మధ్యాహ్నం నిర్మానుష్యం.. సాయంత్రం కిటకిట | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం నిర్మానుష్యం.. సాయంత్రం కిటకిట

Apr 28 2025 12:51 AM | Updated on Apr 28 2025 12:51 AM

మధ్యా

మధ్యాహ్నం నిర్మానుష్యం.. సాయంత్రం కిటకిట

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో..

సాయంత్రం 5 గంటల సమయంలో..

ఏయూక్యాంపస్‌: నగరంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎండ మంటతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ సమయంలో సాగర తీరం ఖాళీగానే కనిపిస్తోంది. అయితే సాయంత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ సమయానికి వాతావరణం కాస్త చల్లబడటంతో బీచ్‌లకు క్యూ కడుతున్నారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌కు చేరుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలల హోరు వింటూ.. ఇసుకలో సేదతీరారు. దీంతో బీచ్‌ జనాలతో కిటకిటలాడింది. ఆర్‌.కె.బీచ్‌తో పాటు సాగర్‌నగర్‌, రుషికొండ, భీమిలి, యారాడ తదితర బీచ్‌లు కూడా సందడిగా కనిపించాయి.

–ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

మధ్యాహ్నం నిర్మానుష్యం.. సాయంత్రం కిటకిట 1
1/1

మధ్యాహ్నం నిర్మానుష్యం.. సాయంత్రం కిటకిట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement