
నేపాల్లో మిస్సయిన యువతి తుంగ్లాంలో ప్రత్యక్షం
అక్కిరెడ్డిపాలెం: నేపాల్లో తప్పిపోయిన యువతిని గాజువాక పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. సౌత్ ఏసీపీ త్రినాథ్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, నేపాల్లోని కాట్మాండ్కు చెందిన లాల్ బహుదురబన్ కుమార్తె అనూషకబమ్ ఈ నెల 11న కనిపించకుండా పోయింది. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా అనూషకబమ్ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు కాట్మాండ్ పోలీసులు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం అక్కడి ఎస్ఐ అర్జున్, యువతి తండ్రి లాల్ బహుదూర్బమ్తో కలిసి విశాఖ వచ్చి పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చిని కలవగా, ఆయన ఆదేశాల మేరకు గాజువాక సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి.త్రినాథ్ సూచనలతో గాజువాక ఎస్ఐ నజీర్, సిబ్బంది తుంగ్లాంలో అనూషకబమ్ను గుర్తించారు. అనంతరం ఆమెను గాజువాక పోలీస్ స్టేషన్కు తరలించి, ఎస్ఐ నజీర్ అక్కడి ఎస్ఐ అర్జున్ సమక్షంలో ఆమె తండ్రి లాల్ బహుదూర్బమ్కు యువతిని అప్పగించారు.