
క్రికెట్ బెట్టింగ్కి యువకుడి బలి
సీతమ్మధార: క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్కు చెందిన చెక్కల పవన్ (25) ఎంవీపీ కాలనీలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్నాడు. అతనికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉంది. ఐపీఎల్లో బెట్టింగ్ ఆడేందుకు గతంలో లాడ్జి యజమాని వద్ద రూ.30 వేలు తీసుకుని పోగొట్టుకున్నాడు. ఇటీవల అతని వద్ద మళ్లీ రూ.20 వేలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని కూడా కోల్పోయాడు. ఈ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పవన్ ఓ యువతితో ప్రేమ విఫలమైనట్లు కూడా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.