
వైశ్యరాజుజ్యుయలర్స్లో 18 క్యారెట్ బంగారం
విశాఖ సిటీ: బంగారం ధరలు పెరిగిన వేళ ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో బంగారు ఆభరణాలు అందించాలన్న లక్ష్యంతో 18 క్యారెట్ గోల్డ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఆశీల్మెట్టలో ప్రారంభించినట్లు వైశ్యరాజ్ జ్యుయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజ్ భద్రగిరి పేర్కొన్నారు. ఈ షోరూం గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్లను వినయగర్ ప్యారడైజ్ భాగస్వాములు లగడపాటి కిరణ్కుమార్, మంత్రి శేషగిరి, మూడో ఫ్లోర్ను జామి నగేష్ ప్రారంభించినట్లు తెలిపారు. వినూత్నమైన డిజైన్లు, అత్యధిక కలెక్షన్లతో 18 క్యారెట్ బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దేశంలోనే ప్రథమంగా 18 క్యారెట్ ఎక్స్క్లూజివ్ షోరూం తమదే అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్గా 18 క్యారెట్ జ్యుయలరీపై తరుగు(వీఏ) 6శాతం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైశ్యరాజు జ్యుయలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు, సంస్థ డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్, వైశ్యరాజు కిరణ్కుమార్, అధిక సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు.