జనాభా ఆధారంగా పునర్విభజన
కార్పొరేషన్లలో 60 నుంచి 120 డివిజన్లు
నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 23 నుంచి 52 వరకు వార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. జనాభా సంఖ్య ఆధారంగా కార్పొరేషన్లలో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డులను విభజించనున్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీని ప్రకారం నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52 మధ్య, కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లు ఉండాలని నిర్ణయించారు. చివరి సారిగా జరిగిన జనాభా లెక్కల ఆధారంగా వార్డుల విభజన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, దేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కించారు.


