
ఏరోస్పేస్ రంగానికి గ్లోబల్హబ్గా ఏపీ
ఏయూక్యాంపస్: ఏరోస్పేస్, రక్షణ, నావికాదళ ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేవ్ గ్లోబల్ హబ్గా మారుతుందని డీఆర్డీవో పూర్వ చైర్మన్, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. సీఐఐ విశాఖ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్తో సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇన్నోవేషన్ క్లస్టర్లు, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్సేస్, నీటిలోపల వ్యవస్థలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ల అభివృద్ధి ప్రాముఖ్యతను తెలిపారు. విశాఖ నగరం నీటిలోపల అవసరమైన ఉపకరణాలు ఉత్పత్తి, ఆవిష్కరణలకు భవిష్యత్ కేంద్రంగా నిలుస్తుందన్నారు. సీఐఐ విశాఖ చైర్మన్ డి.వి.ఎస్.నారాయణ రాజు, ఎస్ఐడీఎం ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ జె.శ్రీనివాస రాజు, రక్షణ రంగ పరిశ్రమల ప్రతినిధులు, విధానాల రూపకర్తలు, సాంకేతిక ఆవిష్కర్తలు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు పాల్గొన్నారు.