
కన్ను తెరిచిన గౌరీ శంకరుడు!
అక్కిరెడ్డిపాలెం: గౌరీ శంకరుడు కుడి కన్ను తెరిచాడన్న వార్తా దావానంలా వ్యాపించడంతో ఆటోనగర్లోని స్వయంభూ శ్రీ దుర్గా రామలింగేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఆటోనగర్ బి–బ్లాక్లో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సెల్స్ (బీహెచ్పీవీ) గోడ పక్కన 1997లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం సాయంత్రం ఓ భక్తుడు పూజ చేస్తున్న సమయంలో విగ్రహం కుడి కన్ను స్పష్టంగా తెరుచుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులకు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈ వార్తా దావానంలా వ్యాపించడంతో భక్తులు ఆలయానికి భారీగా క్యూ కట్టారు.