
జేఈఈ మెయిన్స్లో ఎసెంట్ విద్యార్థుల సత్తా
మద్దిలపాలెం: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎసెంట్ ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల డైరెక్టర్లు తెలిపారు. కళాశాల విద్యార్థి ఎస్.పూజిత కృష్ణ రిజర్వడ్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు. అలాగే జాతీయ స్థాయిలో వరుసగా 203, 208, 408, 450, 618, 813, 926, 941, 983, 1102, 1322 వంటి టాప్ ర్యాంకులను ఎసెంట్ విద్యార్థులు సాఽధించారని పేర్కొన్నారు. అలాగే అన్ని కేటగిరిల్లో కళాశాలకు చెందిన 31 మంది విద్యార్థులకు 5000లోపు ర్యాంకులు వచ్చాయన్నారు. 204 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని తెలిపారు.