విశాఖపట్నం : ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం తన నూరేళ్ల వైభవాన్ని రంగుల హరివిల్లుగా తీర్చిదిద్దింది. బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా సాగుతున్న ‘కళా సెంటినియల్ సాగా’ చిత్రకళా ప్రదర్శన.. సృజనకూ, శిల్పానికీ ప్రాణం పోసింది. ప్రముఖ చిత్రకారుడు ఆచార్య జి. రవీందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదర్శనలో.. దారు శిల్పాలు ప్రకృతి పరవశాన్ని చాటుతుంటే, ఆయిల్ పెయింటింగ్స్ సామాజిక చిత్రాలను కళ్లకు కడుతున్నాయి.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


