
రెవెన్యూ అంశాలపై అవగాహన ముఖ్యం
బీచ్రోడ్డు: రీ–సర్వే ప్రక్రియ, ఇతర రెవెన్యూ సంబంధి అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే విధి నిర్వహణ సజావుగా సాగుతుందని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అన్నారు. సర్వే–ల్యాండ్ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో గురువారం ఒక్కరోజు వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా జేసీ రెవెన్యూ సంబంధిత అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రజా వినతుల పరిష్కారం, చర్యలు, రీ–సర్వే ప్రక్రియ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై అప్డేట్ అవ్వాలన్నారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, సర్వే విభాగం సహాయ సంచాలకులు సూర్యారావు, పలువురు తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు.