
సివిల్స్ విజేతకు ఘన సత్కారం
ఎంవీపీకాలనీ: సివిల్స్ విజేత డాక్టర్ రావాడ సాయిమోహిని మానసను ఎంవీపీ కాలనీలోని వైజాగ్ ఐఏఎస్ అకాడమీ ఘనంగా సత్కరించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన ఆమె మంగళవారం విడుదలైన యూపీఎస్ఈ ఫలితాల్లో 975 ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంవీపీలోని అకాడమీలో బుధవారం మానసతో పాటు ఆమె తల్లిదండ్రులు ప్రకాశరావు, ఉషారాణి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ పోతుల గౌతమ్ మాట్లాడుతూ మానస చురుకై న విద్యార్థి అని కొనియాడారు. రెండు సార్లు యూపీఎస్ఈలో ఆమె పలు స్టేజ్లకు అర్హత సాధించిందని, మూడవ ప్రయత్నంలో ఆలిండియాలో 975వ ర్యాంకు సాధించిందన్నారు. వైజాగ్ ఐఏఎస్ అకాడమీ నిరంతరం ఆమెకు వెన్నుదన్నుగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ విజయంతో వైజాగ్ ఐఏఎస్ అకాడమీతో పాటు ఉత్తరాంధ్రకు ఆమె వన్నె తెచ్చారన్నారు. మానస మాట్లాడుతూ ఈ విజయంలో తల్లిదండ్రుల పాత్రతో పాటు వైజాగ్ ఐఏఎస్ అకాడమీ కృషి ఎంతో ఉందన్నారు. సీఎస్బీ బాలలత అందించిన మెలకువలు తన విజయానికి దోహదపడ్డాయన్నారు. ఇక్కడితో తన జర్నీ ఆగిపోలేదని, మరోసారి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమై ఆలిండియాలో టాప్ 10 ర్యాంకు సాధించడమే తన లక్ష్యమన్నారు. సివిల్స్ సాధించాలనే ఆసక్తితో పాటు ప్లానింగ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆన్లైన్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రతీ అభ్యర్థి విజయం సాధించగలరని మానస వివరించారు.