
చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి
నవ్వుతూ వెళ్లారు..
డాబాగార్డెన్స్: కనకదుర్గ ఆస్పత్రి వద్ద చంద్రమౌళి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ‘నవ్వుతూ వెళ్లారు. విగతజీవిగా తిరిగి వచ్చి అందరినీ ఏడిపించారు.’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే చంద్రమౌళి అకస్మాత్తుగా తమను విడిచి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ విలపించారు.
సాక్షి, విశాఖపట్నం: జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జరజాపు చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంది. సీఎం చంద్రబాబు ఎయిర్పోర్టులో చంద్రమౌళి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రమౌళి సతీమణి నాగమణి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అనంతరం పార్థివదేహాన్ని మహాప్రస్థానం వాహనంలో జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్న కనకదుర్గ ఆస్పత్రి వద్దకు తరలించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి గురువారం సాయంత్రం నగరానికి చేరుకుంటారు. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు ఉన్నారు.
శాంతి ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి

చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి