అప్పన్న సన్నిధిలో బైకర్‌ చిత్ర బృందం | - | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో బైకర్‌ చిత్ర బృందం

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం సినీ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ మాళవిక నాయర్‌ దర్శించుకున్నారు. తాము నటించిన బైకర్‌ సినిమా విజయవంతం కావాలని స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభానికి మొక్కుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు అందజేశారు.

కప్పస్తంభానికి మొక్కుకుంటున్న హీరో శర్వానంద్‌,

హీరోయిన్‌ మాళవిక నాయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement