
ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల జోనల్ కమిటీ ఎన్నిక
ఎంవీపీకాలనీ: ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల జోనల్ కమిటీ ఎన్నిక ఎంవీపీ కాలనీ మెడికవర్ హాస్పటల్లోగా జరిగింది. మంగళవారం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు అనంతరం సభ్యులు ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా జోనల్ కమిటీ అధ్యక్షుడిగా జంగం జోషి, ప్రధాన కార్యదర్శిగా గెద్ద చిరంజీవి, ఉపాధ్యక్షులుగా అల్లాడ త్రినాథరావు, ఏలేటి రోజా, ఎస్.శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శలుగా శ్రీనివాసరావు, సూర్యకళ, నారాయణరావు, కోశాధికారిగా పి.కనకారావు ఎన్నికయ్యారు. దీంతోపాటు ఈసీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 150 మంది గ్రామీణ వైద్యులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, సీనియర్, విశ్రాంత వైద్యులు పాల్గొన్నారు.