
వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ పరిశీలకుడిగా కదిరి బా
ఏయూక్యాంపస్: వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలిగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప్రసాద్ నియమితులయ్యారు. వీరు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేస్తారు. అలాగే అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.