
గాదిరాజు ప్యాలెస్లో బ్రాండెడ్ దుస్తుల అమ్మకాలు
ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్న లగ్జరీ బ్రాండెడ్ దుస్తుల అమ్మకాలకు నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. 40 వేలకు పైగా దుస్తులను 90 శాతం తగ్గింపు ధరలతో ఈ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఈ అమ్మకాలు ప్రారంభం కాగా మూడు రోజులపాటు అమ్మకాలు జరగనున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన రెడీమేడ్ దుస్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. కుటుంబం మొత్తానికి అవసరమైన దుస్తులతో పాటు పెళ్లి సీజన్కు అవసరమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయి. జీన్స్, టీషర్ట్స్, లేడీస్ కుర్తాలు, వెస్ట్రన్ వేర్, ఆఫీస్ వేర్, కిడ్స్ వేర్ ఇలా అన్ని తరగతులకు చెందిన ఆకర్షణీయమైన దుస్తులను విక్రయిస్తున్నారు. దీంతో పాటు బ్రాండెడ్ స్పోర్ట్స్ వేర్, ఫుట్వేర్ కూడా అందుబాటులో ఉంది. పురుషులకు రూ.200 నుంచి రూ.1,200 వరకు మహిళలకు రూ.200 నుంచి రూ.800 వరకు, పిల్లలకు రూ.150 నుంచి రూ.600 వరకు ధరల్లో అందిస్తున్నారు. ఈ నెల 28 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ అమ్మకాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.