
గ్రామాల అభివృద్ధికి పంచాయతీలే మూలస్తంభాలు
బీచ్రోడ్డు: గ్రామాల అభివృద్ధికి పంచాయతీలే మూలస్తంభాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకంగా మారిందని, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన అధికారులుగా పంచాయతీరాజ్ ఉద్యోగులు గొప్ప బాధ్యతను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో స్వయం సమృద్ధికి సర్పంచులు, వార్డు సెక్రటరీలు సేవలు అందించాలని సూచించారు. స్వయం శాసనం–గ్రామాల బలోపేతం అనే దృక్పథంతో పంచాయతీలను అభివృద్ధి దిశగా నడిపించాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందుండేందుకు పంచాయతీ ప్రతినిధు లు నిధుల సమీకరణపై దృష్టిసారించాలని సూ చించారు. అనంతరం విశేష సేవలందించిన మోడల్గా నిలిచిన సర్పంచ్లకు జ్ఞాపికలు బహూకరించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ బి.సత్యవతి, డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్, ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.