
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సబ్బవరం: మండలంలోని గొర్లివానిపాలెం జక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు సత్యవరపు శ్రీనివాసరావు(53) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. శ్రీనివాసరావు సబ్బవరం హైస్కూల్ సమీపంలో జనరల్ స్టోర్ నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం తన స్కూటీపై గోడివాడ వెళ్తుండగా, గొర్లివానిపాలెం సమీపంలో సబ్బవరం నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్ టైర్ కింద ఇరుక్కుపోయి, సంఘటనా స్థలిలోనే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దివ్య తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ను సీజ్ చేసి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించామన్నారు.