
యువతకు మార్గదర్శిగా ‘జేఆర్డీ ఫ్యాషన్స్’
తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు.
మిస్టర్ కొచ్చి 2021 విజేత
అవార్డులే అవార్డులు
ఇటీవల దుబాయ్లోని పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఎస్కేఎస్ అకాడమీ నుంచి ఎనిమిది మంది నృత్య కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇందులో శశిధర్ ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యానికి ‘యువ ప్రతిభ పురస్కారం’లభించింది. అలాగే శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ నుంచి ‘జాతీయ మహా స్వర్ణ నంది అవార్డు’ను అందుకున్నాడు. 2024లో ‘యాక్టివ్ ఉగాది పురస్కారం’కూడా శశిధర్కు లభించింది.