భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధనౌక చేరనుంది. స్వ దేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ వార్షిప్ విశాఖపట్నంలో నేడు జలప్రవేశం చేయనుంది. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, రాడార్కు సులభంగా చిక్కని సాంకేతికత, గాల్లోకి, ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక యాంటీ–సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాలు ఈ యుద్ధనౌక సొంతమని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.


