
పట్టని ప్రజల గోడు.. అధికారుల తీరు చూడు
బీచ్రోడ్డు: క్షేత్ర స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే ఆశతో సోమవారం కలెక్టరేట్కు చేరుకున్న ప్రజలకు అక్కడ ఎదురైన దృశ్యాలు నిరాశకు గురిచేశాయి. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కొందరు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు వింటుండగా.. హాలులో కూర్చున్న కొందరు ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. సెల్ఫోన్లలో షార్ట్స్, రీల్స్, చివరకు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేశారు. తమ గోడు చెప్పుకోవడానికి ఎంతో ఆశతో వచ్చిన ప్రజలు.. అధికారుల తీరును చూసి నివ్వెరపోయారు. ప్రజా సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి మార్గాలు సూచించాల్సిన ఉన్నతాధికారులు.. ప్రజల సమక్షంలోనే సెల్ఫోన్లకు అతుక్కుపోవడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పట్టింది.
సెల్ఫోన్లలో రీల్స్, సినిమాలు చూస్తూ కాలక్షేపం

పట్టని ప్రజల గోడు.. అధికారుల తీరు చూడు