చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్‌

Viral Photo: Woman Tying Rakhi To An Injured Leopard - Sakshi

అందరూ రాఖీ పండుగను తమ సోదరులకు తమ ప్రియమైన వ్యక్తులకు కట్టి సెలబ్రేట్‌ చేసుకుంటారు. మరికొంతమంది మనల్ని రక్షించే రక్షక భటులకు కట్టడం వంటివి చేస్తుంటారు. ఒక్కొకరు ఒక్కో పద్ధతిలో తమకు నచ్చిన రీతిలో ఈ పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. కానీ ఇక్కడొక మహిళ మాత్రం ఏకంగా చిరుతకే రాఖీ కంటే తన గొప్ప మనసుని చాటుకుంది.

ఏం జరిగిందంటే...చిరుతకి రాఖీ కట్టడమా! అని ఆశ్యర్యపోకండి. ఔను రాజస్తాన్‌లోని ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. అనారోగ్యానికి గురైన చిరుత పులిని అటవీ శాఖకు అ‍ప్పగిస్తూ ఆ చిరుతకు రాఖీ కట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద శుక్రవారం ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

ఆయన భారతీయులు జంతువుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తూ వాటితో సామరస్యంగా ఉంటారని క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారు. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అయింది. ప్రపంచం మానువులకు మాత్రమే కాదని దేవుడు అన్ని రకాల జంతువులను సృష్టించాడని ఒకరు, వన్యప్రాణుల పట్ల మహిళలా ప్రేమగా వ్యవహరించాలని మరోకరు సదరు మహిళను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top