
ఆచార్య చలంకు అంబేడ్కర్ అవార్డు
విశాఖ సిటీ: యూపీఎస్సీ పూర్వ సభ్యుడిగా, ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా, ఉత్తరాంధ్ర ఉద్యమ నిర్మాతగా తెలుగు వారికి చిరపరిచితులైన ప్రొఫెసర్ చలంకు తమిళనాడు వీసీకే పార్టీ ఇచ్చే డాక్టర్ అంబేడ్కర్ అవార్డు వరించింది. ఏటా డాక్టర్ అంబేడ్కర్, పెరియార్ పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది చలంనకు, ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్య చలం ఏయూ నుంచి జాతీయ స్థాయి రాజ్యాంగ పదవి(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు) పొందిన మొదటి ఆచార్యులు. గతంలో వీసీకే అంబేడ్కర్ అవార్డును తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ప్రదానం చేశారు. ఆచార్య చలం రాసిన పుస్తకాలు మూడు తమిళంలోకి చింతన్ బుక్స్ చైన్నె వారు అనువాదం చేయగా అవి ప్రాచుర్యం పొందాయి. నాలుగో పుస్తకం ఇంగ్లిష్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ సౌత్ ఇండియా ద్రవిడియన్ మార్వెల్ ఇపుడు తమిళంలోకి అనువాదం అవుతోంది. ఆయన ఇప్పటి వరకు ఇంగ్లీష్లో 28, తెలుగులో 14 పుస్తకాలు ప్రచురించారు. రాజకీయాలకు అతీతంగా, దేశ గౌరవాన్ని పెంచే ప్రముఖులకు మాత్రమే ఇచ్చే అవార్డును అందుకోవాలని వీసీకే పార్టీ కార్యదర్శి, ఎంపీ రవికుమార్ విజ్ఞప్తి చేయగా చలం అందుకు అంగీకరించారు. దీంతో వీసీకే వారు శుక్రవారం చైన్నెలో చలంనకు ఈ అవార్డును ప్రకటించారు.
ఆచార్య చలం