సాక్షి, విశాఖ: ఏపీ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఏపీని నైరుతి రుతుపవనాలు తాకినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. దీంతో, రాయలసీమలో రుతుపవనాలు వేగంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. కాగా, ఈనెల 15వ తేదీ నాటికి ఏపీ అంతట రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది.


