
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
మర్రిపాలెం: ఈదుల పూర్ణ చంద్రిక (11) అనే బాలిక వింతగా ప్రవర్తిస్తూ, కేకలు వేస్తూ, పట్టుకుంటే కరవడంతో తల్లి, అమ్మమ్మ ఆమెను అదుపు చేసే ప్రయత్నంలో ముఖానికి గుడ్డ కట్టి, బోర్లా పడుకోబెట్టారు. కొంత సమయానికి బాలిక చలనం లేకుండా మృతి చెందింది. ఊపిరి ఆడకపోవడం వల్ల మృతి చెంది ఉండవచ్చని చర్చి ఫాదర్ తెలిపారు. అయితే, బాలిక మృతిపై తండ్రి మల్లేశ్వరరావు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వెస్ట్ ఏసీపీ జె. పృధ్వీతేజ తెలిపిన వివరాల ప్రకారం, బాలిక 20 రోజులుగా వింతగా ప్రవర్తిస్తుండటంతో దెయ్యం పట్టిందని భావించి తల్లి, అమ్మమ్మ చర్చిల్లో ప్రార్థనలు చేయించారు. గురువారం జ్ఞానాపురం చర్చిలో బాలిక మృతి చెందింది.తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ జి. అప్పారావు, ఎస్సై దివ్యభారతి పాల్గొన్నారు.