
పర్యాటక రంగంలో రాణిస్తా
రైల్వేన్యూకాలనీలో గల జీవీఎంసీ హైస్కూల్లో ఉన్నత విద్యాభ్యాసం సాగింది. అప్పట్లో అమ్మ ఒడి ద్వారా ప్రోత్సాహం అందింది. పర్యాటక రంగం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వి.ఎస్.కృష్ణా ఓకేషనల్ కళాశాలలో టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్ (టీటీటీ) కోర్సులో చేరాను. ఈ కోర్సులో రాష్ట్ర స్థాయిలో అఽత్యధికంగా 974 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్స్ జాబితాలో నిలిచాను. బీఏ ట్రావెల్ మేనేజ్మెంట్లో చేరాలనుకుంటున్నాను. ఎంబీఏ పూర్తిచేసి సొంతంగా ట్రావెల్ మేనేజ్మెంట్ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను.
–మహేష్ కార్తికేయ, 974 మార్కులు
(టీటీటీ)