
కేజీహెచ్ని అభివృద్ధి చేస్తాం
సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్ని అభివృద్ధి చేసి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా మార్చుతామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో పూర్వ విద్యార్థులు నిర్మించిన సెంటనరీ భవనాన్ని శనివారం రాత్రి ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ, విజ్ఞాన పరిశోధన కేంద్రాలను రిమోట్ సాయంతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కేజీహెచ్ అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. కేజీహెచ్లో ప్రత్యేక క్యాన్సర్ బ్లాక్ రాబోతోందన్నారు. వైద్య రంగంలోనూ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరగాలని సూచించారు. మెడిసిన్ చదువుకున్న వారు కూడా పీజీకి అనుబంధంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులు కలిసికట్టుగా తాము చదివిన కళాశాలలను అభివృద్ధి చేస్తుండటం ప్రశంసనీయమన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏఎంసీ అభివృద్ధి చెందాలని సూచించారు. ఆన్లైన్ విధానంలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే వ్యవసను తీసుకొచ్చేందుకు ప్రతి వైద్యుడు కృషి చెయ్యాలని చంద్రబాబు అన్నారు. మంత్రులు డోలా బాలా వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, సత్యకుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సెంటనరీ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు