సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు

Apr 25 2025 1:07 AM | Updated on Apr 25 2025 1:07 AM

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా  వ్యవహరిస్తున్నారు

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు

టీసీఎస్‌ కంపెనీకి రుషికొండ ప్రాంతంలో విలువైన భూములను అతి తక్కువ లీజుకు ధారాదత్తం చేయడం ప్రజాప్రయోజనాలకు, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు ముమ్మాటికీ విరుద్ధమే. రుషికొండలో రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం చదరపు గజం రూ.30 వేలు ఉంది. మార్కెట్‌ ధర అంతకంటే ఎక్కువ ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ విలువ తీసుకున్నా 21.16 ఎకరాల భూమి రూ.320 కోట్లు మించి ఉంటుంది. అటువంటి భూమిని కేవలం 99 పైసలకు ఇవ్వడం హాస్యాస్పదం. రాష్ట్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన జీవో నెంబర్‌ 571 ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్‌ విలువ మీద 10 శాతం కంటే తక్కువకు ప్రైవేట్‌ సంస్థలకు వార్షిక లీజుల కింద ఇవ్వకూడదు. ప్రైవేటు సంస్థలకు మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రమ్‌, ఇతర కేసుల్లో అనేక సార్లు ఆదేశాలు జారీ చేసింది. కానీ టీసీఎస్‌కు అతి చవక ధరకు ప్రభుత్వ భూమిని ఇవ్వడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది.

– ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement