
'షష్టి పూర్తి' సినిమా ట్రైలర్ తాజాగా వచ్చేసింది. మంచి కంటెంట్తోనే ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి 'షష్టి పూర్తి' మూవీలో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మంచి లవ్ ట్రాక్తో పాటు కుటుంబ విలువలకు పెద్ద పీఠ వేసినట్లు ట్రైలర్లో చూస్తే అర్థం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటతో పాటు రూపేష్, ఆకాంక్షా సింగ్ యంగ్ జంటగా మెప్పించనున్నారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది.