
శ్రీవిశ్వ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
సీతంపేట: జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. వివిధ కేటగిరిల్లో తెల్లూరి చరణ్ కార్తికేయ 311 ర్యాంకు, అంజూరి తారక్రామ్ 407, సిహెచ్.వెంకట హేమవర్ధన్ 586, బి.షణ్ముఖ నాయుడు 648, వై.రాజశేఖర్ 688 ర్యాంకులు సాధించారు. వెయ్యిలోపు ర్యాంకులు ఐదుగురు, 5 వేల లోపు ర్యాంకులు 29 మంది, 10 వేల లోపు ర్యాంకులు 47 మంది సాధించారు. మొత్తంగా 247 మంది ఎన్ఐటీ, ఐఐఐటీల్లో సీట్లు పొందే అర్హత తెచ్చుకోవడం విశేషం. విద్యార్థులను చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ అభినందించారు.