
జ్యూస్షాపులకు చేపల నిల్వకు వాడే ఐస్
ఎంవీపీకాలనీ: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. జెట్టీల్లో చేపల నిల్వకు వాడే ఐస్ ముక్కలను కొన్ని ఫ్యాక్టరీలు నగరంలోని ఫ్రూట్ జ్యూస్ దుకాణాలకు సరఫరా చేస్తుండటం వారిని అవాక్కయ్యేలా చే సింది. కొంతకాలంగా ఈ తరహా వ్యాపా రం యథేచ్ఛగా జరుగుతున్నట్లు అధికా రులు గుర్తించారు. రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కింజరాపు ప్రభాకర్కు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో సోమవారం సంస్థ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ సంతోష్కుమార్, జిల్లా లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ సిబ్బందితో కూడిన బృందం గాజువాక, మధురవాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లోని ఐస్ తయారీ ఫ్యాక్టరీల్లో దాడులు చేసింది. ఆయా ఫ్యాక్టరీల్లో కలుషిత నీటితో తయారు చేస్తున్న ఐస్ను జ్యూస్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఆహార భద్రత నియమాల ప్రకారం ఆ ఐస్కు నాణ్యత లేకపోవడంతో.. దాన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించకూడదని తేల్చింది. ఆయా ఫ్యాక్టరీల్లో ఐస్ ముక్కలను అధికారులను స్వాధీనం చేసుకుని.. కొన్ని శాంపిల్స్ ల్యాబ్ పరీక్షలకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయా ఫ్యాక్టరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రూ.30 వేల చొప్పున ఫైన్ విధించారు. ల్యాబ్లో పరీక్షించిన అనంతరం, ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయా ఫ్యాక్టరీలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.
విజిలెన్స్ దాడుల్లో వెలుగు చూసిన వైనం
మూడు ఐస్ ఫ్యాక్టరీలకు రూ.30వేల చొప్పున జరిమానా