చౌక బేరం | - | Sakshi
Sakshi News home page

చౌక బేరం

Apr 25 2025 1:07 AM | Updated on Apr 25 2025 1:07 AM

చౌక బ

చౌక బేరం

● విశాఖలో రూ.99 పైసలకే ఎకరా
భలే మంచి
● ఎకరం 99 పైసలకు టీసీఎస్‌కి కట్టబెట్టిన కూటమి సర్కారు ● అక్కడ ఎకరం రూ.50 కోట్ల పైమాటే.. ● ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూ కేటాయింపు ● ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెట్‌ ధర ప్రకారమే భూములు ● ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం రూపాయికే దోచిపెడుతున్న సర్కారు ● లూలూకి బీచ్‌ రోడ్డులో రూ.వేల కోట్ల భూములు అప్పగింత

విశాఖ ఐటీ సెజ్‌ మధురవాడ హిల్‌ నెం.3లో

ఉర్సా కంపెనీకి కేటాయించిన భూములు

లూలూ మాల్‌కు

కేటాయించిన భూములు

ప్రభుత్వ రంగ సంస్థలకు

మార్కెట్‌ ధరకే..!

త ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా రిజిస్ట్రేషన్‌ ధరకు భూములు కేటాయింపులు చేపట్టింది. గతంలో భారత నౌకాదళానికి ఎకరా రూ.కోటి, పోస్టల్‌కు 30 సెంట్లు రూ.కోటి, సీబీఐకి ఎకరా భూమిని రూ.కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వ శాఖలకు కేటాయింపులు జరిగాయి. వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌(వీటీపీఎల్‌)కు ఎకరం రూ.కోటి చొప్పున భూములు కేటాయించింది. 2022లో మధురవాడలో ఎన్‌సీసీ సంస్థకు ఎకరం భూమిని రూ.1.93 కోట్లకు ఇస్తే.. తక్కువ ధరకు అప్పగించేశారంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అదానీ డేటా సెంటర్‌కు కూడా ఎకరం రూ.కోటి చొప్పున కేటాయింపులు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఈఎస్‌ఐ, నేవీ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు కూడా నిబంధనల మేరకు మాత్రమే భూములు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం భూముల్ని దోచి పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, ఉద్యోగాల ముసుగులో పెద్ద ఎత్తున భూదోపిడీతో పాటు భారీగా అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే త్వరలోనే వైజాగ్‌లో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌ పరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రైవేట్‌ సంస్థలకు భూముల ధారాదత్తం

కూటమి సర్కారు కన్ను విశ్వనగరి విశాఖపై పడింది. ఊరు పేరు లేని కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేసేస్తోంది. రూ.50 కోట్లు విలువ చేసే ఎకరం భూమిని 99 పైసలకే కట్టబెట్టేసింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు విశాఖ భూముల రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి రూ.వేల కోట్ల భూ కుంభకోణానానికి తెరతీసిన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అధికారదర్పంతో భూముల పందేరానికి తెగబడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెట్‌ విలువ ప్రకారం భూకేటాయింపులు జరుపుతూ.. ప్రైవేట్‌ కంపెనీలకు కారుచౌకగా భూములను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చౌక బేరం1
1/1

చౌక బేరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement