బలహీనపడిన వాయుగుండం | Rains In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బలహీనపడిన వాయుగుండం

Jun 2 2025 6:01 AM | Updated on Jun 2 2025 6:01 AM

Rains In Andhra Pradesh

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. నాలుగు రోజులుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా వేగంగా విస్తరించేందుకు ఇది దోహపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం బలహీనపడడంతో వర్షాలు కొద్దిమేర తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు విజయనగరం, వైఎస్సార్‌ కడప, నంద్యాల, అనకాపల్లి, తూర్పు గోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా గుర్ల, వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్‌.మైదుకూరులో 24 గంటల వ్యవధిలో 8.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement