
ఉక్కు కేబీఆర్లో మహిళ మృతదేహం లభ్యం
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ కణితి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)–1లో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. స్టీల్ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. విశాఖ ఇండస్ట్రీయల్ వాటర్ సప్లయ్ కంపెనీ (విస్కో)లో పనిచేస్తున్న పెందుర్తికి చెందిన బత్తిన పైడిరాజు (38) ఆదివారం ఉదయం గేటు వద్ద మహిళ మృతదేహాన్ని గమనించాడు. వెంటనే అక్కడి అధికారులకు సమాచారం అందించగా వారు స్టీల్ప్లాంట్ పోలీసులకు తెలిపారు. గేటు వద్ద బోర్లా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ముక్కు నుంచి రక్తం బయటకు వస్తుండటం గమనించారు. 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండే ఆ మహిళ ఒంటిపై పసుపు జాకెట్, తెలుపు రంగు పెట్టీ కోట్ ఉంది. 5 అడుగులు ఎత్తు ఉన్న ఆమె కుడి చేతిపై టాటూ ఉంది. వివరాలకు స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.