
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ఆర్చ్ బిషప్ సంతాపం
డాబాగార్డెన్స్: పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల విశాఖపట్నం ఆర్చ్ బిషప్ ఉడుమల బాలశౌరిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పోప్ మరణం చర్చ్, సమాజానికి తీర ని నష్టమన్నారు. పోప్ తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాపసీ ప్రతిరూపాన్ని మార్చిన వినయపూర్వక నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. ఉక్రెయిన్–రష్యా, ఇజ్రాయిల్–పాలస్తీనాలో శాంతిని స్థిరంగా సమర్థించారని పేర్కొన్నారు. 2013లో పోప్ ఫ్రాన్సిస్ నియమించిన మొదటి భారతీయ బిషప్ తానేనని, ఇటీవల పోప్ తనను విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా కూడా నియమించారని తెలిపారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయిన తర్వాతి నెలలో కార్డినల్స్ సమావేశం నిర్వహించి కొత్త పోప్ను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.