
ఈఏపీసెట్ ఫలితాల్లో ఎసెంట్ విజయకేతనం
మద్దిలపాలెం: ఏపీ ఈఏపీసెట్–2025(ఫార్మా) ఫలితాల్లో ఎసెంట్ మెడికల్ అకాడమీ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారని డైరెక్టర్ ఎం.వి.ఆర్.మురళీకృష్ణ తెలిపారు. విద్యార్థి ఎం.తులసీభార్గవ్ రామ్ రాష్ట్ర స్థాయిలో 69వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు. అలాగే 14 మంది విద్యార్థులు 500 లోపు ర్యాంకులు సాధించి ఎసెంట్ హవాను కొనసాగించారని పేర్కొన్నారు. తమ విద్యార్థులు వరసగా 69, 88, 92, 93, 193, 194, 205, 248, 279, 317, 319, 406, 467, 485 ర్యాంకులతో పాటు 140 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఈ విజయం వెనుక తమ డైరెక్టర్లు, అధ్యాపక బృందం కృషి, పట్టుదల ఉన్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా 69వ ర్యాంకు సాధించిన ఎం.తులసి భార్గవ్ రామ్ను పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.