కొత్త పాయింట్‌తో తీశారనిపిస్తోంది  | Kaliyuga patnamlo Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

కొత్త పాయింట్‌తో తీశారనిపిస్తోంది 

Mar 2 2024 6:02 AM | Updated on Mar 2 2024 6:02 AM

Kaliyuga patnamlo Movie Teaser Launch - Sakshi

ఆయూషీ పటేల్, రాజేంద్ర ప్రసాద్, విశ్వ కార్తికేయ

రాజేంద్ర ప్రసాద్‌ 

విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో..’. రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కలియుగం పట్టణంలో..’ టైటిల్‌ కొత్తగా ఉంది. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. నా ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు.

ఇప్పుడు హీరోగా నటించాడు. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేయాలి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ రోల్‌ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మదర్‌ సెంటిమెంట్, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ను మిక్స్‌ చేసి ఈ సినిమా తీశారు. చిత్రా శుక్లా ఓ స్పెషల్‌ రోల్‌ చేశారు’’ అన్నారు విశ్వ కార్తీకేయ. ‘‘మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమాకాంత్‌ రెడ్డి. ‘‘మా టీజర్, ట్రైలర్‌ను చూసి కథను అంచనా వేయలేరు. సినిమా అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణను కడపలోనే చేశాం’’ అన్నారు కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి. ‘‘సినిమా అంతా కడపలోనే తీయడం ఇదే తొలిసారి. కడప నుంచి ఓ మంచి నిర్మాత రాబోతున్నాడు’’ అన్నారు దర్శకుడు నీలకంఠ.

Advertisement
 
Advertisement
Advertisement