
‘మత్స్యకారుల సేవలో’ చెక్కు పంపిణీ
బీచ్రోడ్డు: ‘మత్స్యకారుల సేవలో’ పథకం 2025–26 కింద జిల్లా నుంచి 12,138 మంది లబ్ధిదారులకు రూ.20 వేల చొప్పున రూ.24,27,60,000ను ప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా, ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీసీ హాలు నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు వీక్షించారు. సీఎం ప్రసంగం అనంతరం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ లబ్ధిదారులకు ఈ మొత్తం చెక్కును అందజేశారు. మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.