-
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు' అన్నారు పెద్దలు. 'ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి' అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి శరవేగంగా తాజాగా 'లగ్గం' టాకీ పార్ట్ పూర్తయింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు సంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను తీసినట్లు తెలుస్తోంది. చరణ్ అర్జున్ సంగీతమందించారు. 'బేబి' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ గురించి చెబుతారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
కుటుంబ కథాచిత్రం
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ఎన్జీ సినిమాస్పై హెచ్ మహాదేవ గౌడ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఉదయ్ శర్మ మాట్లాడుతూ–‘‘రేషన్ కార్డులాగా ఉన్న ఫస్ట్ లుక్కి చాలా మంచి స్పందన వచ్చింది. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ఎంతో మంది సీనియర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మగారి మ్యూజిక్ హైలెట్’’ అన్నారు. ‘‘సఃకుటుంబానాం’ మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహాదేవ గౌడ్. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి. -
తెలంగాణ పెళ్లి బ్యాక్డ్రాప్తో సినిమా.. శరవేగంగా షూటింగ్
సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. 'భీమదేవరపల్లి బ్రాంచి' మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారని ఈ దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్గా నటించారు. రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. "ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయి. అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. (ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) -
కొత్త పాయింట్తో తీశారనిపిస్తోంది
విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో..’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కలియుగం పట్టణంలో..’ టైటిల్ కొత్తగా ఉంది. కొత్త పాయింట్తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. నా ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు. ఇప్పుడు హీరోగా నటించాడు. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ను మిక్స్ చేసి ఈ సినిమా తీశారు. చిత్రా శుక్లా ఓ స్పెషల్ రోల్ చేశారు’’ అన్నారు విశ్వ కార్తీకేయ. ‘‘మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమాకాంత్ రెడ్డి. ‘‘మా టీజర్, ట్రైలర్ను చూసి కథను అంచనా వేయలేరు. సినిమా అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణను కడపలోనే చేశాం’’ అన్నారు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి. ‘‘సినిమా అంతా కడపలోనే తీయడం ఇదే తొలిసారి. కడప నుంచి ఓ మంచి నిర్మాత రాబోతున్నాడు’’ అన్నారు దర్శకుడు నీలకంఠ. -
కల్కి ప్రాజెక్ట్లో టాలీవుడ్ సీనియర్ నటుడు.. ప్రభాస్తో తొలి సినిమా
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్లో ఇప్పటికే టాప్ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో పరకాయప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడ్ని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్తో కూడా రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం
‘ఈ ప్రపంచం మన ప్రేమని తిరస్కరిస్తే.. ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘అందరూ నన్ను ఏడిపించినవాళ్లే.. కానీ, నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు ‘లవ్ @65’ మూవీ ట్రైలర్లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్ @65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన పల్లి ముఖ్య పాత్రలు పోషించగా, సునీల్, అజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా శుక్రవారం ట్రైలర్ని విడుదల చేశారు. ‘రాత్రి ఇక్కడి నుంచి ఇద్దరు మిస్ అయిపోయారు సార్’, ‘ఎవరు’, ‘మా కావేరి సార్.. మా ఆది సార్’, ‘ఎలా మిస్సయ్యారు’, ‘వాళ్లు లేచిపోయారు సార్’, ‘ఇద్దరూ మేజర్లా’, ‘కాదు సార్.. ఆయనకి డెబ్బై నిండాయి.. ఆవిడకి ఓ అరవైఐదు దాక ఉంటాయి’.. వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ తుమ్మలపల్లి, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఆ సినిమా తరువాత అంత గొప్ప పాత్ర ఇదే: రాజేంద్ర ప్రసాద్
సాయి రోనక్, గనవి లక్ష్మణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'లగ్గం'. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నచెప్పాల రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సుభిశి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ...'లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర చేస్తున్నా. నా కెరీర్లో పెళ్లి పుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం మరో విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ ఈ కథనాలు కనెక్ట్ అవుతాయి. మొత్తంగా లగ్గం విందు భోజనం లాంటి సినిమా' అని అన్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు. రెండు మనసులు కలవడం అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నాం అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ల లగ్గాన్ని గుర్తు చేస్తుంది. పెళ్లి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి
ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు వెండితెరపై మెరిశాయి. ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబూమోహన్- సౌందర్య కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. కానీ ఒక కమెడియన్తో సాంగ్ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబూ మోహన్తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు. 'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ నాపట్ల రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ తక్కవ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఫైనల్గా రాజేంద్ర ప్రసాద్తో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే, ఎడిటర్ను రిక్వెస్ట్ చేసి, మొత్తం ఒకే రీల్గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతటితో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహన్తో సాంగ్ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహన్తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్, సౌందర్యతో పాట తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొందరి మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్ తీసేందుకు రాజేంద్రప్రసాద్ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవసరం లేదని, ఇప్పటికే బాబూమోహన్కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్రప్రసాద్ షూటింగ్ స్పాట్ వద్దకు రావొచ్చని, చూసి వెళ్లొచ్చని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో అన్నారు. కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణారామా మా ఇంట్లో పుట్టిన కథే – దర్శకుడు రాజ్ మదిరాజు
‘‘ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. దీంతో ఒంటరి తనంగా భావించిన తల్లిదండ్రులు తమ మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. మా తల్లి దండ్రులు కూడా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఫేస్ బుక్లోకి వచ్చారు. ఒక విధంగా ‘#కృష్ణారామా’ కథ మా ఇంట్లో పుట్టిందే’’ అని దర్శకుడు రాజ్ మదిరాజు అన్నారు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో అనన్య శర్మ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘‘#కృష్ణారామా’. అద్వితీయ మూవీస్పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమా ఆదివారం నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ– ‘‘మన తల్లిదండ్రులు రిటైర్ అయిపోతే వాళ్ల జీవితమే అయిపోయిందనే భావనలోకి వెళ్లిపోతున్నాం. కానీ, వారి అనుభవం సమాజానికి ఎంతో అవసరం అని మా సినిమా ద్వారా చెబుతున్నాం. ఒక డైరెక్టర్గా నా పనిని నేను ఇష్టపడతాను. నటుడిగా నా పరిధిలోనే ఉంటాను.. డైరెక్టర్స్కి సలహాలు, సూచనలు ఇవ్వను. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. డైరెక్టర్గా రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
ఇళయరాజాతో నా అనుబంధం: రాజేంద్ర ప్రసాద్
-
నా చిన్నప్పుడే మా అమ్మ వదిలేసి వెళ్లిపోయింది..!
-
చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమే నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్
కామెడీ హీరోగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. కామెడితో హీరోయిజం కూడా పండించొచ్చని నిరూపించిన ఏకైక నటుడు ఆయన. ఇప్పుడంటే చాలా మంది కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు కానీ.. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఒక్కరే కామెడీ హీరో. నవ్వుల రారాజుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 ఏళ్లుగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నట కిరీటీ సపోర్టింగ్ యాక్టర్గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తెరపై నవ్వులు పూయించిన ఈ సీనియర్ హీరో.. రియల్ లైఫ్లో మాత్రం చాలా కష్టాలు అనుభవించాడట. తాజాగా ఆయన ఓ టీవీ షోలో పాల్గొని..తన చిన్ననాటి కష్టాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను అమ్మకోసం ఎదురుచూస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. రోజు అమ్మకోసం ఏడ్చేవాడిని. ఒకనొక దశలో చనిపోయే స్టేజ్కి వచ్చాను. అప్పుడు నా పరిస్థితి చూసి..మా ఇంట్లోవాళ్లు కనక దుర్గమ్మ గుడికి తీసుకెళ్లారు. అమ్మవారిని చూపిస్తే.. ఇకపై ఈమే నీ అమ్మ అని చెప్పారు. అమ్మ బయటకు రాదు..ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ కనకదుర్గమ్మనే అమ్మగా భావించి పెరిగాను’ అని చెబుతూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. రాజేంద్ర ప్రసాద్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘#కృష్ణారామా’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమి కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 22న ప్రముఖ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. -
నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ ఇది
రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రధారులుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘#కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో ఓ రిటైర్డ్ ఓల్డ్ పెయిర్ కోణంలో సాగే చిత్రం ఇది. అన్ని తరాల ప్రేక్షకులకు తగ్గట్లుగా నటించే అవకాశాలు నాకు వస్తుండటం నా అదృష్టం. ఈ తరానికి చెందిన కథ ఇది. నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్’’ అన్నారు. ‘‘మోడ్రన్ సబ్జెక్ట్తో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు గౌతమి. ‘ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు రాజ్ మదిరాజు. -
అన్నపూర్ణ స్టూడియో ఉంది అంటే దానికి కారణం నాగేశ్వరరావు గారు
-
భయపెడుతున్న 'ఎర్రచీర' మోషన్ పోస్టర్
పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన హర్రర్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రం ఎర్రచీర. నవంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. రాఖీ పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ గమనిస్తే సినిమాలో భారీ తారాగణంతో సమానంగా ఎర్రచీర ఎలాంటి ముఖ్యపాత్ర పోషించిందో ప్రేక్షకులకు తెలియచేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని ఈ చిత్రం చూస్తున్నంతసేపు హర్రర్ సీన్స్ తో థ్రిల్లింగ్ ఉంటుందని, మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్గా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ ఎర్ర చీర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి అంటే నవంబర్ 9న సినిమాని థియేటర్స్లో చూడాల్సిందే అని ఆయన అన్నారు. ఈ సినిమాలో Eight Layers వారి VFX తో కళ్లుచెదిరే 36 నిమిషాల గ్రాఫిక్స్ తో, మంచి నిర్మాణ విలువలతో నిర్మించబడినదని నిర్మాతలు NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు. ఎర్రచీర సినిమాలో ప్రధాన పాత్రగా శ్రీరామ్, కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, అలీ, రఘుబాబు, గీతాసింగ్, అన్నపూర్ణమ్మ, తదితరులు నటించారు. -
చంద్రయాన్లో మనోళ్లు..
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా)/ఒంటిమిట్ట/విజయనగరం అర్బన్/రాజంపేట టౌన్ : పున్నమి చంద్రుడి సొగసు చూస్తూ మురిసిపోయిన భారతావని.. ఇప్పుడా నెలరాజుపై పరిశోధనలకు ల్యాండర్ విక్రమ్ను దింపి విజయగర్వంతో ఉప్పొంగుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా చేసింది. ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో మన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలూ ఉన్నారు. వీరిలో చిత్తూరుకు చెందిన కె. కల్పన, వైఎస్సార్ కడప జిల్లా యువతి అవ్వారు చందన.. విజయనగరానికి చెందిన డా. కరణం దుర్గాప్రసాద్.. రాజంపేటకు చెందిన ఎర్రబాలు రాజేంద్ర ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే.. చిత్తూరుకు చెందిన కె. కల్పన ప్రముఖ పాత్ర పోషించడం తెలుగు వారికి గర్వకారణం. ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయిన వెంటనే బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్టులో ఆమె అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ల్యాండర్ను సేఫ్గా దించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి.. మధురమైన జ్ఞాపకమన్నారు. ఈ ప్రయోగం సక్సెస్తో కల్పనకు ప్రత్యేకమైన గౌరవం లభించడమే కాక తెలుగుజాతి మొత్తం ఆమెకు అభినందనలు తెలియజేస్తోంది. మిగిలిన ముగ్గురూ చంద్రయాన్–3లో తమ అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.. థర్మోఫిజికల్ లీడ్స్లో ఒకడిని.. అహ్మదాబాద్లోని అంతరిక్షం ఇస్రో విభాగమైన ఫిజికల్ రీసెర్చ్ లా»ొరేటర్ (పీఆర్ఎల్)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. చంద్రయాన్–1 నుంచి ప్రస్తుత చంద్రయాన్–3 వరకు పనిచేసిన అనుభవం ఉంది. చంద్రుని ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం (సీహెచ్ఏఎస్టీఈ) అనే పరికరం లీడ్స్లో నేను ఒకడిని. ఇదొక థర్మామీటర్లా పనిచేస్తుంది. చంద్రుని మొదటి ఉపరితలం సీటు థర్మల్ ప్రొఫైల్ను అందించేందుకు చంద్రుని ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. చంద్రునిపై నీటి ఉనికి, స్థిరత్వం, చలనశీలతను నిర్దేశించే ప్రయోగం ఇది. భవిష్యత్తులో చంద్రుని అన్వేషణలో ముఖ్యమైన అంశం అయిన నీరు–మంచు, ఇతర వనరుల స్థిరత్వ మండలాల గురించి చెప్పే ముఖ్యమైన ప్రయోగం చంద్రయాన్–3. – డాక్టర్ కరణం దుర్గాప్రసాద్, విజయనగరం మాటల్లో వర్ణించలేని ఆనందమిది.. చంద్రయాన్–3 ప్రయో గం జరుగుతున్న తరుణంలోనే నేనూ సైంటిస్ట్ అయ్యి ఈ ప్రయోగంలో భాగస్వామ్యం కావడం, అలాగే చంద్రయాన్–3 విజయవంతం కావ డం మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని ఇస్తోంది. విక్రమ్ ల్యాండర్ చందమామకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఉత్కంఠభరితమైన క్షణాలను గడిపాం. చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్గా ల్యాండ్ అయిన క్షణం నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ ప్రయోగం నా జీవితంలో మరచిపోలేని ఓ తీపిగుర్తు. నేను ఎంటెక్ పూర్తిచేశాక హైదరాబాద్లోని క్వాల్కం కంపెనీ తమ సంస్థలో ఉద్యోగం ఇ చ్చేందుకు రూ.43 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చింది. అయితే, తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించా. ఆ తరువాత తన అడుగులు శా స్త్రవేత్తగా ఈ రంగంపై పడ్డాయి. అన్నమ య్య జిల్లా రాజంపేట మండలం దిగువ బసినా యుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వై.సుబ్రమణ్యంరెడ్డి, చ ంద్రకళ.. రాజేంద్రప్రసాద్రెడ్డి తల్లిదండ్రులు. – ఎర్రబాలు రాజేంద్ర ప్రసాద్రెడ్డి, రాజంపేట ఇది చిన్నప్పటి కల.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్తమాధవరం మా స్వగ్రామం. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో హైదరాబాద్ వారు నిర్వహించిన యంగ్ సైంటిస్ట్ కార్యక్రమంలో ప్రతిభ చూపడంతో శాస్త్రవేత్తగా ఎదిగేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్లో ఉపకార వేతనం లభించింది. కడపలోని అంబేద్కర్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ డీఏఐడీ పూర్తిచేశాను. విజయవాడలో డీఎస్సీ శిక్షణ తీసుకున్న అనంతరం ఇస్రో పరీక్షలకు సిద్ధమై ఎంపికయ్యాను. మూడో స్థానం దక్కింది. తల్లి ఆదిలక్ష్మి, అమ్మమ్మ సాలమ్మల ప్రోత్సాహం మరువలేనిది. ఇస్రోకు ఎంపికైన తర్వాత బెంగళూరు యుఆర్.రావు శాటిలైట్ సెంటర్లో పనిచేస్తున్నాను. అబ్దుల్ కలాం స్ఫూర్తితో రాకెట్ లాంచ్ అంశంపై అవగాహన పెంచుకున్నా. చంద్రయాన్–3 డిజైనర్గా నేను భాగస్వామి కావడం నాకు ఆనందంగా ఉంది. ఇది నా చిన్నప్పటి కల. మరిన్ని విజయాల్లో నేనూ భాగస్వామి కావాలని ఉంది. – చందన, కొత్త మాధవవరం, ఒంటిమిట్ట మండలం -
రాజేంద్రప్రసాద్ అరుదైన ఫోటోలు.. చూశారా?
-
నా బిడ్డకు ఓ తండ్రిగా ఉపకారం కంటే అపకారం ఎక్కువ చేశా..
-
ఆత్రేయ గారు చేసే పనులకు కడుపు కాలిపోయేది.. పాటలు రాయమంటే ఏసీ రూమ్లో గురక పెట్టి పడుకునేవాడు..
-
ఆ ఘనత ఎన్టీఆర్కే చెల్లింది: రాజేంద్ర ప్రసాద్
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావు సొంతమని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని... "కలయిక ఫౌండేషన్" అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేసింది. రెండు విభాగాల్లో ప్రథములుగా నిలిచినవారికి లక్ష రూపాయల చొప్పున బహూకరించి, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి - విశ్రాంత హోమ్ సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఆదాయపన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బృహస్పతి టెక్నాలజీస్ ఎమ్.డి రాజశేఖర్, సిఎస్.బి. ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ బాల లత అతిధులుగా పాల్గొని... "కలయిక ఫౌండేషన్" అధినేత చేరాల నారాయణను అభినందించారు. ఈ సందర్భంగా చేరాల నారాయణ అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ విజేతలకు అభినందనలు తెలిపారు. చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి: రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్ -
నా పెళ్లి దగ్గరుండి చేసాడు
-
ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. అంకితభావం గల నటుడు: నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) శరత్బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు. -
30 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్స్.. ఇన్నేళ్లు పట్టిందిలా
కొన్ని కాంబినేషన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. అయితే కొన్ని కాంబినేషన్స్ రిపీట్ కావడానికి దశాబ్దాలు గడిచిపోతాయి. ఇలా మూడు దశాబ్దాల తర్వాత రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్లో రూపొందుతున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రజనీకాంత్, జాకీ ష్రాఫ్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 36 ఏళ్లు పట్టింది. 1987లో ప్రభాత్ ఖన్నా దర్శకత్వంలో వచి్చన హిందీ చిత్రం ‘ఉత్తర్ దక్షిణ్’లో రజనీకాంత్, జాకీ ఫ్రాష్ లీడ్ రోల్స్ చేశారు. మళ్లీ ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు తమిళ చిత్రం ‘జైలర్’లో నటిస్తున్నారు. ‘జైలర్’లో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, జాకీ ష్రాఫ్ కీ రోల్ చేస్తున్నారు. జాకీది నెగటివ్ క్యారెక్టర్ అని సమాచారం. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, శివ రాజ్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్, అర్చన హీరో హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో 1986లో వచ్చిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మళ్లీ 36 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన ‘షష్టిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్పై రూపేష్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ‘లేడీస్ టైలర్’ సినిమాకు స్వరాలు అందించిన ఇళయరాజాయే ‘షష్టిపూర్తి’ చిత్రానికీ బాణీలు సమకూర్చుతుండటం విశేషం. బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా కలిసి నటించిన హిందీ చిత్రం ‘కరణ్ అర్జున్’. హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1995లో విడుదలై ఘనవిజయం సాధించింది. కాగా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘ట్యూబ్ లైట్’, ‘టైగర్ 3’ (విడుదల కావాల్సి ఉంది) చిత్రాల్లో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’, ‘పఠాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. కానీ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా కలిసి నటించలేదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా యశ్ రాజ్ ఫిలింస్ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రూపొందించనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025లో సెట్స్పైకి వెళ్తుందని బీ టౌన్ టాక్. ఈ లెక్కల ప్రకారం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా మరో సినిమా రావడానికి 30 ఏళ్లు పట్టింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ స్టిల్స్
సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
పోలింగ్పై పోస్టుమార్టం..
నాసా ఏరో స్పేస్ ఇంజనీర్గా తొలి భారతీయ యువతి!
Anjali Lavania: పంజా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..! (ఫోటోలు)
ఏలూరులో చల్లారని రగడ...
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement