
మైనర్పై యువకుని దాడి
పెదగంట్యాడ: మండలంలోని శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన స్వల్ప వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య ఘర్షణ అనంతరం, ఓ యువకుడు మరో బాలుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనకు సంబంధించి న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీవీఎంసీ 74వ వార్డు పరిధిలోని టీజీఆర్ నగర్కు చెందిన మైనర్, భారత్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో మైనర్ తన స్నేహితులు గణేష్, మణిదీప్, వేణు మాధవ్ , లోకేష్తో కలిసి దయాల్నగర్ కొండపై మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో పెదగంట్యాడకు చెందిన వడ్డి శ్రీరామ్ తన స్నేహితులతో అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాల వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు గంట తర్వాత, రాత్రి 9.30 గంటల సమయంలో మైనర్ తన స్నేహితులతో కలిసి మొల్లివానిపాలెం వెళ్లాడు. అక్కడ ఒక పాన్ షాపు వద్ద ఉండగా, శ్రీరామ్ తన స్నేహితులతో తిరిగి వచ్చి మైనర్పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మెడ , చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్నేహితులు అతడిని గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మైనర్ చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వడ్డి శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చాకుతో గొంతుకోసిన వైనం