
రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ ఇ.ఎన్.ధనుంజయరావు వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్, బీహెచ్ఎంసీటీ కోర్సులు చదువుతున్న 51,400 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సెకండ్ సెమిస్టర్ హానర్స్, సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నాల్గో సెమిస్టర్ హానర్స్, సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది.