
నాట్యకళకు తిరిగి ప్రాణం పోసిన వేళ..
చదువుపై దృష్టి సారించే క్రమంలో చిన్నప్పుడు నేర్చుకున్న శాసీ్త్రయ నృత్యానికి దూరమైనా.. దానిపై మమకారం చావలేదు. 2024లో ఓ అవార్డు కార్యక్రమంలో శశిధర్ మాట్లాడుతూ భరతనాట్యం, కూచిపూడి అంటే తనకెంత ఇష్టమో చెప్పిన మాటలు తన జీవితాన్ని కీలక మలుపు తిప్పాయి. ఆ మాటలు విన్న ఎస్కేఎస్ అకాడమీకి చెందిన పక్కి అరుణ్ కుమార్ సాయి.. శశిధర్ను కలిసి తన నృత్య ప్రతిభను ప్రదర్శించమని కోరారు. అతనిలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలా ఏళ్ల క్రితం ఆగిపోయిన నాట్య ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది. గురువు అరుణ్ శిక్షణలో రాటుదేలిన శశిధర్.. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటాడు.

నాట్యకళకు తిరిగి ప్రాణం పోసిన వేళ..