాద్ టెస్టులో శతకం బాదిన కోహ్లి పలు రికార్డులు సృష్టించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: 21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్ Ind vs Aus- Ahmedabad Test: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా మరెన్నో.. 📸 Respect and admiration 👏👏#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/e5QJcj4OiL — BCCI (@BCCI) March 12, 2023 -
సుధామూర్తి సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్తాపకులు నారాయణమూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. విద్యావేత్త, రచయితగా, సామాజిక సేవకురాలిగా అనేక కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరును సంపాదించారు. అంతేగాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్గా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాలలో ఆమె అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం సుధామూర్తిని పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. అయితే సంపన్న కుటుంబం, వేల కోట్ల ఆస్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న సూధామూర్తి ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించుకోరు. మాటల్లోనూ, చేతల్లోనూ ఎంతో నిరాడంబరత ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకుంటారు. తాజాగా మరోసారి ఆమె తన సింస్లిసిటీతో వార్తల్లోకెక్కారు. కేరళ తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో మంగళవారం జరిగిన ప్రసిద్ధ పొంగళ(Pongala) పండుగకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు సుధామూర్తి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆమె అనేకమంది మహిళల మధ్య కూర్చొని పొంగళి (బియ్యం,కొబ్బరి, బెల్లంతో చేసే తీపి వంటకం) తయారు చేసి దేవతకు సమర్పించారు. అంతేగాక భక్తులకు ప్రసాదం వడ్డించడంలోనూ సాయం చేశారు. అయితే సుధామూర్తి వద్ద భద్రత, వీఐపీ హడావిడి లేకపోవడంతో తనను ఎవరూ గుర్తించలేకపోయారు. మహిళలందరితోపాటే గుడి వద్ద మండుతున్న ఎండలో కూర్చొని నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్న ఆమె ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. A totally humbling experience. This is Sudha Murthy, Rishi Sunak's(PM) mother in-law!!!#SudhaMurthy #RishiSunak pic.twitter.com/ZrEAAHnds7 — Viren Patel (@shaakbhaji) March 11, 2023 సుధామూర్తి ఇంత సింపుల్గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భర్త, అల్లుడు గొప్ప స్థానంలో ఉన్నా ఆమెలో ఒకింత కూడా గర్వం నిపించడం లేదని ప్రశంసిస్తున్నారు. కాగా అత్యధికంగా మహిళలు తరలివచ్చే అట్టుకల్ పొంగళ పండుగకు తాను రావడం ఇదే తొలిసారి అని మూర్తి తెలిపారు. ఎంతో మంది మహిళలు కలిసి ఈ వేడుకలు చేసుకుంటున్నారని, అంతా ఒక్కటే అనే సందేశమిచ్చేదే ఈ వేడుక అని పేర్కొన్నారు. అందరూ సమానమేనన్న ఈ భావన తనకెంతో నచ్చిందన్నారు. i am proudly say that the women empower of india sri sudha murthy to lead our generation to power missile her is the founder of infosys nd everyone learns alot from her how to respect our culture traditions simplicity 🙏 @AskAnshul @SriSri @NameisNani @imVkohli @narendramodi pic.twitter.com/VTxAHxEprO — Rakurthi Suresh (@SureshnaiduR) March 10, 2023 చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా.. -
ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది?
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కొంతకాలంగా బయటకు రావడం లేదు. ఇటీవల ఆయన నటించిన లాల్ సింగ్ చద్ధా మూవీ అనంతరం ఆయన మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. అలాగే షూటింగ్స్లో సైతం పాల్గొనడం లేదనే సమాచారం. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ జైపూర్ జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆమిర్ ఖాన్ సందడి చేశారు. చదవండి: మహేశ్ మేకప్ మ్యాన్ ఇంట విషాదం.. స్వయంగా వెళ్లి పరామర్శించిన నమ్రత! రాజస్థాన్లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్స్ అంత ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్కు కనుల విందుగా ఉంది. ఈ వివాహ వేడుకులో అక్షయ్, మోహన్ లాల్లు డాన్స్ చేస్తుండగా పక్కనే ఆమిర్ నిలబడి కనిపించాడు. చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ అయితే అక్కడ ఆయన చేతితో స్టిక్ పట్టుకుని ఉన్నాడు. ఆయన చేతితో స్టిక్ పట్టుకుని జాగ్రత్తగా నడుస్తూ కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంత ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎందుకు స్టిక్ పట్టుకుని నడుస్తున్నారు? ఆయన కాలికి ఏమైంది? అంటూ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి ప్రశ్న వర్షం కురుస్తోంది. అయితే ఆమిర్కు ఏమైందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి దీనిపై ఆమిర్ స్పందించాలని, తన ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
North Korea: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్ను అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్లో శక్తిమంతమైన ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏంటో తెలిసేలా చేశారు. అయితే సైనిక పరేడ్లో పాల్గొన్న ఓ యూనిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జాంబీ యూనిట్. కిమ్ సైనిక పరేడ్లో జాంబో యూనిట్ను చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. జాంబీల్లా కన్పిస్తున్న ఈ సైనికుల పరేడ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మొహానికి రంగులు వేసుకుని ఒళ్లంతా పచ్చగడ్డి కప్పుకున్నట్లుగా కన్పించిన సైనిక వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఈ పరేడ్లో క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ల కంటే జాంబీ యూనిట్ను చూసినప్పుడే తాను భయపడ్డాని అతను చెప్పుకొచ్చాడు. కాగా.. కొరియన్ పీపుల్ రివల్యూషన్ ఆర్మీ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ బుధవారం ఘనంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పదేళ్ల కూతురు కిమ్ జూ అయే కూడా పాల్గొన్నారు. దీంతో కిమ్ తర్వాతే ఈమే ఉత్తర కొరియాను పాలించేందుకు సన్నద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకుంది. కిమ్ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. చదవండి: యద్ధాన్ని ఆపేలా పుతిన్ని మోదీ ఒప్పించగలారా? -
'అలా చూస్తూ ఉండిపోయావు.. ఎవరు పిల్లా నువ్వు?'
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటికి ధోనికి అభిమానులు ఎక్కువే. అందుకు ధోని కళ్లలో కనిపించే కూల్నెస్, చిరునవ్వే కారణం. ధోని లుక్స్కు, నవ్వుకు ఎంతటి వారైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఈ జాబితాలో ఎందరో యువతులు, మహిళలు కూడా ఉన్నారు. మరి అలాంటి ధోని తమ కళ్ల ముందు నుంచి పోతుంటే అతనితో సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి ఎగబడడం సహజంగా చూస్తుంటాం. తాజాగా ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు కానీ.. ధోని కూల్ స్మైల్, చిరునవ్వుకు ఒక యువతి ఫ్లాట్ అయిపోయింది. ఒక ప్రమోషన్కు సంబంధించిన కార్యక్రమం ముగించుకొని తన కారు దగ్గరికి వస్తున్న సమయంలో ధోని ఆ యువతి కంట పడ్డాడు. అంతే పక్కన పరిసరాలను మరిచిపోయి ధోనిని అలా చూస్తూ ఉన్నచోటనే బొమ్మలా నిలబడిపోయింది. ఆ సమయంలో సదరు యువతి ధోనిని చూస్తూ ఇచ్చిన చిరునవ్వు అందరిని ఆకట్టుకుంది. ధోనిని కవరేజ్ చేయడానికి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ ఆ యువతి ఫోటోలను కూడా క్లిక్మనిపించాడు. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్గా మారాయి. ''నీ నవ్వుతో మా మనుసులు దోచేశావు.. ఎవరు పిల్లా నువ్వు''.. అని ఒకరు కామెంట్ చేస్తే.. ''ధోని భయ్యాను చూసి నువ్వు ఫ్లాట్ అయితే.. నీ అందాన్ని చూసి నేను ఫ్లాటయ్యా'' అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేయడం ఆసక్తి కలిగించింది. చదవండి: ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ధోని.. వీడియో వైరల్ 'జబ్బలు చరుచుకున్నారు.. ఇప్పుడేమైంది' -
అమ్మను హత్తుకున్న మధురజ్ఞాపకం! ఆయన వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం
India vs Australia, 1st Test- KS Bharat: ‘‘నేను ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి వరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. సుదీర్ఘ ప్రయాణంలో.. ఇప్పుడిలా.. నా టెస్టు జెర్సీని చూసిన క్షణాలు అత్యంత విలువైనవి. నాకిది గర్వకారణం! ఈ ప్రయాణం భావోద్వేగాలతో కూడుకున్నది’’ అంటూ వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ ఉద్వేగానికి లోనయ్యాడు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యుల నడుమ టీమిండియా క్యాప్ అందుకున్న భరత్.. తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన వల్లే ఇదంతా.. ఈ నేపథ్యంలో భరత్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ‘‘నేనిక్కడివరకు వచ్చానంటే అందుకు కారణం మా కోచ్ జై క్రిష్ణారావు. నాపై నాకు నమ్మకం లేని సమయంలో ఆయన నాపై విశ్వాసం ఉంచారు. నిజానికి నాపై నాకంటే ఆయనకే ఎక్కువ నమ్మకం. ఆయన వల్లే ఇదంతా! ఒక్కరోజులో ఇదేమీ సాధ్యం కాలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను. 2018లో ఇంగ్లండ్తో ఇండియా-ఏ తరఫున ఆడినపుడు రాహుల్ సర్ నన్ను మొదటిసారి చూశారు. చాలా సేపు మేము మాట్లాడుకున్నాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటమే నాకు ముఖ్యం. నేనెప్పుడూ అలాగే ఆలోచించాలని ఆయన నాతో చెబుతూ ఉంటారు’’ అని 29 ఏళ్ల కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ KS Bharat: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ శుభాకాంక్షలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్..
తిరువనంతపురం: కేరళ కోజికోడ్కు చెందిన ట్రాన్స్జెండర్ జంట జియా పావల్, జహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల క్రితమే వీరికి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా.. కోజికోడ్ మెడికల్ హాస్పిటల్లో బుధవారం ఉదయం జహద్ సిజేరియన్ ద్వారా ప్రసవించింది. పుట్టింది ఆడ బిడ్డా లేక.. మగబిడ్డా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తమ బిడ్డ ఫొటోను జియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు కావాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు సంతోషంగా ఉందని, ఆనంద బాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. తమకోసం ప్రార్థించిన వారికి, మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుట్టుకతో మగ అయిన జియా శస్త్రచికిత్స చేయించుకొని స్త్రీగా మారుతోంది. పుట్టుకతో స్త్రీ అయిన జహద్ శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారాలనుకున్నాడు. అయితే ఇంతలోనే జహద్ గర్భం దాల్చడంతో ఇద్దరూ ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..
టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన ట్విట్టర్లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి. వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. The 7 year old girl who kept her hand on her little brother's head to protect him while they were under the rubble for 17 hours has made it safely. I see no one sharing. If she were dead, everyone would share! Share positivity... pic.twitter.com/J2sU5A5uvO — Mohamad Safa (@mhdksafa) February 7, 2023 (చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..) -
‘హీరో’కు ఏమాత్రం తీసిపోడు! ఏం మాట్లాడుతున్నారు? నిజంగానే..
MS Dhoni New Look Viral: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్కు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఈ మిస్టర్ కూల్కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నప్పటికీ అతడికి ఉన్న ఫాలోయింగ్ ఇసుమంత కూడా తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ధోని.. ఇప్పటికీ తన ఆటతో అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల రాంచిలో న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా అక్కడికి రాగా తలా.. తన ఎంట్రీతో భారత ఆటగాళ్లను సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన సతీమణి సాక్షితో కలిసి సొంతమైదానంలో జరుగుతున్న మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు. దీంతో కెమెరాలన్నీ ధోనిపైనే ఫోకస్ అయ్యాయంటే అతడి మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీస్ డ్రెస్లో పోలీస్ డ్రెస్లో లాఠీ చేతబట్టి సహచరులతో కలిసి ధోని నడుస్తున్నట్లుగా ఉన్న ఆ చిత్రం అభిమానులను కట్టిపడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘సినీ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాడు. సింగం సిరీస్లో తదుపరి నువ్వే కథానాయికుడివి. రోహిత్ శెట్టి కన్ను నీపై పడటం ఖాయం భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. MS Dhoni as a police officer in an ad. pic.twitter.com/nleS9DR8bh — Johns. (@CricCrazyJohns) February 2, 2023 అయితే, ధోని ఫ్యాన్స్ మాత్రం.. ‘‘ఏం మాట్లాడుతున్నారు.. హీరోలా ఉండటమేంటి.. నిజ జీవితంలో హీరో తను’’ అని అభిమానం చాటుకుంటున్నారు. కాగా ఈ ఫొటో ఓ టీవీ యాడ్కు సంబంధించినదిగా సమాచారం. ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. సైనికుడిగానూ.. ఇక టీమిండియా తరఫున 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన జార్ఖండ్ డైనమైట్ ధోని 17 వేల పరుగులు సాధించాడు. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తలా.. సీఎస్కే కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కాగా క్రీడా రంగంలో.. ధోని సేవలను గుర్తించిన కేంద్రం అతడికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. సినీ రంగంలో.. ఇదిలా ఉంటే.. ధోని ఇటీవలే సినిమా రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. తమ బ్యానర్పై నిర్మిస్తున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను ఇటీవలే విడుదల చేశారు. ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్స్ మ్యారీడ్) పేరిట కోలీవుడ్ సినిమా నిర్మించనున్నారు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న తలా ఇలా అక్కడి సినీ పరిశ్రమపై దృష్టి పెట్టడం గమనార్హం. చదవండి: Joginder Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్ హీరో Ind Vs Aus: నాలుగురన్నరేళ్ల పైనే అయింది.. టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు -
వాళ్లిద్దరు నిజంగా కలిశారా..?
Fact Check.. టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్మన్ గిల్ ప్రస్తుతం జట్టులో భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గిల్ మూడు ఫార్మట్లలోనూ(టెస్టు, వన్డే, టి20లు) కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఓపెనింగ్ స్థానంలో వస్తూ సెంచరీలతో దడ పుట్టిస్తున్న గిల్ రానున్న కాలంలో జట్టులో కీలక బ్యాటర్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలీ న్యూజిలాండ్తో ముగిసిన వన్డే, టి20 సిరీస్లోనూ శుబ్మన్ గిల్ అదరగొట్టాడు. ముఖ్యంగా టి20 ఆటకు సరిపోడు అని విమర్శలు వచ్చిన వేళ.. కివీస్తో జరిగిన మూడో టి20లో 63 బంతుల్లోనే 126 పరుగులు నాటౌట్.. సుడిగాలి ఇన్నింగ్స్తో గట్టి సమాధానమిచ్చాడు. తనపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా ఈ ఇన్నింగ్స్తో అవన్నీ తొలగిపోయినట్లేనని చెప్పకనే చెప్పాడు గిల్. టీమిండియా మాజీ క్రికెటర్లు సహా కోహ్లి లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ ఫ్యూచర్ స్టార్ క్రికెటర్ అంటూ గిల్పై పొగడ్తలు కురిపించాడు. కచ్చితంగా భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్లో గిల్ పాత్ర కీలకం కానున్నట్లు స్పష్టంగా తెలియరానుంది. ఈ విషయం పక్కనబెడితే.. సోషల్ మీడియాలో శుబ్మన్ గిల్కు సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్, నటి సారా అలీఖాన్తో గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్నాళ్ల నుంచి రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అటు గిల్.. ఇటు సారా ఇద్దరు నోరు మెదపలేదు. అయితే మీడియా కంట పడకుండా వీరిద్దరు తమ ప్రేమాయణం కొనసాగిస్తునట్లు క్రికెట్ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగానే.. బుధవారం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో గిల్.. సారా అలీఖాన్లు సీరియస్గా మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే వాళ్లిద్దరు నిజంగా కలుసుకున్నారా లేదంటే ఇదంతా గాసిప్ రాయుళ్ల ఎడిటింగ్ పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తాజాగా చక్కర్లు కొడుతున్న ఫోటో పాతదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి సారా అలీఖాన్ అహ్మదాబాద్కు రాలేదని.. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటో ఎడిటింగ్ అని.. ఎయిర్పోర్ట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా క్రియేట్ చేశారని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం గతేడాది కూడా ఇలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో పెట్టారని.. అది ఇప్పటిది మాత్రం కాదని కుండబద్దలు కొట్టారు. ఏది ఏమైనా గిల్-సారా అలీఖాన్లు మధ్య ప్రేయాయణం నడుస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. వీరికి సంబంధించిన వార్తలతో మాత్రం కొంతమంది బతికేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొన్నారు. ఇక గిల్, సారా అలీఖాన్లు కలిసి జైపూర్లోని ఒక రెస్టారెంట్లో తొలిసారి కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తుందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పంజాబీ నటి సోనమ్ భజ్వాతో టీవీ చాట్ షో సందర్భంగా గిల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒక అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు.. ఆమె పేరు సారా అని మాత్రమే చెప్పాడు. అయితే సారా అని పేరు చెప్పి ముందు వెనకాల ఏం చెప్పకుండా అభిమానులను కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాడు. దీంతో కొంతమంది గిల్.. సారా అలీఖాన్తో కాకుండా సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్తో రిలేషిన్షిప్ కొనసాగిస్తున్నట్లు పుకార్లు పుట్టించారు. అయితే శుబ్మన్ గిల్ చెల్లెలలు షహనీల్కు సారా టెండూల్కర్ మంచి స్నేహితురాలు. వారిద్దరు ఇన్స్టాగ్రామ్లో తరచు యాక్టివ్గా ఉంటారు. ఈ స్నేహం కూడా గిల్, సారా టెండూల్కర్లు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సారా టెండూల్కర్, శుబ్మన్ గిల్లు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కాకపోవడంతో రిలేషన్షిప్ వార్తలకు కూడ బ్రేక్ పడినట్లయింది. దీంతో గిల్.. సారా అలీఖాన్తోనే డేటింగ్లో ఉన్నాడని.. వారిద్దరి ప్రేమాయణం నడుస్తుందంటూ మరోసారి సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. చదవండి: గిల్పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్ను ఉతికారేసిన విండీస్ స్టార్ -
'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు'
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో సెమీస్కు దూసుకెళ్లి జోష్ మీదున్న జొకోవిచ్కు అతని తండ్రి రూపంలో చేదు అనుభవం ఎదురైంది. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా టోర్నీలో రష్యా, బెలారస్కు చెందిన జెండాలను నిర్వాహకులు నిషేధించారు. తాజాగా రష్యా జెండా.. జొకోవిచ్ తండ్రి సర్డాన్ జోకొవిచ్ను చిక్కుల్లో పడేసింది. స్టేడియాల్లోకి జెండాలు నిషేధం కావడంతో రష్యా మద్దతుదారులు.. స్టేడియం బయట తమ దేశ జెండాలతో నిరసనలు చేస్తున్నారు. ఇదే సమయంలో బుధవారం జొకోవిచ్ క్వార్టర్స్ మ్యాచ్ చూసేందుకు అతని తండ్రి సర్డాన్ జొకోవిచ్ రాడ్లివర్ ఎరినాకు వచ్చాడు. ఈ సమయంలో రష్యా జెండాలు పట్టుకున్న అభిమానులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాదు రష్యా వర్ధిల్లాలి అనే నినాదం చేయడం.. మ్యాచ్ కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించడం జొకోవిచ్ తండ్రిని మరింత వివాదంలోకి నెట్టింది. ఆ తర్వాత పుతిన్ ఫొటో ఉన్న రష్యా జెండా పట్టుకున్న ఓ వ్యక్తి పక్కనే సర్డాన్ జోకొవిచ్ నిలబడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో కనిపించింది. సాధారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఆయా దేశాల జెండాలు పట్టుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాతోపాటు బెలారస్ జెండాలను నిషేధించారు. మ్యాచ్ చూడటానికి రష్యా జెండాలతో వచ్చిన నలుగురు వ్యక్తులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇప్పుడో స్టార్ ప్లేయర్ తండ్రే ఇలా నిరసనకారులకు మద్దతుగా నినాదాలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. సర్డాన్ జోకొవిచ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి''. జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గు చేటు'' అంటూ కొందరు తీవ్రంగా స్పందించారు. ^Sorry, not half, 3/8 #AusOpen semifinalists are flagless since Rublev didn't make it...though obviously the debates over Rybakina's nationality and what it means in this context are well-worn. — Ben Rothenberg (@BenRothenberg) January 25, 2023 Seems he was not the only one. @TennisAustralia What’s going on there? https://t.co/ZuAQ1kNHmU — Alex Dolgopolov (@TheDolgo) January 25, 2023 చదవండి: Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు టాప్లెస్గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' -
ధోని కొత్త లుక్ అదుర్స్.. ఫోటో వైరల్
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని కొత్త అవతారంలో అదుర్స్ అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ధోని బయట పెద్దగా కనబడడం లేదు. కేవలం ఐపీఎల్ ఉన్నప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ మొదలవనున్న నేపథ్యంలో ధోని తన ప్రాక్టీస్ను ప్రారంభించాడు. ఇటీవలే ధోని ప్రాక్టీస్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా తన ప్రాక్టీస్ ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్ల గడ్డం, నల్లజుట్టుతో సాల్ట్ అండ్ పెపర్ లుక్లో అభిమానుల కంటపడ్డాడు. ధోనీ ఇలా కొత్తగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది. నిజానికి ఒక రోజు ముందు కూడా ధోనీ ఫొటోలను కొందరు అభిమానులు తీశారు. కానీ దూరం నుంచి కావడంతో అతన్ని స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాది కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే ఈసారి మాత్రం ధోనికి చివరి ఐపీఎల్ కానుందని చాలా మంది అభిమానులు జోస్యం చెబుతున్నారు. ధోని సారధ్యంలో సీఎస్కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక గతేడాది రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి అతను మధ్యలోనే వైదొలగడంతో తిరిగి ధోనినే జట్టును నడిపించాడు. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. New look of MS Dhoni during the practice session ahead of IPL 2023 pic.twitter.com/5V7qARShxp — Johns. (@CricCrazyJohns) January 20, 2023 MS Dhoni practicing at nets ahead of IPL 2023 !! 😍💥#MSDhoni • #IPL2023 • #WhistlePodu pic.twitter.com/Ai1FGVosGP — Nithish MSDian 🦁 (@thebrainofmsd) January 19, 2023 చదవండి: రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం -
జూనియర్ ఎన్టీఆర్తో సూర్య, దేవిషా!.. బ్రదర్ అంటూ ట్వీట్.. వైరల్
Suryakumar Yadav- Junior NTR: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను కలిశాడు. తారక్తో కలిసి సతీసమేతంగా ఫొటో దిగాడు. ప్రపంచ వేదికపై మరోసారి భారతీయ సినిమా సత్తాను చాటిన ఆర్ఆర్ఆర్ సినిమా పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం పట్ల సూర్య హర్షం వ్యక్తం చేశాడు. బ్రదర్ అంటూ ట్వీట్ ఈ సందర్భంగా తారక్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. భార్య దేవిషా శెట్టి, ఎన్టీఆర్ నడుమ తాను నిలబడి ఉన్న ఫొటోను పంచుకున్న సూర్య.. ‘‘మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరా! ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మీకు మరోసారి శుభాకాంక్షలు’’ అని ట్విటర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్కు వచ్చాడు. ఉప్పల్లో మ్యాచ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్ మధ్య తొలి వన్డే జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా క్రికెటర్లు ఎన్టీఆర్ను కలవడం విశేషం. కాగా టీ20లలో నంబర్ 1గా ఎదిగిన సూర్యకుమార్.. ఇటీవల స్వదేశంలో ముగిసిన శ్రీలంకతో సిరీస్లో సత్తా చాటాడు. నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి జట్టు, సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో వన్డేలో చోటు దక్కించుకున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. కివీస్తో వన్డేల్లో అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తోంది. It was so lovely meeting you, brother! Congratulations once again on RRR winning the Golden Globe award 🤩 pic.twitter.com/6HkJgzV4ky — Surya Kumar Yadav (@surya_14kumar) January 17, 2023 ఇక రామ్ చరణ్, జూనియర్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. ప్రేమ్రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో తొలి వన్డే.. సూర్యకుమార్కు నో ఛాన్స్! కిషన్కు చోటు Murali Vijay: సెహ్వాగ్లా నాక్కూడా ఆ ఫ్రీడం దొరికి ఉంటే కథ వేరేలా ఉండేది! నా విషయంలో.. -
ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి.. ఫొటో వైరల్..
తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనతో ఎయిర్ ఇండియా సంస్థపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ విమానంలో ప్రయణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. విమానంలో రాళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష్యమేంటి? ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లా అని సర్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు. You don’t need resources and money to ensure stone-free food Air India (@airindiain). This is what I received in my food served in the flight AI 215 today. Crew member Ms. Jadon was informed. This kind of negligence is unacceptable. #airIndia pic.twitter.com/L3lGxgrVbz — Sarvapriya Sangwan (@DrSarvapriya) January 8, 2023 ఈ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. విమానయాన పరిశ్రమలో ఒకప్పుడు ప్రమాణాలకు మారుపేరు అయిన టాటా జేఆర్డీ సంస్థ.. అంతర్జాతీయ గౌరవం పొందింది. ఇప్పుడు మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చి ప్రమాణాల విషయంలో ఈ స్థాయికి పడిపోయింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? నిర్వహణ లోపమా? అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ఆ రాయి ఉన్న ఆహారం తని మీ పన్ను విరిగిపోయి ఉంటుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మహిళ ట్వీట్పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ విషయంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణమే క్యాటరింగ్ టీం దృష్టికి దీన్ని తీసుకెళ్తామంది. తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు అభినందించింది. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ఎంట్రెన్స్ గేటు వద్ద తప్పించుకుని విమానాశ్రయంలోకి వెళ్లినప్పటికీ ఎక్స్-రే మెచీన్ వద్ద దొరికిపోయింది. బ్యాగును స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది లోపల పామును చూసి షాక్ అయ్యారు. ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది 'బోవా కన్స్ట్రిక్టర్' పామును. ఇది పిల్ల పాము. 4 అడుగులుంది. దీనికి ఎమోషనల్గా దగ్గరయ్యానని, అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మహిళ చెప్పింది. ఈ పాముకు 'బార్తోలోమ్యూ' అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది. బోవా కన్స్ట్రిక్టర్ పాములు చూడటానికి కొండచిలువలా కన్పిస్తాయి. ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ పాము విషపూరితం కానందు వల్ల అమెరికాలో చాలా మంది వీటిని సరదాగా ఇళ్లలోనే పెంపుడు జంతువుల్లా చూసుకుంటారు. చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం.. -
Rishabh Pant: బ్రదర్ అంటూ వార్నర్ భావోద్వేగం.. ఫొటో వైరల్
David Warner- Rishabh Pant: టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేశాడు. ‘‘ నీకు మేమంతా ఉన్నాం బ్రదర్’’ అంటూ పంత్పై అనురాగాన్ని చాటుకున్నాడు. కాగా భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్.. డిసెంబరు 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వెళ్తున్న సమయంలో అతడు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరగగా.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ ఘటనలో పంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో చికిత్స పూర్తైన తర్వాత ముంబైకి ఎయిర్లిఫ్ట్ చేసింది బీసీసీఐ. ప్రస్తుతం అతడు కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ త్వరగా కోలుకోవాలంటూ అతడి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పంత్ ‘సహచర ఆటగాడు’ వార్నర్ సైతం.. ‘‘త్వరగా కోలుకో బ్రదర్’’’ అంటూ అతడితో దిగిన ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంత్, వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది వార్నర్ను ఢిల్లీ కొనుగోలు చేయగా.. పంత్ కెప్టెన్సీలో అతడు మ్యాచ్లు ఆడాడు. ఇక ప్రమాదం బారిన పడ్డ పంత్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన నేపథ్యంలో అతడి స్థానంలో వార్నర్ ఢిల్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్దీప్, గిల్కు నో ఛాన్స్! మరో పేసర్ ఎంట్రీ Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్ రిప్లై -
ఆరెంజ్ కలర్ శారీలో మీనాక్షి తళుకులు! చీర, నగల ధర ఎంతంటే!
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో పలకరించిన హీరోయిన్ మీనాక్షీ చౌదరి. హిట్- 2తో హిట్ కొట్టిన ఆమె.. తెలుగు సినీ రంగంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ను సృష్టించుకున్నట్టే... ఫ్యాషన్ వరల్డ్లోనూ తనదైన మార్క్ను క్రియేట్ చేసుకుంది. ఆమెకు నచ్చిన బ్రాండ్స్లో ఇవి కొన్ని.. లేబుల్ సోనమ్ లుథ్రియా.. ముంబై ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సోనమ్ లుథ్రియా.. 2012లో తన పేరు మీదే ఓ బొటిక్ను ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఫ్యాబ్రిక్పై సోనమ్కున్న పట్టు.. ఆమెను టాప్ మోస్ట్ డిజైనర్స్లో ఒకరిగా చేర్చింది. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్తో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. కర్ణిక జ్యూయెల్స్.. ఫ్యాషన్కు తగ్గ ఆభరణాలతోనే అందం మరింత పెరుగుతుందన్న మాటను బలంగా నమ్మింది కర్ణిక జ్యూయెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి. అందుకే, ఎప్పటికప్పడు ఆకట్టుకునే అందమైన, వైవిధ్యమైన డిజైన్స్ను రూపొందిస్తూ కర్ణిక జ్యూయెల్స్ను వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలిబ్రిటీ బ్రాండ్స్గా నిలిపింది. అన్ని రకాల గోల్డ్, సిల్వర్, గోల్డ్ ప్లేటేడ్ నగలతో పాటు, ఫ్యూజన్, నక్షీ, నవరతన్, స్వరోవ్స్కీ వంటి ఇతర బ్రాండ్ల నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: లేబుల్ సోనమ్ లూథ్రియా. ధర: రూ. 25,500 జ్యూయెలరీ బ్రాండ్: కర్ణిక జ్యూయెల్స్ ధర: రూ. 33,000 నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు. అలాగే ముందు మనకు మనం అందంగా ఉన్నామని నమ్మాలి. అప్పుడే మన అందం మరింత అందంగా కనపడుతుంది. – మీనాక్షీ చౌదరి -దీపికా కొండి -
Bavuma-Marco Jansen: 'వీడేంట్రా బాబు ఇంత పొడుగున్నాడు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులోనూ ఓటమిపాలైన సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కోల్పోయింది. ఇక మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రొటీస్ భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం క్లీన్స్వీప్పై కన్నేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. సౌతాఫ్రికా మాత్రం నాలుగో స్థానానికి పడిపోయి అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. సోషల్ మీడియలో ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. ఇది కేవలం సరదా కోసం మాత్రమే రాసుకొచ్చాం. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ బవూమా, మార్కో జాన్సెన్లు క్రీజులో ఉన్నారు. సాధారణంగా బవుమా చాలా పొట్టిగా ఉంటాడు. ఇక మార్కో జాన్సెన్ చాలా పొడగరి.. దాదాపు ఆరున్నర అడుగులు ఉంటాడు. యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ బవుమా.. మార్కో జాన్సెన్ వైపు అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదెలా ఉందంటే.. ''వీడేంటి ఇంత పొడుగున్నాడు అనేలా''.. ఫోటో చూడగానే మీకు కూడా అలాగే కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది. మాములుగానే తమకంటే హైట్ ఎక్కువుంటేనే తెగ బాధపడిపోయే పొట్టోళ్లు.. తమకు సాధ్యం కాని ఎత్తులో ఉన్న వ్యక్తులను చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పాపం బవుమా పరిస్థితి కూడా అదే. అందుకే అతని వైపు చూస్తూ బవుమా కచ్చితంగా అదే అనుకొని ఉంటాడు. ఇక వాస్తవానికి వస్తే.. బవుమా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. నిజానికి మార్కో జాన్సెన్తో రివ్యూ విషయమై మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే ఒక ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్మనిపించాడు. ఒక్క ఫోటోతో మనం ఇంకో విధంగా ఊహించుకునేలా చేసిన ఫోటోగ్రాఫర్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
MS Dhoni: అప్పుడే దుబాయ్ వెళ్లావా? ధోనితో ఫొటో వైరల్
MS Dhoni- Rishabh Pant: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం పంత్.. ఐపీఎల్ 2023 మినీ వేలం ముగించుకున్న ధోని దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ధోని కుటుంబాన్ని కలుసుకున్న పంత్.. వారితో కలిసి డిన్నర్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఇక టీమిండియా ఫ్యాన్స్ ఈ ఫొటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘హే పంత్.. అప్పుడే దుబాయ్కు వెళ్లిపోయావా? నీ గురువు ధోనితో కలిసి హాలీడే ట్రిప్ ఆస్వాదిస్తున్నావ్ కదా! చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టులో రిషభ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ విలువైన 93 పరుగులు చేశాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని వేలంలో తన వ్యూహాలు అమలు చేశాడు. బెన్ స్టోక్స్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సఫలమై.. భవిష్యత్ కెప్టెన్ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. చదవండి: Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్లా అలా! 1089 రోజుల తర్వాత ఏకంగా డబుల్ సెంచరీ.. తొలి బ్యాటర్గా! కానీ అంతలోనే.. View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r) -
పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్..
విమానంలో తన పక్కన కూర్చున్న పెద్దాయన్ను ఓ మహిళా ప్రయాణికురాలు కాస్త అనుమానంగా, భయంగా చూస్తున్న ఈ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పరిస్థితిని వర్ణిస్తూ బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ అందుకు కారణం ఏమిటంటారా? ఆ వ్యక్తి మరెవరో కాదు.. 1970లు, 1980లలో భారత్ సహా వివిధ దేశాల్లో సుమారు 30 హత్యలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78). డబ్బు కోసం విదేశీ పర్యాటకులను ప్రత్యేకించి యువతులనే టార్గెట్ చేసి హతమార్చిన కిరాతకుడు. ఓ హత్య కేసులో సుమారు 20 ఏళ్లు నేపాల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని.. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. దీంతో స్వదేశమైన ఫ్రాన్స్కు దోహా మీదుగా వెళ్లేందుకు ఇలా ఖతార్ ఎయిర్వేస్ విమానం ఎక్కినప్పుడు ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?’ అని ఒకరు సవాల్ చేయగా ‘నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా’ అని మరొకరు పేర్కొన్నారు. పండుగ సీజన్లో విమాన టికెట్ బుక్ అయిందన్న ఆనందం చివరకు ఇలా నీరుగారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించగా ఇది ఆ మహిళ జీవితంలో అత్యంత భయానకమైన సందర్భమని ఇంకొకరు పోస్టు చేశారు. భారత జాతీయుడైన తండ్రికి, వియత్నాం జాతీయురాలైన తల్లికి శోభరాజ్ 1944లో జన్మించాడు. వియత్నాంలో అతను పుట్టిన ప్రాంతం అప్పట్లో ఫ్రాన్స్ వలసరాజ్యం కావడంతో అతనికి పుట్టుకతోనే ఫ్రెంచ్ పౌరసత్వం లభించింది. చదవండి: Japan Snow Storm: జపాన్లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
వైట్హౌస్లో క్రిస్మస్ వేడుకలు..డెకరేషన్లో బిజీగా ఉన్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులు వైట్హౌస్లో క్రిస్మస్ చెట్టును చక్కగా అలంకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాము కిస్మస్ చెట్టుకు కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నాం. అందరూ ఈ క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. బైడెన్ ఈ వారం ప్రారంభంలోనే వైట్హౌస్ నుంచి క్రిస్మస్ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పెరుగుతున్న విభజిత అమెరికాను, రాజకీయాలను కలుషితం చేస్తున్న వాటిని పరస్పరం వ్యతిరేకించే ప్రక్షాళనతో తాజాగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డెమొక్రాటిక్ నాయకుడు బైడెన్ ఇటీవల ప్రతిపక్ష రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంభించారు. ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని క్షణాలు నిశబ్దంగా ఆలోచించి మన హృదయంలో ఒకరినోకరు స్వచ్ఛంగా చూసుకోవాలనేదే ఆశ. అంతేగాదు క్రిస్మస్ చెట్లను పూలతో, దీపాలతో చక్కగా అలంకరించి చేసుకునే ఈ పండుగ నాడు డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్లుగా కాదు తోటి అమెరికన్లు లేదా తోటి మానవులు అన్న భావంతో సహృదయంతో ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు. Just a few finishing touches! Hope you and your loved ones are having a great Christmas Eve. pic.twitter.com/zdCjjRrI9o — President Biden (@POTUS) December 25, 2022 (చదవండి: అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్గా రికార్డ్) -
విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఫొటో వైరల్..
భువనేశ్వర్: ఒడిశా బలంగీర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రీడా పోటీల్లో భాగంగా ఓ విద్యార్థి విసిరిన జావెలిన్.. మరో విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లింది. బల్లెం అతడి మెడ ఎడమ భాగం నుంచి లోపలికి దూసుకెళ్లి కుడి భాగం నుంచి బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బార్పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. -
షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..
భోపాల్: మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ బుధవారం ప్రసవించింది. అయితే పుట్టిన బిడ్డకు నాలుగు కాళ్లు ఉండటం చూసి వైద్యులు షాక్ అయ్యారు. విషయం తెలియగానే జయారోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డా.ఆర్కే ధాకడ్.. వైద్య బృందంతో వెళ్లి చిన్నారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఆమెకు శారీరక వైకల్యం ఉంది. కొన్ని పిండాలు అదనంగా ఏర్పడుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో చెప్పాలంటే ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు శరీరం రెండు చోట్ల అభివృద్ధి చెందుతుంది. ఈ ఆడ శిశువు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయి. అని డా. ధాకడ్ వివరించారు. శిశువుకు ఇంకా వేరే శరీర భాగాల్లో వైకల్యం ఉందా? అని పరిశీలించిన అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇన్యాక్టివ్గా ఉన్న రెండు కాళ్లను శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని ధాకడ్ చెప్పారు.అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వెండితెరపై ఆయన విలక్షణ నటనకు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు. ఇక ఉప్పెన మూవీతో తెలుగులో విలన్గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి. చదవండి: పెళ్లయిన డైరెక్టర్ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు ఇదిలా ఉంటే స్టార్ నటుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న ఆయన లావుగా ఉండటం వల్ల తరచూ బాడీ షేమింగ్ను ఎదుర్కొంటుంటాడు. కాస్తా శరీరంపై శ్రద్ధ పెట్టాలని, డైట్ ఫాలో అవ్వు బ్రో అంటూ నెటిజన్లు ఆయనకు సూచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి నయా లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి స్లీమ్గా హీరోలా కనిపించి ట్రోలర్స్కి షాకిచ్చాడు. ఇక ఆయన కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దీంతో ఆయన ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) -
చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ మూడు రంగులు..
శాయంపేట: చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ.. సమయాన్నిబట్టి రంగులు మారుతోంది. అదే మందార ముటాబిలిసి పువ్వు ప్రత్యేకత. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు తన ఇంటి ఆవరణలో దక్షిణ చైనా, తైవాన్ దేశాలకు చెందిన మందార ముటాబిలిసి అనే మొక్కను నాటాడు. దీనిని కాన్ఫెడరేట్ గులాబీ, డిక్సీ రోజ్మల్లో, కాటన్ రోజ్ లేదా కాటన్ రోజ్మల్లో అని కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ఆదివారం ఈ మొక్కకు అరుదైన పుష్పం వికసించింది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారడం ఈ పువ్వు ప్రత్యేకత. ఒకేరోజు మూడు రంగుల్లో వికసించడంతో స్థానికులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: టాప్గేర్లో ఎంసెట్... రివర్స్లో జేఈఈ -
షాకింగ్.. తోకతో జన్మించిన చిన్నారి.. ఫొటో వైరల్..
మెక్సికోలో ఓ శిశువు తోకతో జన్మించింది. దాని పొడవు రెండు అంగుళాలు(5.7 సెంటీమీటర్లు) ఉంది. తమ దేశంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదు కాలేదని వైద్యులు తెలిపారు. పాప తోక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే తల్లిదండ్రులు, పాప ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే శిశవుల్లో తోక వంటి ఆకృతి ఏర్పడుతుందని, అయితే 9 నెలలు నిండేసరికి అది ఎముకగా మారి లొపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా తోకలతో శిశువులు జన్మిస్తారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..? -
FIFA WC: ఫిఫా వరల్డ్కప్లో ధోని హవా! గెలుపొందిన బ్రెజిల్కు ఊహించని షాక్!
FIFA WC 2022 Brazil vs Serbia: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ మిస్టర్ కూల్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఓ అభిమాని ఫిఫా ప్రపంచకప్-2022 వేదికపై ధోనిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఫ్యాన్స్ సందడి.. బ్రెజిల్ ఘన విజయం బ్రెజిల్ జట్టు మద్దతుదారుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. సాకర్ మెగా ఈవెంట్లో భాగంగా గ్రూప్- జిలోని మాజీ చాంపియన్ బ్రెజిల్ గురువారం సెర్బియాతో తలపడింది. దోహాలోని లుసైల్ స్టేడియంలో ఇరు జట్లు పోటీ పడగా.. నేమార్ బృందం సెర్బియాను చిత్తు చేసింది. 2-0తో ప్రత్యర్థిని ఓడించి ఘనంగా టోర్నిని ఆరంభించింది. ఇక బ్రెజిల్ జట్టును ఉత్సాహపరిచే క్రమంలో ఫ్యాన్స్ ఎల్లో జెర్సీలతో దర్శనమిచ్చారు. ధోని జెర్సీతో అభిమాని ఇందులో భాగంగా నాబీల్ అనే వ్యక్తి బ్రెజిల్కు సపోర్టుగా ఎల్లో జెర్సీ వేసుకోవడం సహా ధోని పేరిట ఉన్న చెన్నై సూపర్కింగ్స్ జెర్సీని చేతబట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలను సీఎస్కే ఫ్యాన్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన చెన్నై ఫ్రాంఛైజీ .. ‘‘ఎక్కడికెళ్లినా.. అక్కడ ఎల్లో’’ అంటూ హార్ట్ ఎమోజీని జతచేసింది. బ్రెజిల్కు ఊహించని షాక్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బ్రెజిల్ కెప్టెన్ నేమార్ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి కుడి పాదానికి దెబ్బ తగిలినట్లు సమాచారం. మ్యాచ్ రెండో అర్ధ భాగంలో 80వ నిమిషంలో సెర్బియా ఫుట్బాలర్ నికోలా మిలెన్కోవిచ్ ఢీకొట్టగా నేమార్ నొప్పితో విలవిల్లాడాడు. అతడు మైదానాన్ని వీడగా ఆంటోని నేమార్ స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా తమ తదుపరి మ్యాచ్లో బ్రెజిల్ స్విట్జర్లాండ్తో పోటీ పడనున్న తరుణంలో సారథి ఇలా గాయం బారిన పడటం గమనార్హం. చదవండి: FIFA WC 2022: వావ్ వాట్ ఏ గోల్.. రిచర్లిసన్ అద్భుత విన్యాసం! వీడియో వైరల్ IPL 2023: ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! Everywhere we go, there’s always Yellove! 💛 https://t.co/xMRix13Ea1 — Chennai Super Kings (@ChennaiIPL) November 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్..
అత్యంత అరుదైన బ్లాక్ నేప్డ్ పీసాంట్ పీజియన్ పక్షి(నెమలిలా కన్పించే పావురం) 140 ఏళ్ల తర్వాత కన్పించింది. శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ద్వీపకల్ప దేశం పపువా న్యూగినియాలో స్థానికులను వివరాలు అడిగి నెలరోజుల పాటు అడవిలో తిరిగి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమకు ఫలితం దక్కింది. శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ పక్షి దృశ్యాలు రికార్డయ్యాయి. బ్లాక్ నెప్డ్ పీసాంట్ పీజియన్ను ఇప్పటికే అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. ఇది పపువా న్యూ గినియా అడవిలో మాత్రమే ఇంకా అత్యంత అరుదుగా కన్పిస్తోంది. 10 ఏళ్లుగా కన్పించని, ఇంకా అంతరించిపోని పక్షులను కనుగొనే కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నంలో ఈ నెమలి పావురం కన్పించింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలా కన్పించని అరుదైన పక్షులు మొత్తం 150 ఉన్నట్లు చెప్పారు. ఈ పక్షిని చూశామని స్థానికులు చెప్పడంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి: ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం -
Sania Mirza: సానియా మీర్జా బర్త్డే.. షోయబ్ మాలిక్ పోస్ట్ వైరల్
Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టినరోజు నేడు. ఆమె ఈరోజు(నవంబరు 15) 36వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లవ్ యూ ఫరా ఈ క్రమంలో సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్,దర్శకురాలు ఫరా ఖాన్.. సానియా కేక్ కట్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన సానియా.. ‘‘లవ్ యూ’’ అంటూ బదులిచ్చారు. షోయబ్ విషెస్ ఇదిలా ఉంటే.. సానియా వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల పలు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. భర్త షోయబ్ మాలిక్కు దూరంగా ఉంటున్న ఆమె విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సానియా బర్త్డే సందర్భంగా షోయబ్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అవన్నీ అబద్ధాలేనా? భార్య కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తూ ఉన్న ఫొటోను పంచుకున్న ఈ వెటరన్ క్రికెటర్.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషాలతో నీ జీవితం విలసిల్లాలి. నీదైన ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు’’ అంటూ ఆమెను విష్ చేశాడు. ఈ ఫొటో చూసిన షోయబ్ ఫ్యాన్స్.. ‘‘విడాకుల రూమర్లు అబద్ధమని తేలినట్లేగా! మీది చూడముచ్చటైన జంట. మీరిలా ఎల్లప్పుడూ కలిసే ఉండాలి’’ అంటూ ఆకాంక్షిస్తున్నారు. కొడుకుతో సానియా- షోయబ్ సరిహద్దులు దాటిన ప్రేమ పాకిస్తాన్కు చెందిన ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ను ప్రేమించిన సానియా.. 2010 ఏప్రిల్లో అతడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు ఇజహాన్ సంతానం. ఇక ఓ మోడల్తో షోయబ్ ప్రేమలో పడ్డాడని, అందుకే సానియాను దూరం పెట్టడంతో ఆమెకు విడాకులకు సిద్ధమయ్యారని పాక్ మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సానియాతో కలిసి మీర్జా మాలిక్ షో చేస్తున్నట్లు ప్రకటించడం సహా ఇలా భార్య పుట్టిన రోజున షోయబ్ విషెస్ తెలపడం గమనార్హం. చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. View this post on Instagram A post shared by Shoaib Malik (@realshoaibmalik) View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) -
‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళలు, యువతులను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని ఓ మహిళ ఫొటోను వైరల్ చేసిన విషయం బయటికి వచ్చింది. సదరు మహిళ దీనిపై బుధవారం ఎస్పీ రంజన్ రతన్కుమార్కు ఫిర్యాదు చేశారు. తాను, తన కుటుంబం అంటే పడనివారు కావాలనే ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫొటోను పోస్టు చేశారని వాపోయారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిని శిక్షించాలని కోరారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కీలక వ్యక్తులను తప్పిస్తున్నారనే ఆరోపణలు మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఉదంతంలో ఇప్పటివరకు గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేశ్ అలియాస్ మహేశ్వర్రెడ్డితోపాటు నిఖిల్, వినోద్లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ పోలీస్ అధికారిపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ వ్యవహారంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకులు, కౌన్సిలర్లు, ఓ ముఖ్య నేత అనుచరుడు ఉన్నారని.. వారిని తప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కీలక వ్యక్తులను అరెస్టు చేయాలంటూ.. బుధవారం ప్రజా, విద్యార్థి సంఘాలు, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీపీ, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో గద్వాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేయాలని, అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్ రతన్కుమార్లకు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. స్థానిక పోలీసులపై ఒత్తిళ్లు ఉన్నాయని, సిట్తో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పట్టణంలో సిట్ అధికారులు రహస్య విచారణ చేపట్టారంటూ రోజంతా హైడ్రామా నడవడం గమనార్హం. ముఖ్య నేతకు ఫోన్.. సీరియస్ వార్నింగ్? మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఘటన పరిణామాలపై ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతతో పార్టీ అధిష్టానం మాట్లాడినట్టు తెలిసింది. ముందుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాతే గద్వాలకు చెందిన ముఖ్యనేతతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించొద్దని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు సమాచారం. పోలీసుల విచారణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని సూచించినట్టు తెలిసింది. చదవండి: హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు -
రాకాసి హస్తం కాదు.. విశ్వం ఆవిర్భావానికి కారణ భూతం..!
చూడటానికి అచ్చం రాకాసి హస్తంలా ఉంది కదూ! నిజానికిది ఈ విశ్వావిర్భావానికి కారణ భూతంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు భావించే ధూళి మేఘం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పట్లాగే కాలంలో వెనక్కు వెళ్లి భూమికి 7,000 కాంతి సంవత్సరాల దూరంలోని పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ను ఇలా క్లిక్మనిపించింది. దీన్ని ఇంత స్పష్టంగా మనం చూడగలగడం ఇదే తొలిసారి. చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం -
పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుక సందర్భంగా దక్షిణ భారత వస్త్రాధారణలో మెరిసిపోతున్నాడు. ఆయన భార్య మిచెల్, కూతుళ్లు కూడా భారత సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్ని జోడించి మరీ ఒబామ్ కుటుంబం ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా ఉంది. వాస్తవానికి అవి మార్ఫింగ్ ఫోటోలే అయినపట్టికీ ఆ ఫోటోలు అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి ముంచెత్తించి.. కళ్తు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్కుమార్లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేగాదు దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన సుమారు 2 లక్షల మంది న్యూయార్క్ వాసులను గుర్తించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని రాజకుమార్ ఈ సందర్భంగా అన్నారు. పైగా జూన్ మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి మరీ సెలవు ప్రకటించనుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆయన భారత్ ఒబామా అని ఒకరు కిర్రాక్ ఒబామ అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. obama’s Diwali party outfit pic.twitter.com/Ny7c1Jl6le — bad bitch in booties 👢 (@lilcosmicowgirl) October 18, 2022 (చదవండి: భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు) -
కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. ఫోటో వైరల్..
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న అరుదైన చిరత ఒకటి కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోను ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట్టర్లో షేర్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్ల వావ్ అంటున్నారు. రాత్రివేళ అడవిలో సంచరిస్తున్న వన్యమృగం అత్యద్భుతంగా కన్పిస్తోంది. ఈ అరుదైన చిరుతను క్లౌడెడ్ లీపార్డ్ అంటారు. దీని చారలు మేఘాల్లా కన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది. ఈ వన్యప్రాణులు అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయి. భారత్, నేపాల్ హిమాలయ పర్వత ప్రాంతం, ఇండోనేసియాలో మాత్రమే వీటి ఉనికి ఉంది. A fast, arboreal and one of the rare big cat species found in #India. Very less studied and understood. The range is also limited. Clouded leopards are beautiful creatures. See the amazing patterns. pic.twitter.com/dlJz0CoWNP — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 18, 2022 ఈ క్లౌడెడ్ లీపార్డ్ల ఆహారపు అలవాట్లు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీని జీవన విధానం మిస్టరీగానే ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే ఇవి కన్పిస్తుంటాయి. దీని గోర్లు చాలా పదునుగా ఉంటాయి. ఇవి ఎత్తు తక్కువే అయినప్పటికీ అత్యంత శక్తమంతంగా ఉంటాయి. బ్యాలెన్స్ మెయింటెన్ చేయడానికి పొడవాటి తోకను కలిగిఉంటాయి. ఆడ క్లౌడెడ్ లీపార్డ్.. ఏడాదికి ఐదు పిల్లల వరకు జన్మనివ్వగలదు. పుట్టిన 10 నెలల వరకు మాత్రమే ఈ చిరుతలు తల్లిపై ఆధారపడతాయి. ఆ తర్వాత స్వయంగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చదవండి: 6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..! -
T20 WC 2022: టీమిండియాకు మరో భారీ షాక్!.. అతడికి ఏమైందసలు?
ICC Mens T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. స్వదేశం, విదేశాల్లో వరుస టీ20 సిరీస్లు గెలిచిన రోహిత్ సేన.. టైటిల్ విజేతగా నిలవాలని భావిస్తోంది. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహా ఫాస్ట్బౌలర్ దీపక్ చహర్ ఇప్పటికే గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. బుమ్రా లేడు కాబట్టే! ఆసియా కప్-2022లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రోహిత్ సేన ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్-2022కు బుమ్రా అందుబాటులో ఉంటాడని భావిస్తే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ సమయంలోనే దూరమయ్యాడు. అయితే, ఇప్పుడు మరో ఆటగాడు కూడా జట్టుకు దూరమవుతాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా సోమవారం ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా వార్మప్ మ్యాచ్ ఆడింది. పంత్కు ఏమైంది? ఈ సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్, స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ కుడి మోకాలికి కట్టుతో కనిపించాడు. మోకాలిపై ఐస్ప్యాక్తో డగౌట్లో కూర్చున్న అతడి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్.. కంగారూ పడిపోతున్నారు. ఈ స్టార్ బ్యాటర్ గనుక జట్టుకు దూరమైతే జట్టుకు భారీ ఎదురుదెబ్బేనని కామెంట్లు చేస్తున్నారు. ఊరికే రిలీఫ్ కోసమే! అయితే, మరికొంత మంది మాత్రం ఊరికే రిలీఫ్ కోసమే ఐస్ప్యాక్ పెట్టుకున్నాడని, పంత్కు ఏమీ కాలేదని పేర్కొంటున్నారు. ఇంకొంత మందేమో.. పర్లేదు.. దినేశ్ కార్తిక్ ఉన్నాడుగా.. నో ప్రాబ్లమ్ అంటూ జట్టులో పంత్ స్థానాన్ని ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ పెద్దగా రాణించకపోతున్నప్పటికీ.. ఆసీస్ పిచ్లపై అతడికి ఉన్న రికార్డు దృష్ట్యా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అసలు సిసలు మ్యాచ్ ఆనాడే ఇదిలా ఉంటే.. ఆసీస్తో వార్మప్ మ్యాచ్లో గెలిచిన టీమిండియా.. తదుపరి న్యూజిలాండ్తో తలపడనుంది. ఇక పాకిస్తాన్తో అక్టోబరు 23 నాటి మ్యాచ్తో ఐసీసీ ఈవెంట్ ప్రయాణం ఆరంభించనుంది. మరోవైపు.. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ వార్మప్ మ్యాచ్లో అదరగొట్టి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. చదవండి: WI Vs SCO: మాకిది ఘోర పరాభవం.. మిగిలిన రెండు మ్యాచ్లలో: విండీస్ కెప్టెన్ కొట్టాలనే మూడ్ లేదు.. ఆసీస్తో మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు Rishabh Pant seen with heavy strapping and ice pack on his right knee.@RevSportz #T20WorldCup https://t.co/Q8Uf5c2PzA pic.twitter.com/pY5uaoobXe — Subhayan Chakraborty (@CricSubhayan) October 17, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం, క్లారిటీ ఇచ్చిన పూనమ్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా వివాదస్పద వ్యాఖ్యలతో ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా పూనమ్ తన తీరుతో మరోసారి వార్తల్లోకెక్కింది. నార్త్ ప్రజలు భర్తల క్షేమం కోరుతూ చేసే ప్రత్యేక పూజ కర్వాచౌత్ (Karwa Chauth). పెళ్లయిన మహిళలు స్పెషల్గా జరుపుకునే ఈ పండగను శుక్రవారం పూనమ్ సెలబ్రెట్ చేసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అందరికి కర్వాచౌత్ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్ దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘పెళ్లి కానీ మీరు కర్వాచౌత్ ఎలా జరపుకుంటారు?’, ‘అంటే ఇప్పుటికే మీకు పెళ్లయిపోయిందా? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా?’ అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశ్నలపై ఆమె కాస్త ఘాటుగా స్పందించింది. ‘ఈ ఆర్టికల్స్ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచన విధానంతో సంధించబడ్డాయో నాకు తెలియదు. కానీ కర్వాచౌత్ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరపుకోవచ్చు. తమ కాబోయే భర్తల కోసం జరుపుకుంటారు. పెళ్లయిన వాళ్లు చంద్రుని ఆరాధిస్తే.. పెళ్లికాని అమ్మాయిలు చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారు. అంతేకాదు మహా శివుడుని కూడా కోలుస్తారు’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది. చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్ I don’t know if the articles revolving around today are politically motivated or motivated by missionaries way of thinking - educate yourself - #omnamahshivya ( vasudeva Kutumbakam is what u need to learn . pic.twitter.com/BlQ1mq0qHJ — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 14, 2022 -
నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్..
చండీగఢ్: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ఎలాంటి హామీలనైనా ప్రకటించేందుకు వెనుకాడరు. వాటి సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా వాగ్దానాలు చేస్తుంటారు. హర్యానా పంచాయతీ ఎన్నికల్లో సిర్సాఢ్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న జయకరణ్ లఠ్వాల్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెబుతూ అతను ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్గా మారింది. ఆ హమీలను చూసి కొందరికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రధాని, ముఖ్యమంత్రులకు కూడా సాధ్యం కాని ఈ హామీలను చూసి కొందరు నోరెళ్లబెడుతున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.20కే వచ్చేలా చేస్తానని జయకరణ్ చెబుతున్నాడు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఇస్తాడట. గ్రామస్థులందరికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందట. మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్, ఊర్లో మూడు ఎయిర్ పోర్టులు, మందు తాగే వారికి ఒక బాటిల్ మద్యం, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై.. అబ్బో ఇలా చాలా హామీలనే ఇస్తున్నాడు. జయకరణ్ ఇచ్చిన మరో హామీ చూసి కొందరికి గుండె ఆగినంత పని అయింది. తాను సర్పంచ్గా గెలిస్తే సిర్సాఢ్ గ్రామం నుంచి గోహాన్ మండల కేంద్రం వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేస్తానని అతను చెప్పాడు. కొందరేమో అది బస్సు అయి ఉంటుందని, పొరపాటున హెలికాప్టర్ అని రాసి ఉంటారని చలోక్తులు విసిరారు. ఇతని హామీల వర్షం చూసి ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తనకు వెంటనే ఈ గ్రామానికి షిఫ్ట్ అవ్వాలనిపిస్తోందని నవ్వులు పూయించారు. Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc — Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022 చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!
అన్నం కోసం వెళ్తే.. అమృతం దొరికినట్లు.. మూవీ చూద్దామని వెళ్తే.. మెగాస్టార్ ఎదురొచ్చినట్లు..కొన్నిటిని వర్ణించడానికి మాటలు సరిపోవు.. అలాంటి సన్నివేశమే ఇది.. ఉరిశిక్ష పడి.. నేడో రేపో ప్రాణం తీసేస్తారు అన్నోడికి సడన్గా క్షమాభిక్ష పెట్టేస్తే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? తెలీదు కదా.. కొంచెం అటూఇటూగా ఇలాగే ఉంటుందేమో.. ఓసారి పులిగారి మనోభావాలను గమనించండి.. ఇంతకీ విషయమేమిటంటే.. చాలాకాలం బోను వెనుకాల బందీగా ఉన్న పులికి ఒక్కసారిగా స్వాతంత్య్రం ప్రకటించేసి.. అడవిలో వదిలేయడానికి తెచ్చారు. బోను తలుపు తీయగానే.. అడవిని చూసి పులి ఇలా షాక్ తింది.. పలు జంతువులను ఇటీవల అడవిలో వదిలినప్పుడు అవి ఎలా ఫీలయ్యాయి అన్నది ఓ వీడియో తీశారు. అందులోనిదే ఈ పులి చిత్రం..ఆస్కార్ లెవల్ యాక్టింగ్ కదా.. -
బెంజ్ సీఈవోకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.. కిలోమీటర్లు నడిచి, ఆటో ఎక్కి
ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక పని నిమిత్తం రోడ్డు మీదకు వస్తుంటారు. ఆటో, కారు, బైక్, బస్సు.. లేదా నడక మార్గాన తమ గమ్యాలను చేరుకుంటారు. రోడ్డుపై జర్నీ అంటే తప్పక ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కామన్ మ్యాన్ నుంచి కోటిశ్వరుడి వరకు ఎవరైనా ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అచ్చం ఇలాంటి అనుభవమే లగ్జరీ కార్ల తయారీ సంస్థ సీఈఓకు కూడా తప్పలేదు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ మార్టిన్ ష్వేంక్ గురువారం రాత్రి సమయంలో పుణెలో తన ఎస్-క్లాస్ కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఖరీదైన ఎస్-క్లాస్ కారు నుంచి దిగి నడక బాటపట్టారు. ఇలా కిలోమీటర్లు నడిచి.. ఆటోలో తన గమ్య స్థానానికి చేరుకున్నారు. ఈ మొత్తం సంఘటనను ఆయన తన ఇన్స్టాగ్రామ్లో వివరించారు. ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ మీ ఎస్-క్లాస్ కారు పూణె రోడ్లలో ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఉంటే మీరు ఏమి చేస్తారు? బహుశా కారు దిగి, కొన్ని కిలోమీటర్లు నడిచి, ఆపై రిక్షా పట్టుకుంటారా’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్గా మారింది. సీఈఓ సింప్లిసిటీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంత కోటీశ్వరుడై ఉండి ఆటోలో వెళ్లడాన్ని పలువురు అభినందిస్తున్నారు. చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్ గుర్తు చేసింది: కేటీఆర్ View this post on Instagram A post shared by Martin Schwenk (@martins_masala) -
ఇన్ఫీ సుధామూర్తి పిక్ వైరల్, వివాదాస్పద చర్చ
సాక్షి, ముంబై: ఇన్ఫీ సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వానికి ఆమె ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెబుతూ ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, సుధా మూర్తి రచయిత్రిగా, విద్యావేత్తగా, పరోపకారిగా మాత్రమే కాకుండా ఒక్కోసారి తన విశాల హృదయంతో చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా 2019 నాటి ఒక ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే కొంతమంది ఈ ఫోటోపై నెగిటివ్గా స్పందిస్తుండగా, మరికొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఆమె ఒకరోల్ మోడల్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం మైసూరు రాజ కుటుంబానికి చెందిన ప్రమోదా దేవి వడియార్ కాళ్లకు మొక్కుతున్న ఒకటి విశేషంగా నిలిచింది. ఇదే పిక్లొ అలనాటి అందాల నటి బి. సరోజా దేవిని కూడా గుర్తించవచ్చు. మైసూర్ రాష్ట్ర చివరి పాలకుడు జయచామరాజ వడియార్ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన క్రమంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ప్రమోదా దేవి వడియార్ దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ భార్య. Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model. Is this still a tradition of greeting the members of Royal family in India? Or was it more like an action out of reverence or respect? pic.twitter.com/1xSedjLXXB — Kamran (@CitizenKamran) September 26, 2022 Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model. Is this still a tradition of greeting the members of Royal family in India? Or was it more like an action out of reverence or respect? pic.twitter.com/1xSedjLXXB — Kamran (@CitizenKamran) September 26, 2022 -
Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ..
ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసేస్తున్నారు. అంతేగాక తమకు ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తి కావాలో కూడా చెప్పుకునే అవకాశం ఉటుంది. వీటితోపాటు పత్రిక ప్రకటనలు చూసి కూడా పెళ్లిళ్లు నిశ్చయించుకుంటున్నారు. తాజాగా ఓ పత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్గా మారింది. వ్యాపారవేత్త సమీర్ అరోరా.. న్యూస్ పేపర్లో ప్రచురితమైన మ్యాట్రిమోనీ అడ్వర్టైజ్మెంట్ క్లిప్ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ధనవంతులైన, బిజినెస్ బ్యాగ్రౌండ్ ఉన్న వరుడు కావాలి. అదే కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, లేదా డాక్టర్ అని అయి ఉండాలి’ అని ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ప్రకటన చివర్లో ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దయచేసి కాల్ చేయవద్దు’ అని నొక్కి చెప్పారు. ‘ఐటీ రంగానికి భవిష్యత్తు అంతాగా కనిపించడం లేదు’ అనే ట్యాగ్లైన్తో షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2 — Samir Arora (@Iamsamirarora) September 16, 2022 ఓ వర్గం వారు నిజమేనంటూ మద్దతిస్తుంటే.. మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ యాడ్ చూస్తుంటే.. దేశ భవిష్యత్తు మొత్తం మంచిగా కనిపించడం లేదు. ఐటీ లేకుంటే భవిష్యత్తే బాగోదు. హమ్మయ్యా నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇది సరైంది కాదు. డోంట్ వర్రీ..ఇంజనీర్లు ఇలాంటి వార్తాపత్రికల ప్రకటనపై ఆధారపడరు. వారు తమంతట తాముగా ప్రతిదీ వెతుకుంటారు’ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోది. Don't worry..Engineers don't rely on some newspaper ad. They find everything on their own. — Ajay sharma (@Ajaysha17977479) September 16, 2022 Looking at the ad, the whole country's future doesn't look so sound. — Ashutosh Vishwakarma (@aashutoshaawara) September 16, 2022 Thank god, I got married 11 years ago! — Bharat Trader 🇮🇳 (@BharatTrader) September 16, 2022 -
ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కూడా
ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు వైరల్గా మారాయి. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆమె నటి మాత్రమే ప్లేబ్యాక్ సింగర్గా, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇటీవల ఆమె నటించిన ఓ చిత్రానికి గానూ జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఆమె నేరుగా ఒక్క తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా.. ఇక్కడి ప్రక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే. అచ్చంగా తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు ఆకాశమే నీహద్దురా చిత్రంలో నటనతో అబ్బురపరిచన అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ బ్యూటీ నటిగా కంటే ముందు సింగర్గా, డ్యాన్సర్గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు పలు షార్ట్ ఫిలింస్లో కూడా నటించింది. ఈ క్రమంలో ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. మాలీవుడ్, కోలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంది. ఇక ‘సర్వం తాళమయం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య సరసన సూరారై పోట్రు(తెలుగులో ఆకాశమే నీ హద్దురా) మూవీలో చాన్స్ కొట్టేసింది. లాక్డౌన్లో ఓటీటీలో విడుదలైన ఈచిత్రం ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అపర్ణ.. సుందరిగా సూర్య భార్య పాత్రలో నటించి అద్భుతమైన నటన కనబరిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న తన పాత్రకుగానూ అపర్ణ ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకుంది. ఇలా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ ప్రస్తతం బొద్దుగా తయరవడంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) -
Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్..
తిరువనంతపురం: ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఏడుపులు వినిపిస్తాయి. కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోతారు. బంధువులు, చుట్టుపక్కల వారు వారిని ఓదారుస్తుంటారు. కానీ కేరళ పథానంతిట్ట జిల్లా మలపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో కుటుంబసభ్యులు ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. 95 ఏళ్ల బామ్మ చనిపోతే.. ఆమె శవపేటిక చుట్టూ చేరి నవ్వుతూ ఫోటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంట్లో ఒకరు చనిపోతే మీరంతా ఎలా నవ్వుతున్నారని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం ఆ ఫోటోలో ఏం తప్పులేదని కుటంబసభ్యులను వెనకేసుకొచ్చారు. దీనిపై పెద్ద చర్చే పెట్టారు. కేరళ విద్యాశాఖ మంత్రి వీ శివన్కుట్టి కూడా ఈ చర్చలో భాగమయ్యారు. 95ఏళ్ల మరియమ్మ ఆగస్టు 17న మరణించారు. ఆమెకు 9 మంది సంతానం. వాళ్లకు 19 మంది పిల్లలున్నారు. కుటుంబసభ్యులంతా దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో కొద్ది వారాల పాటు మంచానికే పరిమితమై మరియమ్మ కన్నుమూశారు. విషయం తెలిసి దాదాపు కుటంబసభ్యులు అందరూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జ్ఞాపకార్థం ఓ ఫోటో దిగాలని కెమెరా ముందు నవ్వుతూ కన్పించారు. మరియమ్మ బతికినంతకాలం ఎంతో సంతోషంగా జీవించారని, అందరినీ ప్రేమగా చూసుకున్నారని ఓ కుటుంబసభ్యుడు తెలిపారు. అందుకే ఆమెకు కుటుంబసభ్యులంతా ఆనందంతో వీడ్కోలు ఇవ్వాలనుకున్నట్లు పేర్కొన్నారు. నవ్వుతూ ఫోటో దిగడంలో తప్పేమీ లేదన్నారు. కేరళ మంత్రి శివన్కుట్టి కూడా కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. చావు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జీవితాంతం ఆనందంగా బతికిన వారిని అంతిమ వీడ్కోలులో నవ్వుతూ సాగనంపడంలో తప్పేం లేదన్నారు. ఈ ఫోటోపై నెగెటివ్గా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: కాంగ్రెస్కు యువనేత గుడ్బై.. గాంధీలపై విమర్శలు -
ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’
ఎందుకు.. ఆశ్చర్యం అని చెప్పుకునేలోపు.. మనమో చిన్న కథ చెప్పుకుందాం.. అనగనగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరికి చెరో నలుగురు పిల్లలు. ఓరోజు అక్క భర్తకు ఎందుకో కోపమొచ్చింది.. అక్కను చంపేశాడు.. అలాగే ఓ బిడ్డనూ చంపేశాడు. అక్క పిల్లలు అనాథలయ్యారు.. చెల్లెలే ధైర్యంగా నిలబడింది.. వారిని చేరదీసింది. వారి కన్నీళ్లను తుడిచింది. ఎలా మెలగాలో చెప్పింది.. ఎలా బతకాలో నేర్పింది. బతుకుదెరువు చూపింది. ప్రయోజకుల్ని చేసింది.. ఏంటీ.. పాతకాలపు సెంటిమెంటు స్టోరీ అనేగా మీ డౌటు..ఈ స్టోరీ మనుషులది కాదు.. ఈ పులులది అని చెబితే.. ఆశ్చర్యమే కదా..ఎందుకంటే.. ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు అని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా అన్నారు. అవి ఆహారాన్ని ఆరగిస్తున్న చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన.. ఈ ఫొటో వెనకున్న కథను నెటిజన్లకు తెలిపారు. Tigress takes care of 3 cubs of her dead sister along with 4 of her own. It is also reported that she gives precedence during hunting to the cubs of her sister. Rare. (Source:Forest Department) pic.twitter.com/V5wK28Qlgy — Susanta Nanda IFS (@susantananda3) August 22, 2022 -
ఈ జంటకు సలాం కొట్టాల్సిందే!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
వైరల్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. కేంద్రం ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ సందడి చేసింది. అయితే.. జెండా ఎగరేసేందుకు ఓ వృద్ధ జంట ప్రయాస పడడంపై ఆనంద్ మహీంద్ర భావోద్వేగమైన పోస్ట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంత హడావుడి ఎందుకు చేస్తారనే మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఇక్కడున్న ఈ ఇద్దరినీ అడగండి. గొప్ప గొప్ప వక్తలు ఇచ్చే ఉపన్యాసాల కంటే బెటర్గా మీకు వీళ్లు వివరిస్తారు. జైహింద్ అని ట్విటర్లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. పైన ఉన్న ఒకావిడ జెండా మీద దృష్టి పెడితే.. ఆమె పడిపోకుండా కింద డ్రమ్మును పట్టుకుని ఉన్నారు ఓ పెద్దాయన. If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳 pic.twitter.com/t6Loy9vjkQ — anand mahindra (@anandmahindra) August 14, 2022 Next level it is! Love this young couple ❤️ — Jhony Bravo (@mahesh_s_savita) August 14, 2022 No word yet only Jai Hind 🙏🙏 — ramaekrisshna (@ramakrishna183) August 14, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ.. నిజమైన దేశభక్తే ఇదేనంటూ చాలామంది కామెంట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోను మీరూ చూసేయండి. ఇదీ చదవండి: భారత్కు పాక్ మ్యూజిషియన్ ఊహించని కానుక -
స్టైలిష్ లుక్లో మహేశ్బాబు.. వైరల్ అవుతున్న ఫోటో
సూపర్స్టార్ మహేశ్ బాబు లేటోస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్లో సర్ప్రైజ్ చేస్తున్నారు మహేశ్. తాజాగా ఆయన ఓ స్టైలిష్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 'LOVING THE NEW VIBE' అనే ట్యాగ్లైన్తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ షేర్ చేసిన ఈ ఫోటో సూపర్ కూల్గా ఉంది. కాగా ఈ ఫోటోతో #SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్
అందరూ రాఖీ పండుగను తమ సోదరులకు తమ ప్రియమైన వ్యక్తులకు కట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొంతమంది మనల్ని రక్షించే రక్షక భటులకు కట్టడం వంటివి చేస్తుంటారు. ఒక్కొకరు ఒక్కో పద్ధతిలో తమకు నచ్చిన రీతిలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడొక మహిళ మాత్రం ఏకంగా చిరుతకే రాఖీ కంటే తన గొప్ప మనసుని చాటుకుంది. ఏం జరిగిందంటే...చిరుతకి రాఖీ కట్టడమా! అని ఆశ్యర్యపోకండి. ఔను రాజస్తాన్లోని ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. అనారోగ్యానికి గురైన చిరుత పులిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆ చిరుతకు రాఖీ కట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన భారతీయులు జంతువుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తూ వాటితో సామరస్యంగా ఉంటారని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది. ప్రపంచం మానువులకు మాత్రమే కాదని దేవుడు అన్ని రకాల జంతువులను సృష్టించాడని ఒకరు, వన్యప్రాణుల పట్ల మహిళలా ప్రేమగా వ్యవహరించాలని మరోకరు సదరు మహిళను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. For ages, man & animal in India have lived in harmony with unconditional love to the wild. In Rajasthan, a lady shows this unfettered love to our wild by tying a Rakhi(symbol of love & brotherhood ) to an ailing Leopard before handing over to Forest Department. (As received) pic.twitter.com/1jk6xi1q10 — Susanta Nanda IFS (@susantananda3) August 12, 2022 (చదవండి: నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు) -
సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు..
వాషింగ్టన్: వరదల్లో సరస్వం కోల్పోయినా పెంపుడు శునకాన్ని మాత్రం వదల్లేదు ఓ 17 ఏళ్ల అమ్మాయి. తన ప్రాణాలు కాపాడుకోవడమే గాక.. ప్రాణంగా ప్రేమించే సాండీని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చింది. ఈ బాలిక చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా కెంటకీలో గ్రాండ్పేరెంట్స్లో కలిసి నివసిస్తోంది క్లో అడమ్స్. గురువారం ఉదయం నిద్ర లేచే సమయంలో ఇంట్లోకి వస్తున్న వరదనీటి ప్రవాహం చూసి విస్మయానికి గురైంది. క్షణాల్లోనే కిచెన్తో పాటు ఇల్లు మొత్తం జలమయం అయింది. నీళ్లు మోకాలి లోతుకు చేరాయి. వెంటనే తన పెంపుడు కుక్క సాండీ దగ్గరకు వెళ్లింది అడమ్స్. దాన్ని చేతితో పట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే వరదనీటి స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. సాండీ ఈదగలదేమోనని అడమ్స్ చెక్ చేసింది. దాన్నినీటిలో వదిలితే ఈదలేకపోయింది. దీంతో ఓ చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో సాండీని వేసి దాన్ని ముందుకుపంపుతూ వరద నీటిలో ఈదుకుంటూ స్టోరేజీ బిల్డింగ్ పైకప్పుకు చేరుకుంది అడమ్స్. వాళ్లకు రూఫ్ మాత్రమే ఆధారంగా మిగిలింది. ఆ తర్వాత కొన్ని గంటలపాటు అక్కడే సాయం కోసం ఎదురు చూసింది. చివరకు ఈ ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఆమె కజిన్ సహాయక బృందాల సాయంతో వాళ్లను రెస్క్యూ చేశాడు. ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అప్పటికే తలదాచుకుంటున్న తన మామయ్య ఇంటికి అడమ్స్ వెళ్లింది. ఆమె తండ్రి టెర్రీ అడమ్స్ కూడా అక్కడే ఉన్నాడు. తన కూతురు పెంపుడు శునకాన్ని కాపాడిన విషయాన్ని ఫేస్బుక్లో వెల్లడించాడు టెర్రీ. ఆమె హీరో అని అభివర్ణించాడు. అడమ్స్ శునకాన్ని పట్టుకుని రూఫ్పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వాటిని చూసి నెటిజన్లు బాలికను ప్రశంసలతో ముంచెత్తారు. సాండీని క్లో అడమ్స్ బాల్యం నుంచి ఆప్యాయంగా చూసుకుంటోంది. చిన్నప్పుడు ఆమె సాండీతో దిగిన ఫోటో కూడా వైరల్గా మారింది. మరోవైపు కెంటకీలో గురువారం భారీ వర్షాలు కురిసి ఆకస్మిక వరదలు సంభవించాయి. వివిధ ప్రమాదాల్లో 16 మంది మరణించారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల తాము సర్వస్వం కోల్పోయినా.. అంతకంటే ముఖ్యమైన తన కూతురు, సాండీ ప్రాణాలతో బయటపడటం ఆనందంగా ఉందని టెర్రీ అడమ్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: 40 నుంచి 10 శాతానికి పడిపోయిన రిషి సునాక్.. 90% లిజ్ ట్రస్కే ఛాన్స్! -
Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు..
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వనప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో పదహారేళ్ల క్రితం సీయర్స్ జామకారు మొక్కను నాటారు. మండకారు అని కూడా పిలిచే క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్క ఇదిగో ఇప్పుడు తొలి పువ్వును పూసింది. తెల్లటి రేఖలతో వికసించిన ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. చదవండి: చీమ.. బలానికి చిరునామా.. -
నిరసనల మధ్యే దంపతుల ముద్దులు.. ఫోటో వైరల్
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు రాజపక్స గొటబయ, ప్రధాని విక్రమసింగేల భవనాలను ముట్టడించారు నిరసనకారులు. కొద్ది రోజులుగా నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. అధ్యక్షుడు గొటబయ దేశం నుంచి పారిపోయారు. తన పదవికి రాజీనామా చేశారు. ఇలా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న తరుణంలో శ్రీలంక న్యూస్ సంస్థ న్యూస్వైర్ ట్విట్టర్లో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్గా మారింది. వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొన్న సమయంలో ఓ జంట ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది న్యూస్ వైర్. Couple goals! A couple was seen displaying affection after participating in anti-government protests that led to the taking over of the Prime Minister's office in Colombo. pic.twitter.com/mpPG1y2fvD — NewsWire 🇱🇰 (@NewsWireLK) July 13, 2022 గత బుధవారం ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే కార్యాలయం ముందు నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్లు రాసుకొచ్చింది న్యూస్వైర్. 'కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో పాల్గొన్న తర్వాత ఒక జంట ప్రేమను ప్రదర్శించడం కనిపించింది.' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని విక్రమం సింఘే బాధ్యతలు తీసుకున్న తర్వత జరిగిన నిరసనల్లో ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 80 మంది వరకు గాయపడ్డారు. అధ్యక్షుడు గొటబయ ముందుగా మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. అక్కడ దిగిన తర్వాత స్పీకర్కు తన రాజీనామాను పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే.. మరోదేశం పోవాల్సిందే! -
అచ్చం సీఎం షిండేలా ఉన్నారే!.. ప్రముఖ వ్యాపారవేత్త ట్వీట్ వైరల్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా.. సమకాలీన అంశాలపై త్వరగతిన సోషల్ మీడియా స్పందిస్తుంటారు. అదే టైంలో ఆయన నుంచి సరదా విషయాలు కూడా కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఫుడ్ వేస్టేజ్ విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు సైతం ఎంతోమందిని ఆకట్టుకుంది కూడా. ఈ తరుణంలో తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్.. పలువురిని ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బ్లాక్ అండ్ వైట్ ఫొటోను.. ఆ పక్కనే తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఉంచి హర్ష్ గోయెంకా ఒక క్యాప్షన్ ఉంచారు. ‘నన్ను కలవడానికి వచ్చిన వారికి.. ఏదైనా సౌలభ్యం కోసం క్షమించండి. నా Z+ కేటగిరీ భద్రత ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు. మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను. జై మహారాష్ట్ర!’ అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. సరదాగా చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు తషీమ్ పూనావాలాతో పాటు ఎందరో నెటిజన్లను ఆ ఫొటోకు కామెంట్లు చేస్తున్నారు. To those who come to meet me, sorry for any convenience. I know my Z+ security can be a nuisance. Look forward to your support. Jai Maharashtra! 😜 pic.twitter.com/zXb9HynS6W — Harsh Goenka (@hvgoenka) July 3, 2022 -
Napalm girl: మానని గాయంతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది
తెలిసీ తెలియని వయసు.. తోటి చిన్నారులతో ఆడిపాడే సమయంలోనే కొండంత కష్టం వచ్చి పడింది. ఒక యుద్ధం.. ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేయడమే కాదు.. ఐదు దశాబ్దాల తర్వాత మానని గాయాలతో ఆమెకు నిత్య నరకం చూపిస్తోంది కూడా. వియత్నాం వార్ ద్వారా చరిత్రలో నిలిచిన పోయిన నాపామ్ గర్ల్ కథ(వ్యథ) ఇది.. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి.. ఇంటి పక్కన స్నేహితులతో సరదాగా ఆడుకుంటోంది. పారిపోండి.. పరిగెత్తండి అంటూ మిలిటరీ దుస్తుల్లో ఉన్న కొందరి హెచ్చరికలు వాళ్ల చెవినపడ్డాయి. అంతా కలిసి పరుగులు తీశారు. ఇంతలో వాళ్లు ఉన్న ప్రాంతంలో ఓ బాంబు పైనుంచి వచ్చి పడింది. మిగతా పిల్లలంతా ఏడుస్తూ తలోదిక్కు పారిపోతుంటే.. ఆ చిన్నారి మాత్రం దుస్తులు మంటల్లో కాలిపోయి.. బట్టల్లేకుండా రోదిస్తూ గాయాలతో రోడ్డు వెంట పరుగులు తీసింది. జూన్ 8, 1972.. టే నిహ్ ప్రావిన్స్ ట్రాంగ్ బ్యాంగ్ వద్ద జరిగిన ఈ ఘటన.. ఒక ఐకానిక్ ఫొటో ద్వారా చరిత్రలో నిలిచిపోయింది. నాపామ్ గర్ల్.. సుప్రసిద్ధ ఫొటో. వియత్నాం యుద్ధంలో అమెరికా ఫైటర్ జెట్లు నాపామ్ బాంబులు సంధించడంతో.. కాలిన గాయాలతో బట్టలు లేకుండా వీధుల వెంట పరిగెత్తింది ఆ చిన్నారి. వీపు, భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెకి. అయితే ఆ గాయాలకు యాభై ఏళ్ల తర్వాత చికిత్స అందుకుంటోంది. నాపామ్ గర్ల్ అసలు పేరు కిమ్ ఫుసీ ఫాన్ టి. గత ఏడాదిగా ఆమె ఆస్పత్రిలోనే.. పదిహేడు సర్జరీల ద్వారా ట్రీట్మెంట్ అందుకుంది. కానీ, ఆమె గాయాలు మానాలంటే.. మరో పదేళ్లపాటు కూడా ఆమెకి మరిన్ని సర్జరీలు అవసరం. అంటే.. ఆమె ఈ నరకం మరిన్ని సంవత్సరాలు తప్పదన్నమాట. ఫాన్ తి.. పుట్టింది ఏప్రిల్ 6, 1963లో. ఆ ఘటన తర్వాత ఆమె జీవితం.. వివాదాలు, ఆంక్షల నడుమే నడుస్తోంది. చేసేది లేకచివరికి.. ఆమె తన భర్తతో పాటు 1992లో కెనడాకు ఆశ్రయం మీద వెళ్లారు. 2015లో ఆమె ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జిల్ వాయిబెల్ను కలసుకుంది. ఆమె కథ తెలిసిన వాయ్బెల్ ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం మియామిలో కిమ్ ఫుసీ ఫాన్ తి.. చివరి దశ చికిత్స అందుకుంటోంది. ఇప్పుడు తాను వియత్నాం యుద్ధ బాధితురాలిని కాదని, తనకు ఇద్దరు బిడ్డలు.. మనవరాళ్లు ఉన్నారని, తనను ఇప్పుడు నాపామ్ గర్ల్ అని పిలవొద్దని.. శాంతి స్థాపన కోసం పాడుపడుతున్న ఒక ఉద్యమకారణిని అని చెప్తోందామె. వియత్నాం-అమెరికన్ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్ అనే ఫొటో జర్నలిస్ట్.. నాపామ్ గర్ల్ ఫొటోకు గానూ ఫులిట్జర్ అందుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ ఫొటోపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఉట్ మాత్రం ఆ ఫొటో వియత్నాం యుద్ధానికి సిసలైన నిదర్శనమని ప్రకటించారు. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న రోహిత్..?
Rohit Sharma: టీమిండియా అభిమానులకు శుభవార్త. ఇటీవల కోవిడ్ బారిన పడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడని తెలుస్తోంది. కోవిడ్ నిర్ధారణ అయ్యే సమయానికి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రోహిత్.. తాజాగా పూర్తిగా కోలుకున్నాడని సమాచారం. ఇవాళ (జూన్ 28) సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో ఈ వార్తకు బలం చేకూరుస్తుంది. A thumbs up from Rohit Sharma in his latest Instagram story. pic.twitter.com/ZAILwMR0gj — Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2022 రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్వయంగా షేర్ చేసిన ఈ ఫోటో చూసి టీమిండియా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. రోహిత్ ఈ ఫోటోలో థమ్స్ అప్ చెబుతూ నవ్వుతూ కనిపించడంతో అతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్ సమయానికి తప్పక అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారంపై బీసీసీఐ లేదా రోహిత్ శర్మ స్పందించాల్సి ఉంది. This makes me feel like he's going to play the test match. @ImRo45 🔥 pic.twitter.com/Jsk5LdR680 — ANSHUMAN🚩 (@AvengerReturns) June 27, 2022 ఇదిలా ఉంటే, జులై 1 నుంచి ఇంగ్లండ్తో రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల ముందు వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. మ్యాచ్ సమయానికి రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు వ్యక్తం చేశారు. బ్యాకప్ ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ను కూడా ఇంగ్లండ్కు రప్పించారు. కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ కూడా క్రికెట్ వార్గల్లో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో రోహిత్ కోలుకున్నాడన్న వార్త టీమిండియాకు మనోధైర్యాన్ని ఇస్తుంది. చదవండి: నాన్న రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె -
తనయుడి బర్త్డే.. థ్యాంక్స్ చెప్పిన కాజల్!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇదిలా ఇక ఈ చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. అప్పటి నుంచి కాజల్ తన ముద్దుల తనయుడి ఫొటోలను తరచూ షేర్ చేస్తు వస్తుంది. అయితే ఈ ఫొటోల్లో నీల్ కిచ్లు ముఖం కనిపించి కనిపంచకుండ జాగ్రత్త పడుతోంది ఆమె. తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజల్. నేటితో కాజల్ తనయుడికి రెండు నెలలు నిండాయి. గత ఏప్రిల్ 19న కాజల్ నీల్ కిచ్లుకు జన్మనిచ్చింది. చదవండి: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఆమె తనయుడి ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ‘బెస్ట్బర్త్డేఎవర్’ అంటూ తన కుమారుడికి విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపింది. వైట్ కుర్తా, పైజామాతో కొడుకును అలంకరించి ముద్దులు ఒలికిస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో కాజల్ పోస్ట్కు రామ్ చరణ్ భార్య, ఉపాసన ‘మోస్ట్ అడరాబుల్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం కాజల్ పోస్ట్ తన ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆ ఫొటోను ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ పలు సోషల్ మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం, ఏం జరిగింది? View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
మోదీ.. ఎంత ఎదిగిపోయావయ్యా!
అహ్మదాబాద్: గురుశిష్యుల అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. అందునా తన శిష్యుడు మంచి స్థానంలో ఉంటే.. ఆ గురువుకి కలిగే ఆనందమే వేరు. చాలా ఏళ్ల తర్వాత తనకు విద్య నేర్పిన గురువును కలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ గుజరాత్లో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. నవ్సారి వద్నగర్లో చిన్నప్పుడు తనకు పాఠాలు బోధించిన ఓ ఉపాధ్యాయుడ్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం, మంచి చెడు ఆరా తీశారు. ప్రధాని హోదాలో తన పూర్వ విద్యార్థిని చూసి ఆ ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబ్బితబ్బిబ్బి అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు ప్రధాని మోదీతో ఆప్యాయంగా ముచ్చటించి.. ఆశీర్వదించి వెళ్లిపోయారు ఆ పెద్దాయన. ప్రస్తుతం వాళ్ల కలయిక గురించి ప్రస్తావిస్తూ.. ఓ ఫొటో వైరల్ అవుతోంది. गुजरात : नवसारी में PM @narendramodi ने स्कूल समय के अपने शिक्षक से की मुलाकात pic.twitter.com/Q5vQ2Wz8TB — News24 (@news24tvchannel) June 10, 2022 -
శిథిల దృశ్యం: అంతా బాగుంటే కొత్త డ్రెస్ వేసుకుని.. సందడి చేసేది, కానీ!
కీవ్: ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నగరాలు, పట్టణాలను అధీనంలోకి తెచ్చుకునేందుకు మాస్కో సైన్యం ప్రణాళికలు రచిస్తుండగా ఉక్రెయిన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఈక్రమంలో కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, నివాసాలు నేలమట్టమవుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యం దాడుల్లో నిత్యం 100 మంది దాకా తమ సైనికులు మరణిస్తున్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. రక్తపాతం బాధాకరమని ఫేస్బుక్లో పోస్టు చేశారు. తమ బిడ్డలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి👉🏼 పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంతో తెలుసా? ఈక్రమంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో కలచివేస్తోంది. ‘అన్నీ బాగుంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న అన్నా ఎపిసెవా ఈ ఏడాది తన హైస్కూల్ చదువును పూర్తి చేసేది. ఘనంగా జరిగే తన స్కూల్ వార్షిక సదస్సులో ఆమె, ఆమె స్నేహితులు పాల్గొని సందడి చేసేవారు. అందుకోసం వారంతా కొత్త బట్టలు కూడా కొని తెచ్చుకున్నారు. కానీ, పరిస్థితులు తల్లకిందులయ్యాయి. మాయదారి యుద్ధం కలలను కల్లలు చేసింది. దేశాన్ని, తమ పాఠశాలను సర్వనాశం చేసింది. శిథిలాలుగా మిగిలిపోయిన తన స్కూల్ వద్ద ఎపిసెవా కొత్త డ్రెస్సు ధరించి మౌన రోదన చేసేది కాదు!’ అని ఒలెక్సాండ్రా మాత్విచుక్ తన కజిన్ గురించి ఆవేదనభరితంగా ట్విటర్లో రాసుకొచ్చింది. ఎపిసెవా ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి👉🏼 ప్రవక్త కామెంట్లు: అజిత్ దోవల్ పేరుతో ‘గుణపాఠం ట్వీట్’.. కాసేపటికే డిలీట్ Anna Episheva: My niece was supposed to graduate this year from her high school. She and her friends bought dresses and were looking forward to this day. Then Russians came. Her school was directly hit and destroyed. Today she came back to what is left of her school and her plans pic.twitter.com/q9cJW2j8f0 — Oleksandra Matviichuk (@avalaina) June 7, 2022 -
సింహం స్టైలిష్ లుక్ సూపరో సూపర్!.. కటింగ్ చేశారా?
ఫొటోలో కనిపిస్తున్న సింహాన్ని చూడండి. అరె.. సింహానికేంటీ ఈ బేబీ కటింగ్? ఎవరు చేశారబ్బా అనుకుంటున్నారు కదా? జూకు వచ్చిన ఓ వ్యక్తి కూడా ఈ వెరైటీ సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను.. ఈయనగారికి కటింగ్ ఎవరు చేశారో’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇంకేముంది ఫొటోలు విపరీతంగా వైరలయ్యాయి. దీంతో జూ అధికారులు స్పందించారు. సింహానికి తామేం కటింగ్ చేయలేదని, వాతావరణంలో తేమ ఎక్కువుండటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు. ఇంతకీ ఈ సింహం ఎక్కడుందో తెలుసా.. చైనాలోని గ్వాంగ్జౌ జూలో. చదవండి: పుతిన్కు ఊహించని షాక్.. అధికారానికి బీటలు! -
రష్మిక మందన్నా పేరెంట్స్ని ఎప్పుడైనా చూశారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రష్మిక సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ షేర్ చేస్తుంటుంది.తాజాగా రష్మక తన ఫ్యామిలీ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 'ఇది మందన్నా ఫ్యామిలీ అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మీరు మా ముఖాలపై ఎప్పుడూ చిరునవ్వును తీసుకొస్తారు. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాం' అంటూ తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రష్మిక పోస్ట్ షేర్ చేసింది. ఈ ఫోటోలో రష్మిక పేరెంట్స్తో పాటు ఆమె చెల్లి కూడా ఉంది. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రష్మికకు ఇంత చిన్ని చెల్లెలు ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
Meera Jasmine Recent Pictures: మీరా జాస్మిన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒకప్పుడు ఈమె స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులకు సంపాదించుకుంది. ఈ భామ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు యువత ఫిదా అయింది. 2001-2010 కాలంలో మీరా స్టార్ హీరోయిన్. పవన్ కల్యాణ్,బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు నటించి, మెప్పించింది. డబ్బింగ్ మూవీ ‘రన్’తో టాలీవుడ్కి పరిచయమైంది మీరాజాస్మిన్. ఆ తర్వాత 2004లో శివాజీ ‘అమ్మాయి బాగుంది’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన అభినయంతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పవన్ కల్యాణ్తో కలిసి గుడుంబా శంకర్లో నటించింది. ఈ చిత్రంలో మీరాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘చిట్టినడుమునే చూస్తున్న’ పాటలో పవన్, మీరాల కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ బ్యూటీకి వరస ఆఫర్లు వచ్చాయి. రవితేజ భద్ర, విశాల్ పందెకోడి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రాజశేఖర్ గోరింటాకు చిత్రంతో తెలుగింటి ఆడపడచు అయిపోయింది. 2014 లో దుబాయ్లో ఇంజినీర్గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కూడా సినిమాల వైపు తిరిగి చూడలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మీరా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మలయాళంలో ‘మకల్’అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తెరపై బొద్దగా ఉండే మీరా.. ఇప్పుడు చాలా సన్నబడింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో కూడా మీరా..గతంలో కంటే అందంగా కనిపిస్తోంది. రీఎంట్రీ కోసమే ఈ అమ్మడు వెయిట్ లాస్ అయిందట. సన్నబడిన మీరా జాస్మిన్ ఫోటోలు చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. మీరా ఏంటి.. ఇంత సన్నబడింది? సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పుతిన్ ఫొటో వైరల్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(69) ఆరోగ్యం గురించి పాశ్చాత్య మీడియా చేస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. పార్కిన్సన్ లేదంటే క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నారంటూ వరుస కథనాలతో ఊదర గొడుతోంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించి.. ఆపరేషన్ అవసరమని, తద్వారా ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో అధికారం మరొకరికి అప్పగిస్తారంటూ వార్తలు ప్రచురించాయి. అయితే వీటిలో దేనికి క్రెమ్లిన్ వర్గాలు స్పందించలేదు. ఈ తరుణంలో రష్యా టెలిగ్రామ్ చానెల్ జనరల్ ఎస్వీఆర్ సైతం ఈ వార్తల్ని ప్రచురించడంతో.. ఆ కథనాలు నిజమనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా యూకేకు చెందిన ఇండిపెండెంట్ మరో కథనం ప్రచురించింది. విక్టరీ డే సందర్భంగా.. మాస్కో రెడ్ స్క్వేర్ వద్ద నిర్వహిస్తున్న మిలిటరీ పరేడ్లో పుతిన్ దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆయన అనారోగ్యంపై మరిన్ని సందేహాలు రేకెత్తించేలా.. మందంగా ఉన్న దుప్పటితో కాళ్లను కప్పుకుని దర్శనమిచ్చారు. అంతేకాదు, పుతిన్ దగ్గుతూ కనిపించాడని, అక్కడున్న వారందరిలో చలి నుంచి కాపాడుకోవడానికి అదనపు దుస్తులు ధరించింది పుతిన్ ఒక్కడేనని ఇండిపెండెంట్ పేర్కొంది. తొమ్మిది డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్.. అందులో తనకంటే వయసు పైబడిన వాళ్లు ఉన్నా కూడా పుతిన్ ఒక్కడే అలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల ఓ సమావేశంలో టేబుల్ ను గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. సమావేశం జరిగినంత సేపు పుతిన్ టేబుల్ ను పట్టుకుని.. వణికిపోతుండడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు బలపడుతున్నాయి. -
అంబులెన్స్ దొరక్క అర్థాంగిని ఇలా..
ఓ వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన భార్యను రెండు చక్రాల బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన విషాదాంతమైంది. ఉత్తరప్రదేశ్ బలియా జిల్లా చిల్ఖార్ బ్లాక్ అందౌర్ గ్రామానికి చెందిన సకుల్ ప్రజాపతి.. తన భార్య జోగిని(55) ఇలా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మార్చి 28న జోగిని తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేసినా ఆంబులెన్స్ రాలేదు. సాయం కోరినా ఎవరూ స్పందించలేదు. మరో మార్గం లేక తన బండిపై పడుకోబెట్టి 3 కి.మీ.ల దూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు ఆమెను పరీక్షించి, మందులిచ్చి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాపతి అక్కడే బండిలో తన భార్యను వదిలేసి, ఇంటికొచ్చి దుస్తులు, డబ్బు తీసుకుని తిరిగి.. కొందరిని బతిమాలి మినీ ట్రక్కులో బలియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో.. వైద్యులు చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. ఈ ఘటన వైరల్ కావడంతో.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించారు. उप्र में चिकित्सा की झूठी उपलब्धि के झूठे विज्ञापनों में जितना खर्च किया जाता है, उसका थोड़ा-सा हिस्सा भी अगर सपा के समय सुधरी चिकित्सा सेवाओं पर लगातार खर्च किया जाता रहा होता तो आज भाजपा के राज में स्ट्रेचर व एम्बुलेन्स के अभाव में लोगों की जो जान जा रही है वो बचाई जा सकती थी। pic.twitter.com/De892bcDUb — Akhilesh Yadav (@yadavakhilesh) April 5, 2022 -
చేతిలో పసికందుతో సాహసం.. కానిస్టేబుల్కు ప్రమోషన్
మంటల్లో చిక్కుకున్న చోటు నుంచి ఓ పసికందును.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన కానిస్టేబుల్ సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ కరౌలీలో శనివారం మత ఘర్షణలు చెలరేగాయి. ఆ టైంలో పోలీస్ కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ Netresh Sharma చేసిన సాహసంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంవత్సరం రోజు ర్యాలీ సందర్భంగా.. కొందరు రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైంది. ఆ టైంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నేత్రేష్ గాయపడ్డ వాళ్లకు సాయం చేశాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు నిప్పు అంటుకున్న రెండు షాపుల మధ్య ఇంటి నుంచి మహిళను, ఆమె చంటి బిడ్డను నేత్రేష్ ఆదుకోవడం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. "तम में प्रकाश हूँ, कठिन वक़्त की आस हूँ।" So proud of constable Netresh Sharma of Rajasthan Police for saving a precious life. This picture is in deed worth a thousand words.. pic.twitter.com/U2DMRE3EpR — Sukirti Madhav Mishra (@SukirtiMadhav) April 4, 2022 ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఈ రియల్ హీరో సింపుల్గా ‘అది నా బాధ్యత’ అంటూ చెప్పాడు. అయితే తమ కానిస్టేబుల్ తెగువను రాజస్థాన్ పోలీస్ శాఖ మాత్రం గర్వంగా భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దృష్టికి ఈ విషయం వెల్లడంతో స్వయంగా నేత్రేష్కి ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాదు.. కానిస్టేబుల్గా ఉన్న నేత్రేష్ను హెడ్కానిస్టేబుల్గా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. करौली में अपना कर्तव्य निभाते हुए 4 लोगों की जान बचाने वाले कांस्टेबल श्री नेत्रेश शर्मा से फोन पर बात कर उन्हें शाबासी दी। श्री नेत्रेश को हेड कांस्टेबल के पद पर पदोन्नत करने का निर्णय किया है। अपनी जान की परवाह ना कर कर्तव्य निभाने वाले श्री नेत्रेश का कार्य प्रशंसनीय है। pic.twitter.com/3p4ekYNYhn — Ashok Gehlot (@ashokgehlot51) April 4, 2022 ఘర్షణలు చెలరేగిన వెంటనే.. ఇంటర్నెట్పై పరిమిత ఆంక్షలు, 144 సెక్షన్ విధించిన పోలీసులు చాకచక్యంగా పరిస్థితిని అదుపు చేయగలిగారు. ఇక ఘర్షణలకు సంబంధించి 46 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముగ్గురు సభ్యుల కమిటీ ఒకటి ఘర్షణలకు సంబంధించి నిజనిర్ధారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో ఎమ్మెల్యేలు జితేంద్ర సింగ్, రఫిక్ ఖాన్లు ఉన్నారు. एक मां को साथ लिए, सीने से मासूम को चिपकाए दौड़ते खाकी के कदम।#RajasthanPolice के कांस्टेबल नेत्रेश शर्मा के जज्बे को सलाम। करौली उपद्रव के बीच आमजन की सुरक्षा पुख्ता करने में जुटी पुलिस। @RajCMO @DIPRRajasthan @KarauliPolice pic.twitter.com/XtYcYWgZWs — Rajasthan Police (@PoliceRajasthan) April 3, 2022 -
Heart Touching Photo: ఒక్క ఫోటోతో హృదయాలను కదలిస్తున్న బాలిక
వంద మాటలు మాట్లాడినా అర్థంకాని కొన్ని విషయాలు ఒక్క చిత్రం చూస్తే ఇట్టే అర్థం అవుతాయి. మనం చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో చెబుతుంది. వంద మాటలకు సమాధానంగా నిలుస్తుంది.కొన్ని చిత్రాలు మనసుకు హాయినిస్తే.. మరికొన్ని దృశ్యాలు గుండెలు పిండేసేలా కనిపిస్తాయి. ఫోటో జీవిత సత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తుంది. తాజాగా ఓ విద్యార్థిని పాఠశాలలోని తరగతి గదిలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మణిపూర్ రాష్ట్రంలోని తమెంగ్లాంగ్కు చెందిన పదేళ్ల చిన్నారి పమి నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో చిన్నారి ఓ రోజు తన రెండేళ్ల చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని తరగతి గదిలో పాఠాలు వినేందుకు వచ్చింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయం పనుల నిమిత్తం పొద్దున్నే పొలానికి వెళ్లడంతో చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యతను తనకు అప్పగించారు. అయితే చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన పామి తన చెల్లెల్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లలేక తనను తీసుకొని స్కూల్కి వెళ్లింది. తరగతి గదిలో చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని పాఠాలు వినడం, రాసుకోవడం చేస్తుంది. చదవండి: విద్యార్థులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన మహిళా కలెక్టర్.. వీడియో వైరల్! చదువుపై తనకున్న ఆసక్తి, తల్లిదండ్రుల అప్పజెప్పిన బాధ్యతను రెండింటిని కలగలిపి చూపించే ఈ దృశ్యం అందర్ని మనసుల్ని కదిలిస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. చెల్లెలి బాధ్యత, భవిష్యత్తు కోసం చిన్నారి పడుతున్న తపనను అభినందిస్తున్నారు. పమి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవడంతో ఈ విషయం రాష్ట్ర మంత్రి వరకు చేరింది. ఈ ఫోటోలపై మణిపూర్ మంత్రి స్పందించారు. చదువు పట్ల చిన్నారికి ఉన్న అంకితభావం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తను చూసిన తర్వాత బాలిక కుటుంబాన్ని గుర్తించామని, వారిని ఇంఫాల్ తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు తానే చదివిస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. Her dedication for education is what left me amazed! This 10-year-old girl named Meiningsinliu Pamei from Tamenglong, Manipur attends school babysitting her sister, as her parents were out for farming & studies while keeping her younger sister in her lap. pic.twitter.com/OUIwQ6fUQR — Th.Biswajit Singh (@BiswajitThongam) April 2, 2022 -
ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న ప్రముఖ యూట్యూబర్
Youtuber Bumchik Babloo Mayaa Got Secretly Married in Arya Samaj: ప్రముఖ యూట్యూబర్ బుమ్చిక్ బబ్లూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి అలరించిన బబ్లూ ప్రస్తుతం బబ్లూ మాయ అనే యూట్యూబ్ ఛానల్తో తనదైన కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా ప్రియురాలు శ్రీవల్లిని ఆర్య సమాజ్తో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేస్తూ.. జీవితంలో కొత్త చాప్టర్కి చీర్స్ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు బబ్లూకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. బ్యూటిఫుల్ కపుల్కి కంగ్రాట్స్ అంటూ పులువరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరేమో ఇది నిజమైనా పెళ్లేనా? లేక ఏదైనా వెబ్సిరీస్ కోసమా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Comedian Babloo (@babloo_mayaa) -
సెలబ్రెటి పిక్: ఈ కుర్రాడు ఓ సంచలనం, హీరో మాత్రం కాదు.. గుర్తు పట్టారా?
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్లో కొందరు నటీనటులు పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ తమ త్రోబ్యాక్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ గుర్తు పట్టారా? అంటూ చాలెంజ్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఓ సెలబ్రెటీ రేర్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: లైవ్లో ఎక్స్లవ్, బ్రేకప్పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే.. అమాయకపు లుక్స్తో రాముడు మంచి బాలుడు అనే విధంగా కనిపిస్తున్నా ఈ కుర్రాడు ఏ హీరో, నటుడు మాత్రం కాదు. కానీ అంతకు మించిన సెలబ్రెటీ. తరచూ వార్తల్లో నిలుస్తాంటాడు. అందరిది ఒక దారి అయితే ఈయన దారి సపరేట్ అంటాడు. తరచూ వివాదాలు, సంచలనాలకు తెరలేపుతుంటాడు. తనకు తానే ‘నన్ను నమ్మోద్దు మంచి వాడిని కాదు’ అంటూ ప్రచారం చేసుకుంటాడు. దీంతో మాకీదేం కర్మరా బాబు అని కొందరూ అనుకుంటుంటే.. మరికొందరు అసలు ఈ వ్యక్తి ఇలా ఎలా ఉంటాడు అనేంతగా ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే ఇప్పటికే ఈ కుర్రాడు ఎవరో పట్టేసినట్టున్నారు కదా. చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్ అదే మీరు అనుకుంటున్న సెలబ్రెటే, ఆయనే వర్మ. వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన ఫస్ట్ మూవీతోనే బ్లాకబస్టర్ హిట్ అందుకున్నాడు. ఆయన ఆలోచనలు తీరుకు తగ్గట్టుగానే రక్త చరిత్ర, దెయ్యం, సత్యం వంటి ఫ్యాక్షన్, ఫాంటాసి చిత్రాలను తెరకెక్కించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. జయాపజయాలతో సంబంధంగా లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. నిజ జీవిత సంఘటనలను తెరకెక్కిస్తూ కాంట్రవర్సిల చూట్టు తిరుగుతుంటాడు. ఏ అంశం లేకపోతే ట్విటర్లో సినీ, రాజకీయ సెలబ్రెటీలను కవ్విస్తుంటాడు వర్మ. -
ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే!. కానీ, సమయానికి అది బయటపడితేనే.. గుర్తింపు దక్కేది. అందుకు ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం కూడా. ఇవాళ రేపు ఓవర్నైట్ సెన్సేషన్స్కి ఒక వేదిక అయ్యింది ఇంటర్నెట్. బచ్పన్ కా ప్యార్, కచ్చా బాదామ్ లాంటి వాళ్లు ఇలా పాపులర్ అయినవాళ్లే. ఈ లిస్ట్లో ఇప్పుడు చేరిపోయింది బెలూన్లు అమ్ముకునే యువతి కిస్బూ. కిస్బూ రాజస్థానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. కేరళలో ఆమె కుటుంబం సెటిల్ అయ్యింది. రోడ్ల మీద, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తోంది ఈమె కుటుంబం. అయితే అండలూర్ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లిన కిస్బూ జీవితం.. రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన అర్జున్ కృష్ణన్.. సరదాగా జాతరకు వెళ్లి ఫొటోలు తీయసాగాడు. అక్కడ అర్జున్.. అనుకోకుండా అక్కడే బుగ్గలు అమ్ముకుంటున్న కిస్బూను క్లిక్మనిపించాడు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చింది. దీంతో ముగ్దుడైన అర్జున్..ఆ ఫొటోను కిస్బూ, ఆమె తల్లికి చూపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో వైరల్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. దీంతో స్టైలిష్ రమ్య ఆధ్వర్యంలో ఆమెతో కొన్ని ఫొటోషూట్లు చేయించారు. దీంతో ఇప్పుడామె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) సిగ్నళ్ల దగ్గర బుడగలు అమ్ముకునే కిస్బూ.. మోడలింగ్ ఫొటోషూట్లు వైరల్ కావడం, ఆమెకు పలు బ్రాండ్స్ అవకాశాలు దక్కడంపై ఫొటోగ్రాఫర్ అర్జున్ స్పందించాడు. తాను తీసిన ఒక్క ఫొటో వల్ల ఆమె జీవితం మారిపోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇంత గుర్తింపునకు కారణమైన అర్జున్కు కృతజ్ఞతలు చెబుతున్నారు కిస్బూ, ఆమె తల్లి. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) -
పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు..
-
Ind W Vs Pak W: పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు.. వైరల్
ICC Women's World Cup 2022 Ind Vs Pak: ‘దాయాదులు’... ‘చిరకాల ప్రత్యర్థులు’... ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఐసీసీ మేజర్ ఈవెంట్లలో ఇరు జట్లు పోటీ పడుతున్నాయంటే అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. టైటిల్ గెలవకపోయినా సరేగానీ.. దాయాది చేతిలో ఓడితే మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. అందుకు కారణమైన ఆటగాళ్లను ఏ స్థాయిలో ట్రోల్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతారు. అయితే, క్రికెటర్లు మాత్రం ఈ ‘వైరాన్ని’ కేవలం మైదానం వరకే పరిమితం చేస్తారు. ఒక్కసారి బయట అడుగుపెట్టాక అంతా కలిసిపోయి సరదాగా ఉంటారు. పురుషుల టీ20 ప్రపంచకప్-2021లో భారత్ పాక్ చేతిలో ఓటమి పాలైన తర్వాత మెంటార్ ధోని, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడా స్ఫూర్తిని చాటిన తీరు ఇందుకు నిదర్శనం. తాజాగా మహిళల వన్డే వరల్డ్కప్-2022లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత మహిళా జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో దాయాదిని చిత్తు చేసి గెలుపు సంబరంలో మునిగిపోయింది. పాక్ మహిళా జట్టు ఓటమి బాధలో కూరుకుపోయింది. ఇదంతా ఆట వరకే! పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ పట్ల వ్యవహరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రపంచకప్ ఆడేందుకు న్యూజిలాండ్ వచ్చిన బిస్మా.. తన చిన్నారి పాపాయిని కూడా వెంట తీసుకువచ్చింది. ఆ చిట్టితల్లిని చూసి ముచ్చటపడిన భారత మహిళా క్రికెటర్లు ఆ ‘అమ్మ’ దగ్గరకు వెళ్లి బుజ్జాయిని కాసేపు ఆడించారు. బిడ్డను ఎత్తుకున్న బిస్మా చుట్టూ చేరి పాపతో సరదాగా గడిపారు. ఆ తర్వాత ఆమెతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐసీసీ సైతం ఈ ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. ‘‘ఇండియా- పాకిస్తాన్ క్రికెట్ స్ఫూర్తి గురించి చిన్నారి ఫాతిమా ఇప్పుడే పాఠాలు నేర్చుకుంటోంది’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఫొటో ఆఫ్ ది డే.. ఎంత హృద్యంగా ఉంది. అత్యంత అందమైన అద్బుతమైన క్షణాలు ఇవి. హృదయం పరవశించిపోతోంది’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్- 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు: ఇండియా-244/7 (50) పాకిస్తాన్-137 (43) 102 పరుగుల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: పూజా వస్త్రాకర్ చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్పై విమర్శలు! Little Fatima's first lesson in the spirit of cricket from India and Pakistan 💙💚 #CWC22 📸 @TheRealPCB pic.twitter.com/ut2lCrGL1H — ICC (@ICC) March 6, 2022 This video .. 🇮🇳🙌🏻🇵🇰#INDvPAK #INDvSL #PAKvIND #PAKvAUS#CWC22 #Peshawarblast pic.twitter.com/VuoCOGyzKW — DhrubaJyot Nath 🇮🇳 (@Dhrubayogi) March 6, 2022 Photo of the day!! #INDvPAK pic.twitter.com/OmHXuLPaVv — Milan Nakrani (@milannaks) March 6, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
ఎటు తిరిగి ఉన్నాడో అర్థం కావట్లేదు.. ఇదేం సెల్ఫీ
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్తో జరిగిన ఫైనల్లో లాహోర్ ఖలందర్స్ 42 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఫఖర్ జమాన్ లీగ్లో 588 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి బ్యాటర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. విషయంలోకి వెళితే.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఖలందర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఫఖర్ జమాన్ ప్రేక్షకుల వైపు తిరిగాడు. ఇదే సమయంలో ఇద్దరు అభిమానులు ఫఖర్ జమాన్ను కవర్ చేస్తూ ఒక సెల్ఫీ తీసుకున్నారు. తాజాగా ఆ ఫోటోను జమాన్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఈ విధంగా కలవడం ఆనందంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే అది లాంగ్షాట్ కావడంతో ఫఖర్ నిజంగా సెల్ఫీ ఇచ్చాడా లేదా అన్నది క్లియర్గా తెలియడం లేదు. దీంతో అభిమానులు ట్రోల్స్ వర్షం కురిపించారు. ''అసలు ఎటు తిరిగి ఉన్నాడో అర్థం కాలేదు.. ఇదేం సెల్ఫీ'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Ind Vs SL 1st Test: ఒక్కరు కూడా సరైన ప్రశ్నలు వేయడం లేదు: రోహిత్ శర్మ IND VS SL 1st Test: అంతా కోహ్లినే చేశాడు.. హిట్మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు It was nice to meet you 😆 https://t.co/vPxWvjqbmq — Fakhar Zaman (@FakharZamanLive) March 3, 2022 -
హీరోయిన్తో సల్మాన్ ఖాన్ రహస్య వివాహం, ఫొటో వైరల్!
బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్, బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారంటూ ఓ ఫొటో నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఈ ఫొటో చూసిన సల్మాన్ అభిమానులు చడీచప్పుడు లేకుండా మా హీరో పెళ్లి చేసుకోవడమేంటి? అది కూడా రహస్యంగానా? ఏదో తేడా కొడుతోందంటూ చర్చలు మొదలుపెట్టారు. అంత పెద్ద హీరో సడన్గా, ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా పెళ్లిపీటలెక్కేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. నిజమేంటంటే సల్మాన్ ఓ ఇంటివాడయ్యాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అతడింకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గానే ఉన్నాడు. సోనాక్షితో వివాహం అంటూ వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. ఇక ఆ ఫొటో సంగతంటారా? అది కేవలం మార్ఫింగ్ ఫొటో లేదా ఏదైనా సినిమా స్టిల్ అయ్యుంటుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. కాగా సల్మాన్, సోనాక్షి దబాంగ్ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'కబీ ఈద్ కబీ దివాళి' సినిమా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్పైకి వెళ్లనుంది. -
తాబేలు.. గుండె గుభేలు
ఏదో బాడీ బిల్డర్ పోటీల్లో తాబేలు తన కండలు చూపిస్తున్నట్టుంది గదా ఫొటో చూస్తుంటే. ఎదురుగా ఉన్నవాళ్లు భయపడిపోయేలా కోపంగా చూస్తోంది కదా. ఇదో గ్రీన్ సీ టర్టల్. గాలపగోస్లో ట్రిప్లో ఉండగా ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ డానియెలె కొమిన్ దీని ఫొటో తీశారు. ‘సముద్రంలోకి హామర్హెడ్స్ షార్క్ల ఫొటోలు తీయడానికని కొమిన్ బయలుదేరా. అది మిట్టమధ్యాహ్నం సమయం. కెమెరా సెట్ చేసుకుని డైవ్ చేశా. ఆ నీళ్లు పచ్చగా ఉన్నాయి. వెలుతురు సరిగా లేదు. సరైన ఫొటోల కోసం కెమెరాను సరి చేయడానికి చాలా సమయం పట్టింది’ అని తన కష్టాన్ని వివరించారు ఫొటోగ్రాఫర్. -
వైరల్గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా?
‘డార్లింగ్’ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మైథలాజికల్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్కు ఏళ్లు పడుతుందేమో అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఆశ్చర్యకరంగా దర్శకుడు 103 రోజుల్లోనే ఆది పురుష్ షూటింగ్ పూర్తి చేశాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు పలు టెక్నికల్ వర్క్ పునులతో మూవీ టీం బిజీగా ఉంది. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు! ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్లోని ప్రభాస్ శ్రీరాముడి లుక్ను మూవీ టీం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిగా ప్రభాస్ ఎలా లైవ్ లుక్ ఎలా ఉండనుందోనని డార్లింగ్ ఫ్యాన్స్లో ఆసక్తికి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆది పురుష్లో ప్రభాస్ శ్రీరాముడిగా ప్రభాస్ ఇలా ఉండనున్నాడంటూ న్యూ లుక్ను ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఇది అసలైన లుక్ కాదని, కొందరు నెటిజన్లు, ఫ్యాన్స్ ఆసక్తి ఆపుకోలేక పలు శ్రీరాముడి పాత్రలకు ప్రభాస్ ఫొటోను జీఐఎఫ్లో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: మెగా ఫ్యాన్స్కు గుడ్న్యూస్, ‘ఆచార్య, భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి ఏదేమైనా తమ అభిమాన హీరోను ఇలా శ్రీరాముడి లుక్లో చూసుకుని ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కాగా ఆదిపురుష్ మూవీ మొత్తం బడ్జెట్ రూ. 400 కోట్లు అని తెలుస్తోంది. సుమారు 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఆదిపురుష్ రిలీజ్ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రాలురాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. అలాగే సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. Fan Made Edit 💥 Imagine #Adipurush FL🏹#Prabhas pic.twitter.com/KKG0NpjwSc — _✨🎭.ℂ𝐨𝙽𝕋𝐢𝙽𝐞𝙽𝐓𝕒𝙻._𝐠𝚃._.𝐑𝕠𝙼𝐞𝕠._ (@_unluckyromeo__) January 29, 2022 -
విడాకుల తర్వాత ఐశ్వర్య ఫస్ట్ ఫోటో ఇదే.. నెట్టింట వైరల్
Aishwarya Rajinikanth First Photo After Divorce With Dhanush: మొన్నటిదాకా కోలీవుడ్లో స్టార్ కపుల్గా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ధనుష్-ఐశ్వర్యలు మాత్రం తమ పనుల్లో ఫుల్ బిజీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాదాలోనే ఒకే హోటల్లో ఉన్న వీరు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. సార్ సినిమా షూటింగ్ పనుల్లో ధనుష్ నిమగ్నమైతే, ఓ సాంగ్ షూటింగ్ కోసం ఐశ్వర్య ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయింది. గతంలో సినిమాలు డైరెక్టర్ చేసిన ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్ సాంగ్ను తెరకెక్కిస్తుంది. వాలెంటైన్స్ డే స్పెషల్గా ఈ సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన డిస్కషన్లో ఐశ్వర్య పాల్గొంది. ధనుష్తో విడాకులు ప్రకటించిన అనంతరం ఐశ్వర్య తొలిసారిగా కనిపించడంతో ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. -
కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం
Yuzvendra Chahal Emotional Note For Virat Kohli Viral: ‘‘ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు... పరస్పర నమ్మకం.. అవగాహనతో ముందుకు వెళ్లడం నిజంగా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇందుకు నేనెంతో సంతోషిస్తున్నా. ఇలాగే మరిన్ని మ్యాచ్లలోనూ మనం కలిసి ముందుకు సాగాలి. అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. విజయవంతమైన కెప్టెన్గా ఏడేళ్లు నడిపించిన నీకు ధన్యవాదాలు. అవును... భయ్యా నేను ఎవరి వికెట్ తీయాలో చెప్పవా?’’ అంటూ టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్.. విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఒకప్పటి సారథి కోహ్లితో చహల్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ తొలి నాళ్ల నుంచి కింగ్ కెప్టెన్ అతడిని ప్రోత్సహించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ చహల్పై నమ్మకం ఉంచి మెరుగైన ఫలితాలు అందుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత సంప్రదాయ క్రికెట్ కెప్టెన్సీకి కోహ్లి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు కూడా చేతులు మారాయి. ఈ నేపథ్యంలో కోహ్లితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చహల్ ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఫొటో షేర్ చేశాడు. ఇందులో కోహ్లి అతడికి ఏవో సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ సారథ్యంలో చహల్తో కలిసి కోహ్లి ఓ సభ్యుడిగా మాత్రమే మొదటి వన్డే ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో చహల్ ఈ ఫొటో షేర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇక జనవరి 19 నుంచి ప్రొటిస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆరంభమవుతోంది. చదవండి: Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లివే Ind Vs Sa 1st ODI: ధావన్కు షాక్... ఓపెనర్గా వెంకటేశ్ అయ్యర్! View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
హృదయవిదారకం: తండ్రిని భుజాల మీద మోశాడు, కానీ..
శ్రవణ కుమారుడు.. రామాయణంలో ఉదాత్తమైన పాత్ర. అంధ తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ.. కంటికి రెప్పలా తన చివరిశ్వాసదాకా కాపాడుకున్న తనయుడు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం శ్రవణ కుమారుడిది. అలాంటి కొడుకులు ఈరోజుల్లో ఉంటారా? అంటే.. బ్రెజిల్లో ఓ యువకుడిని చూపిస్తున్నారు. బ్రెజిలియన్ అమెజాన్ అడవుల గుండా ఓ వృద్ధుడిని భుజాన మోసుకుంటూ వెళ్తున్న ఒక తెగ యువకుడి ఫొటో సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఆ కొడుకు పేరు తైవీ(24). భుజాన ఉంది అతని తండ్రి వాహూ. దట్టమైన అడవి.. ఆరు గంటల కాలినడకన గుట్టలు, వాగులు దాటి ప్రయాణించాడు. వ్యాక్సినేషన్ సెంటర్కు చేరుకుని.. తిరిగి మళ్లీ ఆరు గంటల ప్రయాణంతో ఇంటికి చేరుకున్నాడు. వ్యాక్సినేషన్ కోసం అలా తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రికి చూపు సరిగా లేదు. పైగా అనారోగ్యం ఉంది. అందుకే అలా. ‘ఈరోజుల్లో ఇలాంటి కొడుకు ఉంటాడా?’ అనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తం అవుతోంది. డాక్టర్ ఎరిక్ జెన్నింగ్స్ సిమోయిస్ ఆ దృశ్యాన్ని క్లిక్మనిపించాడు. సాయం చేసేందుకు తాము ముందుకు వెళ్లినా.. వద్దని సున్నితంగా తిరస్కరించాడట తైవీ. వాస్తవానికి ఈ ఫొటో కొత్తది కాదు. కిందటి ఏడాదిలో తీసింది. పైగా ఈ కథ విషాదాంతం కూడా అయ్యింది. ఈ తండ్రీకొడుకులు జోయ్ గిరిజన తెగకు చెందినవాళ్లు. తైవీ, అతని తండ్రి మొదటి డోస్వ్యాక్సినేషన్ కోసం వెళ్తుండగా తీసిన ఫొటో. కిందటి ఏడాది సెప్టెంబర్లో వాహూ చనిపోయాడు. ఆయన మరణానికి కారణాలు తెలియవు. తైవీ ఆ కుటుంబానికి పెద్దగా మారాడు. ఈ మధ్యే మూడో వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాడు కూడా. బ్రెజిల్ పారా స్టేట్లో ఈ కమ్యూనిటీ పలు ప్రాంతాల్లో స్థిరపడింది. వాళ్లంతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుండగా.. కరోనా మాత్రం వెంటాడుతోంది. అందుకే వ్యాక్సిన్ కోసం ఇలా సాహసోపేతంగా ప్రయాణిస్తున్నారు. బ్రెజిల్ వ్యాప్తంగా 853 మంది గిరిజనులు చనిపోయారు. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెగ పెద్దలు చెప్తున్నారు. విషాదం: పొగిడారు, ఫొటోలు తీశారే తప్ప.. -
పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా! జడేజా ఫొటో వైరల్.. టాలీవుడ్ నీకోసం ఎదురుచూస్తోంది!
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ట్రెండ్ను బట్టి ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ట్రాన్స్లో పడిపోయిన జడ్డూ భాయ్... ''పుష్ప.. పుష్పరాజ్.. దీనమ్మ తగ్గేదే లే..'' అంటూ డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్తో ముందుకు వచ్చాడు. పుష్పరాజ్గా అల్లు అర్జున్ లుక్ను రీక్రియేట్ చేసి ఆశ్చర్యపరిచాడు. ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైరూ..’’ అంటూ నోట్లో బీడీతో మాస్ లుక్తో సర్ప్రైజ్ చేశాడు. అయితే.. ఇది కేవలం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మాత్రమేనని, సిగరెట్, బీడీ, పొగాకు సేవనం ఆరోగ్యానికి హానికరం అనే నోట్తో సామాజిక బాధ్యతను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘టాలీవుడ్ నీకోసం ఎదురుచూస్తోంది జడ్డూ భాయ్.. ఏయ్ బిడ్డా.. ఇది జడ్డూ కా అడ్డా’’ అంటూ తెలుగు నెటిజనం కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జడ్డూ పోస్టుపై స్పందించాడు. ‘‘తగ్గేదేలే’’ అంటూ ఫైర్ ఎమోజీలను జతచేశాడు. కాగా జడేజా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్కు దూరమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక గబ్బర్ శిఖర్ ధావన్ సైతం పుష్పరాజ్గా మారి అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) -
వైరల్: ఫోటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపట్టండి.. కష్టంగా ఉందా?
చిరుతపులి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత వేటాడి దాడి చేస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుతపులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలోనూ ఇది ఆరితేరిన జంతువు. అలాంటి చిరుతకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైకు చెందిన అమిత్ మెహ్రా అనే యూజర్ తన ట్విటర్లో చిరుతపులికి చెందిన ఫోటోను పోస్టు చేశారు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! There is a leopard in this picture. Try to spot it. No pun intended 🥴 pic.twitter.com/xeT87wV1cy — Amit Mehra (@amitmehra) December 27, 2021 ఈ చిత్రంలో చిరుత ఎక్కడుందో గుర్తించాలంటూ నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ ఫోటో అడవి మధ్యలో చెట్ల దగ్గర తీసినట్లు కనిపిస్తుంది. అయితే ఇందులో చిరుత ఎక్కుడుందో కనుక్కోవడమే అసలైన టాస్క్. సాధారణంగా కొన్ని చూడగానే టక్కున కనిపిస్తాయి. మరికొన్ని కొంచెం నిశితంగా పరిశీలిస్తేనే కనిపించే అవకాశం ఉంటుంది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు. ఫోటోలో చిరుత ఉందా అనే సందేహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు గుర్తు పట్టడం చాలా కష్టమండోయ్ అంటున్నారు. మరి ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి. కనిపించకుంటే కింద ఉన్న ఫోటోను చూడండి మీకే తెలుస్తుంది. చదవండి: రైల్వే ట్రాక్పై తలపెట్టి ఆత్మహత్యాయత్నం.. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో.. -
ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్కు క్రికెట్ అంటే పిచ్చి
Twitter CEO Parag Agrawal Huge Cricket Fan.. ట్విటర్ నూతన సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికైనప్పటి నుంచి నెటిజన్లు ఆయన కోసం గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరాగ్ గురించి ఆసక్తికర ఫోటోలు, విషయాలు బయటపడ్డాయి. నవంబర్ 29న జాక్ డోర్సీ నుంచి సీఈవో బాధ్యతలు తీసుకున్న పరాగ్ అగర్వాల్కు క్రికెట్ అంటే ప్రాణం. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పరాగ్ అగర్వాల్ టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్ను ఎంకరేజ్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు 2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియా గెలిచిన తర్వాత పరాగ్ భారత్ జెండా పట్టుకొని వీధుల్లో తిరిగిన ఫోటోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Twitter CEO Parag Agarwal: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్ది.. బెన్ఫిట్ అమెరికాది! -
ఆ ఫోటోలు లీక్.. అడ్డంగా బుక్కయిన హీరోయిన్
Jacqueline Fernandezs Romantic Photo With Sukesh Chandrasekhar Leaked: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్తో కలిసి క్లోజ్గా దిగిన ఓ ఫోటో బయటకు వచ్చింది. సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్పై అభియోగం ఉంది. అంతేకాకుండా మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ సైతం ఈడీ విచారణను ఎదుర్కొంది. అయితే సుకేశ్తో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొంది. తాజాగా అతడితో జాక్వెలిన్ రొమాంటిక్గా దిగిన ఓ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుకేశ్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన సమయంలో ఏప్రిల్ – జూన్ కాలంలో ఈ సెల్ఫీ తీసినట్లు తెలుస్తుంది. సుకేశ్..జాక్వెలిన్ను చెన్నైలో దాదాపు నాలుగుసార్లు కలిశాడని, అంతేకాకుండా జాక్వెలిన్కు ప్రైవేటు జెట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. -
ఆఫీసులో ఫోన్ ఛార్జింగ్ పెడితే జీతం కట్!
స్మార్ట్ ఫోన్.. మనకి రోజూవారీ పనుల్లో ఓ భాగం అయ్యింది. బయటకు వెళ్లేప్పుడు మాస్క్ మరిచిపోతున్నా.. ఫోన్ మాత్రం వెంటే ఉంటుంది. మరి వాడకానికి తగ్గట్లు పాపం ఛార్జింగ్ కూడా అవసరం కదా! అందుకే చాలామంది పని చేసే చోట్ల కూడా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అయితే ఇక్కడో బాస్ అందుకు అభ్యంతరం చెప్తున్నాడు. వర్క్ప్లేస్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం కుదరదని అంటున్నాడు ఆ బాస్. ఆ బాస్, ఆఫీస్ ఎక్కడిదనేది క్లారిటీ లేదు. కానీ, ఇందుకు సంబంధించిన ఓ పేపర్ నోట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ అలవాటు కరెంట్ దొంగతనం కిందకే వస్తుందని, పనిచోట నైతిక విలువలకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు ఆ బాస్. ఈ నోట్ రెడ్డిట్ వెబ్సైట్లో చర్చకు దారితీసింది. గంటల తరబడి ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుందని, అలాంటప్పుడు ఆఫీస్ కరెంట్ ఉపయోగించుకోవడంలో తప్పేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరికొందరేమో ఆ బాస్ చేసింది కరెక్టేనని, దీనివల్ల ఫోన్-ఇంటర్నెట్ వాడకం తగ్గుతుందని, అంతేకాదు మైండ్ డైవర్షన్ లేకుండా పనిలో నైపుణ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే వర్క్ ప్లేస్లో ఫోన్, డివైస్ల ఛార్జింగ్ను చాలా కంపెనీలు వ్యతిరేకిస్తాయని, వాల్మార్ట్ లాంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ సైతం ఇలాంటి నిబంధనను అమలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు ఇంకొందరు. ఇక ఈ నోట్ మూడేళ్ల క్రితమే రెడ్డిట్లో ఇలా చర్చకు దారితీయడం మరో విశేషం. చదవండి: Work From Home.. మారిన రూల్స్! ఏంటంటే.. -
రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. ఆందోళనలో ప్రజలు
Queen Elizabeth Purple Hands: సోషల్మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించి అయితే ప్రతీది నెట్టింట చక్కర్లు కొట్టడం సహజం. ఒక్కోసారి ఫేక్ వార్తలకు వాళ్లే స్వయంగా బదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా క్విన్ ఎలిజబెత్ చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 19 న లండన్లోని విండ్సర్ కాస్టిల్లో డిఫెన్స్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్తో ఏదో విషయమై క్వీన్ ఎలిజబెత్ భేటీ అయ్యారు. ఆ సమయంలో వారిద్దరిని ఓ ఫోటో తీయగా, దాన్ని బకింగ్హమ్ ప్యాలెస్ విడుదల చేసింది. వయసు కారణంగా ఇటీవల కొంత కాలంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్విన్ ఎలిజబెత్ చేతులు రంగు మారి కనిపించడంతో ఇంకా తనకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. అయితే.. ఆ ఫోటోపై రకరకాల అభిప్రాయాలు రావడంతో షేక్స్పియర్ మెడికల్ సెంటర్కు చెందిన డాక్టర్ జై వర్మ స్పందిస్తూ.. రెనాడ్స్ అనే వ్యాధి వల్ల అయి ఉండొచ్చు లేదంటే చేతులు చల్లగా అవడం వల్ల ఇలా మారుండచ్చు. జాన్ హోప్కిన్స్ మెడిసిన్ సైట్ ప్రకారం.. కోల్డ్ లేదా స్ట్రెస్ వల్ల చేతులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే అలా చేతులు రంగు మారడం సహజమని తెలిపారు. నేషనల్ హెల్త్ సర్వీస్, యూకే ప్రకారం.. అది పెద్దగా సీరియస్ కండిషన్ కాదు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. శరీరానికి కాస్త వేడి తాకితే.. ఆ కండిషన్ మారుతుంది.. అని స్పష్టం చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారడంతో నెటజన్లు తమకు తోచినట్లుగా కామెంట్లు పెట్టడంతో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. The Queen now has zombie hands… wonder why?#boostershot https://t.co/RRVDj31TSd — Matthew Scarsbrook (@mgscarsbrook) November 17, 2021 చదవండి: Pet Dog: కుక్క హెయిర్ డైకి లక్షలు ఖర్చు చేసిన మోడల్, నెటిజన్ల ఆగ్రహం -
అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం
సౌర మంట అనేది సూర్యునిపై అకస్మాత్తుగా పెరిగిన ప్రకాశం, సాధారణంగా ఇది సూర్యని ఉపరితలం వద్ద లేదా సూర్యరశ్మి సమూహానికి దగ్గరగా ఉంటుంది. ఈ మంటల నుంచి రేడియో తరంగాల నుండి గామా కిరణాల వరకు అన్ని రకాల తరంగ దైర్ఘ్యాలు విద్యుదయస్కాంత వర్ణపటం అంతటా వ్యాపించి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. చాలా దృశ్య శక్తి పరిధి వెలుపల ఉన్న పౌనఃపున్యాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. వేగవంతమైన చార్జ్డ్ కణాలు ప్రధానంగా ఎలక్ట్రాన్లు, ప్లాస్మా మాధ్యమంతో సంకర్షణ చెందుతున్నప్పుడు ఈ మంటలు సంభవిస్తాయి. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) అరోరా అనేది ఒక సహజ విద్యుత్ దృగ్విషయం. ఇది ఆకాశంలో.. ముఖ్యంగా ఉత్తర లేదా దక్షిణ అయస్కాంత ధ్రువం దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చని కాంతికి సంబంధించిన స్ట్రీమర్ల రూపాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో దీనిని వరుసగా అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ అరోరా ఆస్ట్రాలిస్ లేదా సదరన్ లైట్స్ అని పిలుస్తారు. అయితే జీవిత కాలంలో ఎప్పుడో అరుదుగా లభించే చిత్రాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి థామస్ పెస్క్వెట్ తీశారు. We were treated to the strongest auroras of the entire mission, over north America and Canada. Amazing spikes higher than our orbit🤩, and we flew right above the centre of the ring, rapid waves and pulses all over. #MissionAlpha https://t.co/5rdb08ljhx pic.twitter.com/0liCkGvRCh — Thomas Pesquet (@Thom_astro) November 6, 2021 అంతేకాదు ఆయన గ్రహం ఉత్తర భాగంలో మిరుమిట్లు గొలిపే అరోరాస్ (ఎర్రటి లేదా ఆకుపచ్చ)తో బలమైన సౌర మంట వెలుగుతున్న క్షణాన్ని ఫోటో తీశాడు.పైగా ఈ మండుతున్న సూర్యుని కాంతి భూమి వైపు దూసుకుపోతున్న అద్భుతమైన సమయంలో తీశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోతోపాటు "మా మిషన్ మొత్తం ఉత్తర అమెరికా నుంచి కెనడా మీదుగా ప్రసరిస్తున్న సౌర కాంతిని చూశాం. అయితే మా కక్ష్య కంటే అద్భుతమైన ఎత్తులో ఆ కాంతి ప్రసరిస్తుంది. మేము తరంగ ధైర్ఘ్యాల మధ్యలో ఉన్నాం" అని పెస్క్వెట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్కి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి మీరు చూడండి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) -
దీపావళి సర్ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్
దీపావళి సందర్భంగా జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు. పండగ రోజున తనయులు అభయ్ రామ్, భరత్ రామ్లతో కలిసి దిగిన ఫొటోను తారక్ షేర్ చేసి ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ముగ్గురు ఒకే రకమైన సంప్రాదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక తనయులతో తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు. దీంతో ఈ ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం! అలాగే అబ్బాయిలు ముద్దుగా ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా తారక్ తన వ్యక్తిగత విషయాలను జాప్యంగా ఉంచుతాడు. అలాగే అభయ్ రామ్, భరత్ రామ్లను మీడియాకు దూరంగా ఉంచుతాడు. వారి ఫొటోలను కూడా చాలా అరుదుగా షేర్ చేస్తుంటాడనే విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బిజీగా ఉన్నాడు.ఈ మూవీ అనంతరం ఆయన కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే ఓ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు. చదవండి: దీపావళికి జిగేల్మన్న తారలు, చూసేయండి ఫొటోలు View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
ఆ ఫోటో చూసి సెట్స్లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్
Neha Sharma About Her Morphed Photo: 'చిరుత' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. తొలి సినిమాతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్కే పరిమితమైన ఈ భామ ఇటీవలె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నేహా మాట్లాడుతూ.. 2018లో నా ఫోటో ఒకటి మార్ఫింగ్ చేసి దానికి సెక్స్ టాయ్ను జత చేశారు. ఆ సమయంలో నేను 'ఇల్లీగల్' అనే వెబ్సిరీస్లో నటిస్తున్నాను. రోజూ లాగే ఆరోజు కూడా సెట్స్పైకి వెళ్లినప్పుడు అందరూ నాతో విచిత్రంగా ప్రవర్తించారు. ఎవరూ నాతో మాట్లాడలేదు. ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఇందుకు అందరూ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నా. అప్పుడే ఒకరు నా దగ్గరికి వచ్చి ఆ మార్ఫింగ్ ఫోటోను చూపించారు. ఇది నెట్టింట వైరల్ అవుతుందని చెప్పారు. అది చూసి షాక్ అయ్యాను. నాకే ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను. అప్పటికింకా చాలా యంగ్ ఏజ్లో ఉన్నా. ఇలా ఎందుకు చేస్తారు? అంత పనిలేకుండా ఉన్నారా అని చాలా బాధపడ్డా. కానీ నిజం ఏంటో నాకు తెలుసు. కానీ ఏది ఏమైనా ఇలా మార్ఫింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు అని పేర్కొంది. చదవండి: ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ -
150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం.. నెట్టింట ఫోటో వైరల్
ప్రపంచం అధూనీకత, టెక్నాలజీ, అభివృద్ధి అంటూ ముందుకు పోతోంది. ఓ వైపు బాగున్నా మరో వైపు మాత్రం అడవులను నరికేస్తూ, పర్యావరణ నాశనానికి కారణమవుతున్నాం. ఈ నేపథ్యంలో బయోడైవర్శిటీ పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ఇప్పటికే పలు రకాల పక్షులు, జంతువులు, ప్రాణుల అంతరిస్తూ వస్తున్నాయి. గతంలోని కొన్ని జాతుల పక్షులు, జంతువులు ప్రస్తుతం లేవు. ఇలాంటి పరిస్థితుల్లో.. తాజాగా ఓ అరుదైన పక్షి కనిపించి ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం దాన్ని ఫోటో నెట్టింట వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..150 ఏళ్ల క్రితం కనిపించిన ఓ పెద్ద గుడ్లగూబ తాజాగా శాస్తవేత్తల కెమెరా కంటపడింది. అంటే ఆ జాతి పక్షి చివరి సారి 1872లో కనపడగా, ఆ తర్వాత ఇప్పుడే కనిపించింది. షెల్లీ ఈగల్ జాతికి చెందిన ఈ అరుదైన గుబ్లగూబ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటాయి. ప్రపంచంలోని గుడ్లగూబల కంటే వీటి ఆకారం పెద్దవి. ఇవి మనుషుల కంట పడి సుమారు 100 సంవత్సరాలు దాటడంతో అంతరించిపోయాయని అంతా అనుకున్నారు. అయితే.. అక్టోబర్ 16న లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్లోని లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ జోసెఫ్ టోబియాస్, సోమర్సెట్కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ విలియమ్స్ ఈ పక్షిని ఘనాలోని అటెవా అడవిలో చూశారు. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వెంటనే దాన్ని కెమరాతో క్లిక్ మనిపించారు. అయితే వారిద్దరూ ఈ పక్షిని కేవలం 15 సెకన్ల పాటు మాత్రమే చూడగలిగారు. ఆ పక్షి విలక్షణమైన నల్లని కళ్ళు, పసుపు రంగు బిల్ ఆకారంలో పెద్దదిగా ఉంది. ఈ అరుదైన పక్షి కోసం పశ్చిమ లోతట్టు ప్రాంతాలలో సంవత్సరాలుగా వెతుకుతున్నారు. తాజాగా తూర్పు ప్రాంతంలోని రిడ్జ్టాప్ అడవులలో దీనిని కనుగొనడం వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. First confirmed sighting of an extremely rare owl in Ghana's Atewa Forest in 150 years. Two British ecologists conducting research in the forest recently saw the Shelley's Eagle Owl (indigenous to Central & West Africa). The discovery could prompt the Atewa Forest to be protected pic.twitter.com/fQ6ININAuH— ghanaspora (@ghanaspora) October 23, 2021 చదవండి: Youtuber Pankaj Sharma: ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్ చేస్తే.. కోట్లు సంపాదిస్తున్నాడు..! -
బ్యాంకులో మాస్క్ పెట్టుకోవాలి అన్నందుకు.. అధికారులకు దిమ్మతిరిగేలా షాకిచ్చాడు!
బీజింగ్: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరోనా. మహమ్మారి కట్టడి కోసం మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి సర్వ సాధారణమయ్యాయి. మాస్క్ లేనివారిని జన సంచారమున్న ప్రాంతంలో, మాల్స్లో, బ్యాంకుల్లో కూడా అనుమతించడం లేదు. తాజాగా ఓ మిలియనీర్ మాస్కు పెట్టుకోకుండా బ్యాంకుకు వెళ్లాడు. అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఆ బిలియనీర్ని అడ్డగించి మాస్క్ ధరించకపోతే బ్యాంకులోకి అనుమతిలేదని తేల్చి చెప్పాడు. దీంతో సదరు మిలియనీర్ చేసిన పనికి బ్యాంకు అధికారులు షాక్కు గురయ్యారు. ఈ ఘటన చైనాలోని బ్యాంక్ ఆఫ్ షాంఘైలో చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డు చెప్పిన విధానం నచ్చలేదో, లేదా అతని ప్రవర్తన నచ్చలేదో గానీ ఆ వ్యక్తి తన ఖాతాలోని డబ్బులన్నీ విత్ డ్రా చేసేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం.. ఒక రోజుకు 5 మిలియన్ల యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం 5.8 కోట్లు) మాత్రమే బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకునే పరిమితి ఉంది. దీంతో అంత సొమ్మును ఒకేసారి విత్ డ్రా చేశాడు ఆ బిలియనర్. ఇదిలా ఉంటే ఒకే కరెన్సీ కౌంటర్తో అంత పెద్ద మొత్తాన్ని లెక్కపెట్టడానికి బ్యాంకు సిబ్బందికి రెండు గంటలపైగా పట్టిందట. అంతటి ఆగకుండా తన ఖాతాలో డబ్బు మొత్తం విత్ డ్రా చేసే వరకూ ప్రతిరోజూ ఇదే సీను రిపీట్ అవుతుందని ఆ మిలియనీర్ చెప్పాడట. అలా విత్ డ్రా చేసిన డబ్బును వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి డబ్బులు ఉన్న సూట్కేసులను తన లగ్జరీ కారులో తీసుకెళ్తున్న ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. చదవండి: Viral Video: గిఫ్ట్ బాక్స్ చూసి షాక్ అయిన వధువు..ఇంతకీ అందులో ఏమందంటే..! -
ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!
న్యూఢిల్లీ: మనం చిన్నప్పటి ఫోటోలను మన స్నేహితులకు చూపించి ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పు అని అడుగుతాం. కానీ వాళ్లు మనమే అని కూడా సరిగా గుర్తు పట్టలేరు కదా. ఎందుకంటే వయసు పెరుగుతుంటే కొంచెం కొంచెంగా శరీరంలో మార్పులు సంతరించుకోవడంతే కొంచెం పోల్చుకోవడం కష్టం అనిపిస్తోంది. మరికొంత మందిని ఈజీగా గుర్తుపట్టేయగలం. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) ఏంటి సోదీ అనుకోకండి ఇక్కడ ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడయోలో పోస్టు చేసి ఇతనెవరో గెస్ చేయండి ప్లీజ్ అంటు కామెంట్ జోడించి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచే మిలిందా ఈసారి తన చిన్ననాటి స్మృతులను తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది తాను ఆరేళ్ల వయసులో ఉండగా తీసిన పోటో అంటూ చెప్పుకొచ్చాడు. పైగా తాను ఆ వయసులో మంచి రైతు అవ్వాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు ఈ 50 ఏళ్ల వయసులో కృత్రిమంగా కూరగాయాలు ఎలా పండించాలో తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ప్రస్తుతం మిలింద్ సోమన్ మలైకా అరోరా అనూష దండేకర్తో కలిసి టీవీ రియాలిటీ షో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రెండవ సీజన్కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: టైంకి ఎయిర్పోర్ట్కి చేరాలంటే ట్రాక్టర్పై వెళ్లక తప్పదు) -
ఆ రాయి అలా ఎందుకుందో అర్థంకాక తలలుపట్టుకుంటున్న నెటిజన్లు
ప్రస్తుతం టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పాలి. ఇటువంటి తరహాలో ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది ఓ పెద్ద బండరాయికి సంబంధించిన ఫోటో అది. ఆ బండరాయి సరిగ్గా మధ్యలో చీలిపోయి ఉంటుంది. ఇందులో వింత ఏమిటంటే.. మధ్యలో చీలిన ఆ రాయి అలా కట్ చేయడం మనుషుల వల్ల కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం. అందుకే ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఈ బాహుబలి బండరాయిని సౌదీ అరేబియాలోని తైమా ఒయాసిస్లో మనం చూడవచ్చు. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ రాయి అలా ఉండడానికి కారణంగా పలు సిద్ధాంతాల పేర్లను కామెంట్ చేస్తున్నారు. ఆ బండరాయిని గ్రహాంతరవాసులే అలా చీల్చి ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. వేరే గ్రహం నుంచి లేజర్ పాయింటర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారు అని మరికొందరు కామెంట్ చేశారు. ఇదేనా ఆ రహస్యం బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గౌరవ పరిశోధనా సహచరుడు అయిన లూయిస్ ఈ రాయి వెనుక రహస్యాన్ని చేధించినట్లు తెలిపారు. 'ఆ బండరాయి అలా సమానంగా చీలిపోవడానికి కారణం.. ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఆ బండరాయి మీదకు చేరి.. దానికి పగుళ్లు ఏర్పడటంతో అలా సమానంగా చీలిపోయే అవకాశం ఉంటుందని.. దాన్నే ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే బండరాయి ఆ రకంగా సగానికి చీలే ప్రక్రియకు కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. లెవిస్ చెప్పిన విషయాన్ని కొందరు నమ్మినా.. మరికొందరు మాత్రం… ఏదో హైయ్యర్ టెక్నాలజీని ఉపయోగించి.. ఆ బండరాయిని అలా సమానంగా చీల్చారని కొందరు చెబుతున్నారు. చదవండి: Old Couple Love story: డేటింగ్ యాప్లో పరిచయం.. 70 ప్లస్లో ప్రేమ.. ఆపై పెళ్లి -
అలా క్యూట్గా చూడకు ‘బుట్టబొమ్మ’.. మతి పోతుంది
-
వాట్సాప్లో ఆయన మార్ఫింగ్ ఫొటో వైరల్
Subhas Chandra Bose Morphing Photo Viral: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన సుభాష్ చంద్రబోస్ మరణం.. నేటికి ఓ వీడని మిస్టరీనే. 1945, ఏప్రిల్ 23న జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని ప్రకటనలు వెలువడినప్పటికీ.. అవశేషాలు దొరకకపోవడంతో ఆయన మరణం అధికారికంగా ధృవీకరణ కాలేదు. అయితే ఆ క్రాష్లో ఆయన చనిపోలేదని చాలాకాలం జీవించే ఉన్నారని చెబుతూ రకరకాల కథనాల్ని ప్రచారం చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ ఫొటో, దాని మీద సందేశం.. ఆయన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. Original picture with some reimagination by @BiplabC2.#Netaji #DeathThatWasnt #TheBoseMystery #Gumnaami @prosenjitbumba @srijitspeaketh @chandrachurg @PanickarS @koushikzworld @SayakSen6 @Sayani_Pandit pic.twitter.com/ep8T70g6Uj — Anuj Dhar (@anujdhar) August 18, 2019 విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారనే వార్త కాంగ్రెస్ ఆడిన అబద్ధమని, తన మరణం మీద వచ్చిన వార్తను ఓ పత్రికలో బోస్ చదివారంటూ సదరు ఫొటో వైరల్ అవుతోంది. అయితే 2019లో ఇదే ఫొటో ఓ బంగ్లా వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్లో వైరల్ అయ్యింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్లో ఆ ఫొటోపై అసలు విషయం తేలింది. ఆ సమయంలో జపాన్లో ప్రధాన పత్రికగా ఉన్న ఇంగ్లిష్ పత్రిక నిప్పన్ టైమ్స్ను బోస్ చదువుతుండగా తీసిన ఫొటో అది. Subhas Chandra Bose reading Nippon Times (now The Japan Times), Japan's largest and oldest English-language daily newspaper @japantimes pic.twitter.com/6A7YMXGEkW — Anuj Dhar (@anujdhar) May 27, 2018 మే 27, 2018లో అంజుధార్ అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ విషయం ధృవీకరించడం జరిగింది. అంతేకాదు 2019లో బిప్లబ్సీ2 అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ మార్ఫింగ్ ఫొటో వైరల్ అయ్యిందని అంజుధార్ బయటపెట్టాడు కూడా. ఆ తర్వాత ట్విటర్ ఆ అకౌంట్ను తొలగించింది. ప్రస్తుతం కాంగ్రెస్ను బద్నాం చేసేలా ఆ మార్ఫింగ్ ఫొటోనే వాట్సాప్లో వైరల్ అవుతోంది. చదవండి: బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ -
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే!
లక్నో: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్లోని ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే ఈయన ఇటీవల రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతూ ఉన్న ఒక ఫోటోను తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో అప్పటి నుంచి ఈ ఫోటో నెట్టింట్టా హల్చల్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక ఉన్నత అధికారి అయి ఉండి ఇలా సామాన్యుడిలా రోడ్డుపై కూరగాయలమ్మడాన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! అయితే తాజాగా ఈ ఫోటోపై సదరు ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా స్పందించారు.. కూరగాయలు దుకాణం వద్ద కూర్చున్న ఫోటో నిజమే.. కానీ తాను కూరగాయలు అమ్మలేదని, కొనుగోలు చేయడానికి మార్కెట్కు వెళ్లానని స్పష్టం చేశారు. ‘నేను వృత్యిరీత్యా ప్రయాగ్రాజ్కు వెళ్లినప్పుడు, అక్కడ మార్కెట్లో ఆగి కూరగాయలు కొన్నాను. అయితే కూరగాయలు అమ్మే ఓ ముసలామే కాసేపు ఆమె కూరగాయల షాప్ వద్ద కూర్చోవాలని అడిగింది. దీంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆమె అడిగినదానికి కాదనలేకపోయా. అక్కడే కాసేపు కూర్చున్నాను. ఈ లోగా కొందరు అక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫోన్ ద్వారా ఫేస్బుక్లో పెట్టారు. నేను కూడా ఆ ఫోటోను ఈ రోజే చూశాను’ అని అఖిలేశ్ మిశ్రా వివరించారు. చదవండి: పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్!