
సెలబ్రిటీలు అంటే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కొందరు మాత్రం పదేపదే నోరు పారేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు. నటుడిగా ఈయన్ని వంక పెట్టాల్సిన పనిలేదు. అన్ని రకాల భావోద్వేగాల్ని అవలీలగా పండించేస్తుంటారు. కానీ స్టేజీ ఎక్కితే మాత్రం నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే అలీపై ఓ బూతు పదాన్ని ఉపయోగించారు.
ఈ మార్చిలో 'రాబిన్ హుడ్' సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్ని 'దొంగ *** కొడకా' అని అన్నాడు. అప్పుడు ఆ విషయం పెద్ద రచ్చ కావడంతో తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అదే రాజేంద్ర ప్రసాద్ మరోసారి స్టేజీపై అందరి ముందు నోరు జారాడు.
(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్లో ఆదివారం నిర్వహించారు. కృష్ణారెడ్డితో కలిసి పనిచేసిన చాలామంది టాలీవుడ్ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్.. అక్కడే ఉన్న కమెడియన్ అలీపై నోరు పారేసుకున్నాడు. బయటకు చెప్పలేని ఓ బూతు పదాన్ని అతడిపై ఉపయోగించాడు.

'మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు. రాకుంటే మిస్ అయ్యేవాడిని. ఏరా అచ్చెన్నా.. మన ఇద్దరం బయటకు వెళ్లాక నీ సంగతి చెప్తా. ఇది మా ఇద్దరికీ అలవాటే. అలీగాడు ఎక్కడున్నాడు *** *** ఇది మనకు కామన్. నేను నిన్న ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్లాను. ఏంటి మీరు చప్పట్లు కొట్టరా? ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవడానికి వెళ్తే కొట్టరా? బ్రెయిన్ పోయిందా మీ అందరికీ.. నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా.. కొట్టకపోతే మీకు సిగ్గు లేనట్లే' అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్)