క్రికెట్‌ బెట్టింగ్‌కి యువకుడి బలి | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌కి యువకుడి బలి

Apr 30 2025 12:50 AM | Updated on Apr 30 2025 12:50 AM

క్రికెట్‌ బెట్టింగ్‌కి యువకుడి బలి

క్రికెట్‌ బెట్టింగ్‌కి యువకుడి బలి

సీతమ్మధార: క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ద్వారకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్‌కు చెందిన చెక్కల పవన్‌ (25) ఎంవీపీ కాలనీలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్నాడు. అతనికి క్రికెట్‌ బెట్టింగ్‌ అలవాటు ఉంది. ఐపీఎల్‌లో బెట్టింగ్‌ ఆడేందుకు గతంలో లాడ్జి యజమాని వద్ద రూ.30 వేలు తీసుకుని పోగొట్టుకున్నాడు. ఇటీవల అతని వద్ద మళ్లీ రూ.20 వేలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని కూడా కోల్పోయాడు. ఈ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పవన్‌ ఓ యువతితో ప్రేమ విఫలమైనట్లు కూడా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement