63 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్‌లో ఇంటర్‌ ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

63 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్‌లో ఇంటర్‌ ఉత్తీర్ణత

Apr 24 2025 8:33 AM | Updated on Apr 24 2025 10:27 AM

-

అగనంపూడి: చదువు పట్ల ఆసక్తి, ఏదైనా సాధించాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించారు పట్టా రామ అప్పారావు. అగనంపూడి నిర్వాసిత కాలనీలోని కొండయ్యవలసకు చెందిన అప్పారావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి ఐదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు కళలతో పాటు విద్యపై మక్కువ ఎక్కువ. 

ఈ ఆసక్తితోనే 63 ఏళ్ల వయసులో ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరై ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. విశేషమేమిటంటే ఆయన 1977లో 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణులై, వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించి విధుల్లో చేరారు. దాదాపు 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసి ఫస్ట్‌క్లాస్‌లో పాసవడం ఆయనకు చదువు పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. చదువుకోవాలనే కోరిక, కృషి ఉంటే వయసు ఎప్పుడూ అడ్డుకాదని పట్టా రామ అప్పారావు నిరూపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement